అన్వేషించండి

Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి

Telangana Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారమే లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయనున్నట్లు తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • దరఖాస్తుల నమోదుకు ధృవీకరణ పత్రాలు సులభంగా అందించాలని ఆదేశించారు.

Telangana New Pensions | హైదరాబాద్: తెలంగాణలోని పలు బలహీన వర్గాలకు సామాజిక భద్రతను అందించే దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. చేయూత సామాజిక భద్రత పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పోవర్టీ (SERP) గ్రామీణాభివృద్ధి శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా మొదటి విడతలో ప్రాధాన్య క్రమంలో లబ్ధిదారులకు కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తొలి విడత పింఛన్లలో వీరికే ప్రాధాన్యం

తొలి విడత ప్రాధాన్యత జాబితాలో ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, ఫైలేరియా బాధితులు, రక్త సంబంధ వైకల్య సమస్యలైన థలసేమియా, సికిల్ సెల్ డిసీజ్, హీమోఫీలియాతో బాధపడుతున్న వ్యక్తులను లబ్దిదారులుగా చేర్చారు. గతం 2014-18లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల (G.O.Ms) ప్రకారమే వీటి అర్హత ప్రమాణాలు అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు మళ్లీ అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్తగా దరఖాస్తు చేసేవారికి ఆగస్టు 31 వరకు అవకాశం కల్పించారు.

-  వితంతువులు
-  ఒంటరి మహిళలు 
-  దివ్యాంగులు
-  కల్లుగీత కార్మికులు
-  చేనేత కార్మికులు
-  ఫైలేరియా
-  తలసేమియా
-  సికిల్ సెల్
-  హీమోఫీలియా బాధితులు


Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి

కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ కోసం ప్రజా పాలన వారోత్సవాలు, ప్రగతి ప్రణాళిక 99 రోజుల గ్రామసభలతో పాటు ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నింటినీ ఏకరూప దరఖాస్తు నమూనా విధానంలో చేయూత పోర్టల్ (https://www.cheyutha.telangana.gov.in/) నమోదు చేయనున్నారు. దరఖాస్తుదారులకు అవసరమైన ధృవీకరణ పత్రాలను సులభంగా పొందేలా సంబంధిత జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వితంతువులకు భర్త మరణ ధృవీకరణ పత్రం, ఒంటరి మహిళలకు విడాకులు/ స్థానిక విచారణ నివేదిక, గీత కార్మికులకు అబ్కారీ శాఖ, చేనేత కార్మికులకు చేనేత శాఖ,  ఫైలేరియా బాధితులకు వైద్యారోగ్య శాఖల నుంచి ధృవీకరణ పత్రాలు వేగవంతంగా జారీ చేసేందుకు సైతం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

 చేయూత వెబ్‌సైట్ https://www.cheyutha.telangana.gov.in/ కు వెళ్లాలి.

Cheyutha Application forms అని కనిపిస్తుంది. అందులో తెలుగు, ఇంగ్లీష్ పీడీఎఫ్ అప్లికేషన్ ఫారమ్ ఉంటాయి.

వాటి మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ ఫారం డౌన్ లోడ్ అవుతుంది.

మీ వివరాలు, కేటగిరి నింపి సంబంధిత డాక్యుమెంట్స్ తో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

 

Frequently Asked Questions

కొత్త పింఛన్ల దరఖాస్తులను ఎలా స్వీకరించి, నమోదు చేస్తారు?

ప్రజా పాలన వారోత్సవాలు, గ్రామసభలు, ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులను చేయూత పోర్టల్లో నమోదు చేస్తారు. ధృవీకరణ పత్రాలు సులభంగా పొందేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకుంటారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Khudiram Bose:18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
18 ఏళ్లకే ఉరి పీఠాన్ని ముద్దాడిన విప్లవ వీరుడు! ఖుదీరామ్‌ బోస్‌ బలిదానానికి 116 ఏళ్లు!
Embed widget