అన్వేషించండి

IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?

ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

Southwest Monsoon | హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  నైరుతి రుతుపవనాల రాకపై ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD Rain Alert) ప్రాథమిక అంచనా వేసింది. దీని కారణంగా అయితే ఈశాన్య, దక్షిణ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన తొలి దశ నివేదికలో పేర్కొంది.

ఈ రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం 
సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు సెప్టెంబర్ 3వ వారం వరకు కొనసాగుతాయి. గత రెండేళ్లుగా వర్షపాతం సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వర్షాలు తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. రుతుపవనాల చివరి దశ నాటికి ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉన్నప్పటికీ, వర్షాలు కురవడానికి కూడా సానుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఏపీ, తెలంగాణలపై ఎల్ నినో ప్రభావం..

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలో వర్షపాతం మిశ్రమంగా ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ, మరికొన్ని చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలకు లోటు లేదని అంచనా వేయగా.. దక్షిణ తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మధ్య కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అధిక వర్షాలు కురస్తాయని అంచనా వేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, రాయలసీమలోని కడప, అన్నమయ్య జిల్లాల్లో మాత్రం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం: స్కైమెట్ అంచనా
భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ ఇటీవల వెల్లడించింది. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలంలో, రెండో భాగంలో ఎల్ నినో (El Nino) ప్రభావం బలంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. దీనివల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ నాలుగు నెలల కాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 868.6 మి.మీ ఉండాలి, కానీ ఈసారి అందులో కేవలం 94 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది.

భారత్‌లో ఏడాది పొడవునా నమోదయ్యే మొత్తం వర్షపాతంలో దాదాపు 70 శాతం కేవలం ఈ నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. దేశ జీడీపీకి వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు అత్యంత ప్రాణాధారం. మన దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నేటికీ జీవనోపాధి కోసం నేరుగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున, వర్షపాతంలో స్వల్ప తగ్గుదల కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

రైతులకు అత్యంత కీలకమైన ఖరీఫ్ సాగు సాధారణంగా జూన్, జూలై నెలల్లోనే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో నైరుతి రుతుపవనాలు సరైన సమయానికి రావడం, దేశవ్యాప్తంగా త్వరగా విస్తరించడం పంటల దిగుబడికి చాలా అవసరం. సాధారణంగా జూన్ 1న లేదా జూన్ మొదటి వారంలో కేరళను తాకే ఈ రుతుపవనాలు, జూలై 15 నాటికి ఉత్తరాది సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తాయి. అయితే, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ విస్తరణలో గానీ, వర్షాల తీవ్రతలో గానీ మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
BC Reservations: బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
బీసీల కోసం కేబినెట్ 3 చారిత్రాత్మక నిర్ణయాలు.. రేపు వైసీపీ కేసులు వేస్తుంది: సీఎం చంద్రబాబు
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget