అన్వేషించండి

Southwest Monsoon Update: నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. మరికొన్ని రోజులు ఎండల మంట తప్పదా!

Southwest Monsoon In Telangana | గత ఏడాది త్వరగానే వచ్చిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యం కానున్నాయి. జూన్ 5 తర్వాతే తెలంగాణలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

అమరావతి: ఈ ఏడాది భారత్‌లో పలు రాష్ట్రాల్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని కొన్ని రోజుల కిందట ఐఎండీ తెలిపింది. అయితే ఈ ఏడాది వానాకాలం ఆలస్యంగా ప్రారంభం కానుంది. నైరుతి రుతుపవనాలు జూన్ ఐదో తేదీ తర్వాతే తెలంగాణ రాష్ట్రాన్ని తాకే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. దేశ దక్షిణ ప్రాంతాన్ని మే 25 నాడే తాకుతాయని తొలుత అంచనా వేశారు. కానీ ఎల్‌నినో (El Nino) పరిస్థితుల కారణంగా నైరుతి రుతుపవనాల కదలికల్లో వేగం తగ్గిందందని అధికారులు తెలిపారు. 

హిందూ మహాసముద్రం, బంగాళాఖాతంలో విస్తరిస్తూ వచ్చిన నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం శ్రీలంక సగం వరకు వచ్చి నిలిచిపోవడంతో ఆలస్యం కానుంది. సాధారణంగా మే చివరికల్లా తెలంగాణను తాకాల్సిన రుతుపవనాలు, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో జూన్ 5 నుంచి 10వ తేదీ మధ్య వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ కారణాలతో ఈ ఏడాది సాధారణం కంటే  వర్షపాతం తక్కువ నమోదయ్యే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొది. జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లోనూ వర్షాలపై ప్రభావం పడుతుందని తెలుస్తోంది. 

ఈ నెలాఖరు వరకు భానుడి ప్రతాపమే
బుధవారం, గురువారాల్లో తెలంగాణలో భానుడి  భగభగలు ఇలాగే కొనసాగుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండ తీవ్రత అధికంగా ఉండటం, ప్రజలు వడదెబ్బతో అధిక సంఖ్యలో చనిపోతుండటంతో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.  జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు,  ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్' జారీ చేయగా, అక్కడ 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వడగాలులు వీస్తున్నందున ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఎన్నో కుటుంబాలలో ఎండ తీవ్రత, వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అదే సమయంలో ద్రోణి కారణంగా కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. 

Also Read: Heatwave In AP and Telangana: వడదెబ్బతో తెలంగాణలో 54 మంది, ఏపీలో 18 మంది మృతి.. చరిత్రలో తొలిసారిగా రెడ్ అలర్ట్

మరోవైపు నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఏపీలో సోమవారం ఒక్కరోజే 18 మంది చనిపోగా, తెలంగాణలో 54 మంది వడదెబ్బ, ఎండ తీవ్రత కారణంగా చనిపోయారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 46 డిగ్రీల పైన, మరో 6 జిల్లాల్లో 45.2 నుంచి 45.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 16 జిల్లాల్లోని 145 మండలాల్లో తీవ్ర వడగాలులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 19 మండలాలు, మంచిర్యాలలో 17 మండలాల్లో, సూర్యాపేటలో 14, ఖమ్మంలో 13 మండలాలతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలు ప్రజలు ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. 

Also Read: Summer Drinks : ఎండల్లో శరీరాన్ని చల్లగా ఉంచాలంటే ఈ డ్రింక్స్ తాగేయండి.. కూల్ డ్రింక్స్ కంటే ఇవే బెస్ట్

ఏపీలోని కృష్ణా జిల్లాలోని కంకిపాడు, పెనమలూరు ప్రాంతాలలో గరిష్ఠంగా 48.1 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదు కాగా, బాపట్ల జిల్లా కూచినపూడిలో 46.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మొత్తం 14 జిల్లాల పరిధిలో ఉన్న 115 మండలాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల మార్కును దాటడం ఎండ తీవ్రతను తెలుపుతుంది. ద్దం పడుతోంది. ఈ కోరలు చాచిన ఎండల వడదెబ్బకు తాళలేక వేర్వేరు ప్రాంతాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. మే నెలాఖరు వరకు ఎండల తీవ్రత ఇలాగే ఉంటుందని, ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచిస్తున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
YSRCP MLA Virupakshi: కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
కర్నూలులో పొలిటికల్ హీట్.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్, అసలేం జరిగిందంటే!
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Ritika Nayak: కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
కొరియన్ అమ్మాయి కాదు... కనకరాజుతో నటించిన హీరోయిన్‌ది ఢిల్లీ - ట్రైలర్‌ లాంచ్‌లో ఫోటోలు
Embed widget