అన్వేషించండి

IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?

ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

Southwest Monsoon | హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  నైరుతి రుతుపవనాల రాకపై ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD Rain Alert) ప్రాథమిక అంచనా వేసింది. దీని కారణంగా అయితే ఈశాన్య, దక్షిణ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన తొలి దశ నివేదికలో పేర్కొంది.

ఈ రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం 
సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు సెప్టెంబర్ 3వ వారం వరకు కొనసాగుతాయి. గత రెండేళ్లుగా వర్షపాతం సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వర్షాలు తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. రుతుపవనాల చివరి దశ నాటికి ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉన్నప్పటికీ, వర్షాలు కురవడానికి కూడా సానుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఏపీ, తెలంగాణలపై ఎల్ నినో ప్రభావం..

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలో వర్షపాతం మిశ్రమంగా ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ, మరికొన్ని చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలకు లోటు లేదని అంచనా వేయగా.. దక్షిణ తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మధ్య కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అధిక వర్షాలు కురస్తాయని అంచనా వేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, రాయలసీమలోని కడప, అన్నమయ్య జిల్లాల్లో మాత్రం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం: స్కైమెట్ అంచనా
భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ ఇటీవల వెల్లడించింది. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలంలో, రెండో భాగంలో ఎల్ నినో (El Nino) ప్రభావం బలంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. దీనివల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ నాలుగు నెలల కాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 868.6 మి.మీ ఉండాలి, కానీ ఈసారి అందులో కేవలం 94 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది.

భారత్‌లో ఏడాది పొడవునా నమోదయ్యే మొత్తం వర్షపాతంలో దాదాపు 70 శాతం కేవలం ఈ నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. దేశ జీడీపీకి వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు అత్యంత ప్రాణాధారం. మన దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నేటికీ జీవనోపాధి కోసం నేరుగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున, వర్షపాతంలో స్వల్ప తగ్గుదల కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

రైతులకు అత్యంత కీలకమైన ఖరీఫ్ సాగు సాధారణంగా జూన్, జూలై నెలల్లోనే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో నైరుతి రుతుపవనాలు సరైన సమయానికి రావడం, దేశవ్యాప్తంగా త్వరగా విస్తరించడం పంటల దిగుబడికి చాలా అవసరం. సాధారణంగా జూన్ 1న లేదా జూన్ మొదటి వారంలో కేరళను తాకే ఈ రుతుపవనాలు, జూలై 15 నాటికి ఉత్తరాది సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తాయి. అయితే, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ విస్తరణలో గానీ, వర్షాల తీవ్రతలో గానీ మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. తదుపరి విచారణ 29కి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. తదుపరి విచారణ 29కి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
Software Engineer Murder: భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
భీమవరంలో ఘోరం.. తనను దూరం పెడుతుందని కత్తితో పొడిచి టెకీ దారుణ హత్య
Kesineni Nani Vs Kesineni Chinni: విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ
విజయవాడలో కాల్ మనీ రాకెట్ - ఎంపీ కేశినేని చిన్నిపై సీఎం చంద్రబాబుకు కేశినేని నాని సంచలన లేఖ
Tirumala News: 116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
116 ఏళ్ల వృద్ధురాలికి శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించిన టీటీడీ
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Prashna Ravan Remand: ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ప్రశ్న రావణ్‌పై రాజద్రోహం కేసు.. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
This Week Theatrical Releases : లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్
లెనిన్ To ఐ నొబడీ - ఈ వారం మాస్ యాక్షన్ మైథలాజికల్ మూవీస్... డోంట్ మిస్
Conjunctivitis : కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
కండ్లకలక ఎందుకు వస్తుంది? లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇంటి చిట్కాలు, చికిత్స ఇవే
Best Cars for Daily Commute:రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా
రోజూ ఆఫీస్‌కు వెళ్లేవారికి ఈ 5 కార్లు బెస్ట్.. ఇందులో మీ కారు ఉందా ? లిస్ట్ చూశారా
Neymar Retirement Shock: నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ , ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
నార్వే చేతిలో బ్రెజిల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కు నేమార్ రిటైర్మెంట్ షాక్, ముగిసిన 16 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం!
Embed widget