అన్వేషించండి

IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?

ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో వర్షాలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

Southwest Monsoon | హైదరాబాద్/ న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.  నైరుతి రుతుపవనాల రాకపై ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం చూపే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (IMD Rain Alert) ప్రాథమిక అంచనా వేసింది. దీని కారణంగా అయితే ఈశాన్య, దక్షిణ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా విడుదల చేసిన తొలి దశ నివేదికలో పేర్కొంది.

ఈ రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం 
సాధారణంగా జూన్ 1న కేరళను తాకే రుతుపవనాలు సెప్టెంబర్ 3వ వారం వరకు కొనసాగుతాయి. గత రెండేళ్లుగా వర్షపాతం సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈసారి ఎల్‌నినో ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో వర్షాలు తగ్గవచ్చని అధికారులు భావిస్తున్నారు. రుతుపవనాల చివరి దశ నాటికి ఎల్‌నినో మరింత బలపడే అవకాశం ఉన్నప్పటికీ, వర్షాలు కురవడానికి కూడా సానుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 

ఏపీ, తెలంగాణలపై ఎల్ నినో ప్రభావం..

దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలో వర్షపాతం మిశ్రమంగా ఉండనుంది. కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ, మరికొన్ని చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో ఉత్తర తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలకు లోటు లేదని అంచనా వేయగా.. దక్షిణ తెలంగాణలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, మధ్య కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అధిక వర్షాలు కురస్తాయని అంచనా వేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

సాధారణం కంటే ఎక్కువ వర్షాలు
కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అయితే విశాఖపట్నం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాలు, బాపట్ల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, రాయలసీమలోని కడప, అన్నమయ్య జిల్లాల్లో మాత్రం వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండవచ్చని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం: స్కైమెట్ అంచనా
భారత్‌లో ఈ ఏడాది వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ ఇటీవల వెల్లడించింది. ముఖ్యంగా జూన్ నుండి సెప్టెంబర్ వరకు కొనసాగే నైరుతి రుతుపవనాల కాలంలో, రెండో భాగంలో ఎల్ నినో (El Nino) ప్రభావం బలంగా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంది. దీనివల్ల వర్షాలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణంగా ఈ నాలుగు నెలల కాలంలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 868.6 మి.మీ ఉండాలి, కానీ ఈసారి అందులో కేవలం 94 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది.

భారత్‌లో ఏడాది పొడవునా నమోదయ్యే మొత్తం వర్షపాతంలో దాదాపు 70 శాతం కేవలం ఈ నైరుతి రుతుపవనాల ద్వారానే లభిస్తుంది. దేశ జీడీపీకి వెన్నెముకగా నిలిచే వ్యవసాయ రంగానికి ఈ వర్షాలు అత్యంత ప్రాణాధారం. మన దేశ జనాభాలో సగానికి పైగా ప్రజలు నేటికీ జీవనోపాధి కోసం నేరుగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నందున, వర్షపాతంలో స్వల్ప తగ్గుదల కూడా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

రైతులకు అత్యంత కీలకమైన ఖరీఫ్ సాగు సాధారణంగా జూన్, జూలై నెలల్లోనే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో నైరుతి రుతుపవనాలు సరైన సమయానికి రావడం, దేశవ్యాప్తంగా త్వరగా విస్తరించడం పంటల దిగుబడికి చాలా అవసరం. సాధారణంగా జూన్ 1న లేదా జూన్ మొదటి వారంలో కేరళను తాకే ఈ రుతుపవనాలు, జూలై 15 నాటికి ఉత్తరాది సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తాయి. అయితే, ఎల్ నినో ప్రభావం వల్ల ఈ విస్తరణలో గానీ, వర్షాల తీవ్రతలో గానీ మార్పులు వచ్చే అవకాశం ఉండటంతో అన్నదాతల్లో ఆందోళన నెలకొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Supreme Court On NEET Paper Leak: పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
పేపర్ లీక్ ఆందోళనలో విద్యార్థులకు గుడ్‌న్యూస్.. కేసులు ఎత్తివేసి, విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు
Breaking News: నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
నీట్ పేపర్ లీక్ ఆందోళన కేసులో విద్యార్థులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Chandrababu Serious On Bonda Uma: వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!
వైసీపీతో వేదికలు పంచుకుంటే వేటే? - బొండా ఉమా ఎపిసోడ్‌తో టీడీపీ క్రమశిక్షణకు చంద్రబాబు కఠిన పరీక్ష!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget