అన్వేషించండి

హిమాచల్ ప్రదేశ్‌ రాజకీయాల్లో నంబర్ గేమ్,అలా జరిగితే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎసరే

Himachal Pradesh Political Crisis: హిమాచల్ ప్రదేశ్‌లో పొలిటికల్ నంబర్ గేమ్ ఉత్కంఠ పెంచుతోంది.

Himachal Political Crisis: ప్రస్తుతం కాంగ్రెస్ చేతిలో ఉంది మూడు రాష్ట్రాలు మాత్రమే. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ. కర్ణాటకలో ఇప్పటికే ఏదో ఓ రాజకీయ అలజడి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ (Himachal Pradesh Political Crisis) ఇది మొదలైంది. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో కాంగ్రెస్‌లో టెన్షన్ మొదలైంది. ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. 68 మంది సభ్యులున్న హిమాచల్ ప్రదేశ్‌లో 40 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాజ్యసభ ఎన్నికల్లో ఈ 40 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వీకే మద్దతునిస్తారని అంతా ఊహించారు. కానీ ఉన్నట్టుండి ఆరుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి సపోర్ట్ ఇవ్వడం వల్ల హర్ష్ మహాజన్ గెలుపొందారు. ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు బీజేపీకి మద్దతునిచ్చారు. ఈ ఓటింగ్ అయిపోయిన వెంటనే వాళ్లంతా హరియాణాకి వెళ్లిపోయారు. ప్రస్తుతం హరియాణాలో బీజేపీయే అధికారంలో ఉంది. మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వీర్‌భద్ర సింగ్ కొడుకు విక్రమాదిత్య సింగ్ ఇప్పటికే మంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీ క్రమంగా పతనమవుతోందని మండి పడ్డారు. కాంగ్రెస్ ప్రజల నమ్మకం కోల్పోతోందని విమర్శించారు. ఈ క్రమంలోనే నంబర్ గేమ్‌ మొదలైంది. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏ పార్టీకి ఎంత మంది మద్దతునిస్తున్నారన్న చర్చ మొదలైంది. 

హిమాచల్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 35 సీట్లలో విజయం సాధిస్తే ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది. 2022లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 40 చోట్ల విజయం సాధించింది. బీజేపీ 25 సీట్లకు పరిమితమైంది. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కాంగ్రెస్‌ బలం మొత్తం 43కి చేరుకుంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల్ని పరిశీలిస్తే...ఒకవేళ ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు తమ మద్దతుని ఉపసంహరించుకుంటే కాంగ్రెస్‌ బలం 34కి పడిపోతుంది. అంటే...మ్యాజిక్ ఫిగర్‌ కోల్పోతుంది. అంటే ప్రభుత్వం కూలిపోతుంది. అయితే...అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు సరిగ్గా జరగవని, ఈలోగానే ప్రభుత్వం కూలిపోతుందని కొంతమంది వాదించారు. కానీ...బడ్జెట్‌ని ప్రవేశపెట్టడమే కాకుండా దానికి ఆమోదం కూడా తెలిపింది సుఖ్వీందర్ సింగ్ సర్కార్. అంతే కాదు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న బీజేపీ కుట్ర పని చేయలేదని సుఖ్వీందర్ తేల్చి చెప్పారు. అంతే కాదు. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేసిన ఎమ్మెల్యేలు తమకు క్షమాపణలు చెప్పారని వెల్లడించారు. ఐదేళ్ల పాటు తమ ప్రభుత్వం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Hyundai Venue లేదా Kia Syros.. టాప్ వేరియంట్లో ఏ SUV బెస్ట్, కొనే ముందు ఇది తెలుసుకోండి
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
Embed widget