అన్వేషించండి

Hyderabad Corruption: అడుగుకో అవినీతి తిమింగలం - ఏసీబీ పట్టుకున్నా శిక్ష డౌటే - మరి ఎందుకు ఆగుతారు?

Telangana ACB : జలమండలి అధికారి ఇంట్లో వందల కోట్ల ఆస్తులు బయటపడ్డాయి. ఇలాంటి వారిని గతంలో చాలా మందిని పట్టుకున్నారు.ఎవరికీ శిక్షలు పడకపోవడంతోనే మళ్లీ మళ్లీ ఇలాంటి వారు పుట్టుకొస్తున్నారు.

Government Officer Corruption:హైదరాబాద్ జలమండలి  జనరల్ మేనేజర్ కుమార్ నివాసాలపై జరిగిన ఏసీబీ దాడులు, అక్కడ బయటపడిన రూ. 100 కోట్ల అక్రమ ఆస్తుల ఉదంతం నగరంలో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో మరోసారి నిరూపించింది. నెలకు లక్షన్నర రూపాయల పరిమిత జీతం తీసుకునే ఒక ప్రభుత్వ ఉద్యోగి, కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే ఇంతటి భారీ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించగలిగారనే ప్రశ్న సామాన్యుడిని విస్మయానికి గురిచేస్తోంది.   
 
 రియల్ ఎస్టేట్‌ను శాసిస్తున్న అవినీతి  పెట్టుబడులు 

హైదరాబాద్ మహానగర పరిధిలోని ప్రభుత్వ శాఖలైన జీహెచ్‌ఎంసీ, జలమండలి, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ , టౌన్ ప్లానింగ్ విభాగాల్లో అవినీతి అనేది ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. లంచాల రూపంలో వస్తున్న ఈ అక్రమ సొమ్మంతా మెట్రో నగర శివార్లలోని రియల్ ఎస్టేట్ రంగంలోకి అడ్డూఅదుపూ లేకుండా ప్రవహిస్తోంది. ఐటీ కారిడార్‌లోని విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు, బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు, రీజినల్ రింగ్ రోడ్డు పరిసరాల్లోని వందలాది ఎకరాల ల్యాండ్ బ్యాంకులు మెజారిటీ భాగం ఇలాంటి  కలుషిత  సంపాదనతోనే కొనుగోలు చేస్తున్నారు.  నిజాయితీగా సంపాదించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు లేదా వ్యాపారవేత్తల కంటే, ఇరుకు గదుల్లో కూర్చునే అవినీతి ప్రభుత్వ అధికారులే నేడు రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను శాసిస్తూ ధరలను కృత్రిమంగా పెంచుతున్నారు.

 దాడుల హంగామా.. శిక్షల్లో శూన్యం 

అక్రమార్కులను పట్టుకోవడానికి ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ కేసుల పర్యవసానాలు శూన్యంగా మారుతున్నాయి. ఇటీవల వెలువడిన గణాంకాల ప్రకారం, తెలంగాణ ఏసీబీ నమోదు చేస్తున్న కేసుల్లో నిందితులకు కోర్టుల ద్వారా శిక్షలు పడుతున్న రేటు అత్యంత నిరాశాజనకంగా ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల  కేసుల్లో శిక్షల శాతం కేవలం 20 నుండి 25 శాతం లోపే ఉంటోంది. అంటే, పట్టుబడిన ప్రతి పది మంది అవినీతి అధికారుల్లో కనీసం ఏడుగురు చట్టంలోని  లోపాల ద్వారా క్లీన్ చిట్‌తో బయటకు వస్తున్నారు లేదా కేసులను దశాబ్దాల పాటు సాగదీసి సాక్ష్యాలు లేకుండా చేస్తున్నారు. ఈ సేఫ్ ఎగ్జిట్  భరోసాయే అధికారులను మరింతగా బరితెగించేలా చేస్తోంది.

 దర్యాప్తులో వ్యవస్థాగత లోపాలు 

ఈ వైఫల్యానికి ప్రధాన కారణం ఏసీబీ దర్యాప్తులో కనిపిస్తున్న లోపాలు . పక్కా సాక్ష్యాధారాలను కోర్టుల ముందుంచలేకపోవడమే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఆస్తుల విలువను కట్టేటప్పుడు దర్యాప్తు అధికారులు మార్కెట్ విలువను కాకుండా పాత రిజిస్ట్రేషన్ విలువను ప్రామాణికంగా తీసుకోవడం నిందితులకు మేలు చేస్తోంది. బెనామీల పేరిట ఉన్న ఆస్తులకు, సదరు అధికారికి ఉన్న ఆర్థిక సంబంధాలను చట్టబద్ధంగా నిరూపించడంలో   విఫలమవుతోంది. దీనికి తోడు, కేసు నమోదైన తర్వాత చార్జ్‌షీట్ దాఖలు చేయడానికే ఏసీబీకి సంవత్సరాల సమయం పడుతుండటంతో కీలక సాక్ష్యాలు కనుమరుగవుతున్నాయి.

 రాజకీయ అండదండలు.. సెక్షన్ల మాయాజాలం 

పట్టుబడిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంలో మరియు న్యాయస్థానాల్లో విచారణ జరపడానికి అవసరమైన ప్రభుత్వ అనుమతులు రావడంలో జరుగుతున్న జాప్యం అవినీతి నిరోధక చట్టం ఆత్మను దెబ్బతీస్తోంది. ఉన్నతాధికారుల, రాజకీయ నాయకుల అండదండలు ఉన్న లంచగొండులకు ఈ శాంక్షన్లు రాకుండా తెరవెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ సాగుతుంది. ఒకవేళ ఏసీబీ గట్టిగా ప్రయత్నించి సస్పెండ్ చేయించినా, కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే వారు ట్రిబ్యునళ్లు లేదా కోర్టుల నుండి స్టేలు తెచ్చుకుని, తిరిగి అదే శాఖల్లో కీలకమైన పోస్టుల్లో కొలువుదీరుతున్నారు. జలమండలి కేసులోనూ గతంలో ఇలాంటి అనుభవాలే వెలుగుచూశాయి. 

 మార్పు ఎక్కడ రావాలి? 

అవినీతి అధికారులు తమ సంపాదనను కేవలం నగదు రూపంలో కాకుండా, ఇతర దేశాల్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ లేదా సుదూర ప్రాంతాల్లో బినామీల పేరుతో భూములుగా మారుస్తున్నారు. ఏసీబీ వద్ద ఉన్న పాత తరం దర్యాప్తు పద్ధతులు ఈ ఆధునిక  వైట్ కాలర్ నేరాలను ఛేదించలేకపోతున్నాయి. ఫోరెన్సిక్ ఆడిటింగ్ మరియు డిజిటల్ ఎవిడెన్స్ సేకరణలో ఏసీబీ బలోపేతం కాకపోవడం వల్ల, కోర్టుల్లో నిందితుల తరపు న్యాయవాదులు సాంకేతిక కారణాలతో కేసులను కొట్టివేయించగలుగుతున్నారు. దీనివల్ల పట్టుబడటం అనేది ఒక చిన్న ప్రమాదం మాత్రమే, శిక్ష పడటం అసాధ్యం  అనే భావన అవినీతి తిమింగలాల్లో బలపడింది.  ఏసీబీ కేవలం దాడుల నాటి హంగామాకే పరిమితం కాకుండా, ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా ఏడాది లోపే నిందితుల ఆస్తులను జప్తు చేసే అధికారాలను పొందాలి. పట్టుబడిన వెంటనే ఆస్తులను ప్రభుత్వ పరం చేసే విధానం వస్తేనే భయం మొదలవుతుంది. ఏసీబీకి స్వయంప్రతిపత్తి కల్పించడంతో పాటు, ప్రాసిక్యూషన్ విభాగాన్ని అత్యున్నత స్థాయి న్యాయ నిపుణులతో బలోపేతం చేయాలి. అప్పుడే, లక్షల్లో జీతం ఉండి కోట్లలో ఆస్తులు కూడబెట్టే అధికారుల అక్రమ దాహానికి బ్రేకులు పడతాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirupati Latest News:
"వైఎస్ జగన్ ఇంటి ముందే కుటుంబంతో ఆ*త్మ*హత్య చేసుకుంటా" భూమన బాధితుడి హెచ్చరిక!
PM Modi:
"క్యాంపస్ లైఫ్‌కు, బయటి ప్రపంచానికి చాలా తేడా ఉంది, ప్రశ్న గుర్తించి సమాధానాలు వెతుక్కోవాలి" ఐఐటి ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రసంగం 
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Telangana High Court: హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
హైడ్రాకు హైకోర్టు షాక్: రంగనాథ్‌కు, అధికారులకు ధిక్కరణ నోటీసులు
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
Embed widget