అన్వేషించండి

India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 

India Monsoon Delay 2026:జూన్1న కేరళను తాకాల్సిన నైరుతి రుతుపవనాలు ఆలస్యమయ్యాయి. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల ఇవి ఎప్పుడు వస్తాయో చూద్దాం. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని ఆలస్యంగా తాకనున్నాయి.
  • అనుకూల పరిస్థితులు లేకపోవడంతో రుతుపవనాలు మార్గమధ్యంలో స్తంభించాయి.
  • కొన్ని రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకే అవకాశాలున్నాయి.
  • వర్షాలపై ఆధారపడిన వ్యవసాయంపై రుతుపవనాల ఆలస్యం ప్రభావం చూపుతుంది.

India Monsoon Delay 2026:దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. నైరుతి రుతుపవన కాలం.జూన్ 1వ తేదీ వచ్చింది అంటే చాలు, కేరళ తీరాన్ని వర్షాలు పలకరిస్తాయి. తద్వారా దేశవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకుంటాయని అందరూ ఆశిస్తారు. అయితే 2026 సీజన్‌లో నైరుతి రుతుపవనాల రాక కోసం కొంత జాప్యం చోటు చేసుకుంది. ముందుగా అంచనా వేసినట్టుగా జూన్ 1న ఇవి కేరళను తాకలేకపోయాయి. వాతావరణ పరిస్థితుల అనుకూలించకపోవడంతో ఇవి ప్రస్తుతం ఉన్నచోటే స్తబ్ధుగా నిలిచిపోయాయి. 

సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు, ఈ సారి ఆ లక్ష్యాన్ని చేరుకోవడంలో విఫలమయ్యాయి. ప్రస్తుతం ఇవి మార్గమధ్యలో నిలిచిపోయాయని భారత్ వాతావరణ శాఖ, ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌  ధ్రువీకరించాయి. రుతుపవనాల ద్రోణి కదలికలు మందగించడమే దీనికి ప్రధాన కారణం. 


  
రుతుపవనాల రాకకు అవసరమైన అనుకూల పరిస్థితులు ప్రస్తుతం లేవని నిపుణులు చెబుతున్నారు. వాతావరణ శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం ఈ జాప్యాన్ని ప్రధాన కారణం ఏంటంటే... అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితులే. ఈ రెండు కూడా రుతుపవనాల పురోగతికి ఆటంకం కలిగిస్తున్నాయి. పశ్చిమ దిశ నుంచి వీచే గాలులు రుతుపవనాలను కేరళ తీరం వైపు నెట్టడంలో సహయపడాలి కానీ ప్రస్తుతం గాలి దిశ, వేగం ఇందుకు అనుకూలంగా లేవు. అయితే ఈ ఆలస్యానికి రాబోయే ఎల్‌నినో ప్రభావానికి ఎలాంటి సంబంధం లేదని స్కైమెట్‌‌ వాతావరణ, వాతావరణ మార్పుల విభాగంలో వైఎస్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ స్పష్టం చేశారు. రుతుపవనాలు కేవలం భారత్‌ పరిసరాల్లోని వాతావరణ వ్యవస్థలపైనే ఆధారపడి కేవలం భారత్ పరిసరాల్లోని వాతావరణ వ్యవస్థపైనే ఆధారపడి ఉంటాయని ఆయన వివరించారు. 

రుతుపవనాల రాకను ఎలా నిర్ణయిస్తారు?

కేరళలోని రుతుపవనాలు ప్రవేశించాయని చెప్పడానికి కొన్ని కచ్చితమైన నియమాలు ఉన్నాయి. అవి పూర్తి  అయితేనే అధికారికంగా రుతుపవనాల రాకను ప్రకటిస్తారు. కేరళ, కర్ణాటక, లక్ష్యద్వీప్‌లోని సుమారు 60 శాతం వాతావరణ కేంద్రాల్లో వరుసగా రెండు రోజులపాటు కనీసం 2.5 మి.మి. వర్షపాతం నమోదు కావాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిమితి ఇంకా నెరవేరలేదు. అందుకే అధికారిక ప్రకటన వెలువడలేదు. 

నైరుతి రుతుపవనాలు ఎప్పుడు రావచ్చు?

ప్రస్తుతానికి రుతుపవనాలు ఆగిపోయినప్పటికీ , ఆశాజనకమైన వార్త కూడా ఉంది. స్కైమెట్‌ అంచనాల ప్రకారం రాబోయే గురువారం లేదా శుక్రవారం నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. వచ్చే 3-4 రోజుల్లో అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, బంగళాఖాతంలోని మెజారిటీ ప్రాంతాలు, కేరళ, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తున్న ఐఎండీ త్వరలోనే రుతుపవనాల రాకపై సవరించిన తేదీని ప్రకటించే అవకాశం ఉంది. 

ఎక్కువ మంది చదివిన ఈ వార్తలు మిస్ అవ్వొద్దు

1 కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
2 ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
3 రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ
4 ఆరెంజ్, పర్పుల్ క్యాప్ విన్నర్లు వీరే
5 ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్

భారత్‌లో రుతుపవనాలకు కేరళ ప్రవేశ ద్వార లాంటిది. ఇక్కడికి రుతుపవనాలు చేరిన తర్వాతే దేశవ్యాప్తంగా వర్షాలు విస్తరిస్తాయి.  వర్షాలపైనే దేశంలోని సుమారు 70 శాతం సాగు భూమి ఆధారపడి ఉంది. రుతుపవనాలు ఆలస్యమైతే విత్తనాలు వేయడం ఆలస్యమవుతుంది. అది ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రోజుల జాప్యం సర్వసాధారణమేనని, రుతుపవనాలు పుంజుకుంటే ఆ తర్వాత వర్షపాతం సాధారణంగానే ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 

Frequently Asked Questions

ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం అవుతుందా?

అవును, ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల రాకలో కొంత జాప్యం చోటు చేసుకుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అవి మార్గమధ్యంలో నిలిచిపోయాయి.

రుతుపవనాల రాకను అధికారికంగా ఎలా ప్రకటిస్తారు?

కేరళ, కర్ణాటక, లక్ష్యద్వీప్‌లోని 60% వాతావరణ కేంద్రాలలో రెండు రోజులు వరుసగా కనీసం 2.5 మి.మి. వర్షపాతం నమోదైతే అధికారికంగా ప్రకటిస్తారు.

నైరుతి రుతుపవనాలు ఎప్పుడు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది?

స్కైమెట్ అంచనాల ప్రకారం, రాబోయే గురువారం లేదా శుక్రవారం నాటికి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది.

రుతుపవనాలు ఆలస్యం అయితే పంటలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

రుతుపవనాలు ఆలస్యమైతే విత్తనాలు వేయడం ఆలస్యమవుతుంది. ఇది ఆహార ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
Team India White Washed VS Ireland T20 Series: ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!
ప‌సికూన చేతిలో భార‌త్ కు ఘోర ప‌రాభ‌వం.. ఒక్క రన్ తేడాతో సిరీస్ కోల్పోయిన వరల్డ్ ఛాంపియన్స్!
Breaking News: టీమిండియాకు బిగ్ షాక్.. టీ20 సిరీస్ సొంతం చేసుకున్న ఐర్లాండ్
టీమిండియాకు బిగ్ షాక్.. టీ20 సిరీస్ సొంతం చేసుకున్న ఐర్లాండ్
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Advertisement

వీడియోలు

Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Kavitha On Idupu Kayitham: ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
ఇడుపు కాయితం టైటిల్ వివాదంలోకి పవన్ కళ్యాణ్‌ను లాగిన కల్వకుంట్ల కవిత! ఫ్యాన్స్ ఊరుకుంటారా?
PM Modi Mann Ki Baat: సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సంక్షోభ సమయంలో నా మాట విని పాటించారు, దేశ ప్రజలకు ధన్యవాదాలు: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PV Narasimha Rao Birth Anniversary Tributes 2026: మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
మహనీయులకు ప్రాంతాలు ఉండవు - విశాఖలోనూ పీవీకి ఘనగా నివాళులు - టీఆర్ఎస్ కవిత వర్సెస్ బీజేపీ విష్ణు
Ayodhya Ram Mandir Donation Row: సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
సిట్ దర్యాప్తులో కీలక విషయాలు.. అయోధ్య కానుకల డబ్బు పంపకాల గొడవతోనే బయటపడ్డ కుట్ర!
Hang Man OTT : ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఆరేళ్ల తర్వాత డైరెక్ట్‌గా ఓటీటీలోకి బ్రహ్మాజీ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget