అన్వేషించండి

Gas Cylinder E KYC: రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్ స్కీమ్‌ అప్‌డేట్‌ - స్వీట్ న్యూస్ చెప్పిన ఎల్పీజీ అఫీషియల్స్

Gas Cylinder: గ్యాస్ వినియోగదారులు ఈ - కేవైసీ కోసం ఆఫీసులకు రావాల్సిన పని లేదని, డెలివరీ బాయ్స్ వద్దే ఈ ప్రక్రియ పూర్తి చెయ్యొచ్చని LPG డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు

E KYC Process on Gas Cylinder Distribution: తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో 6 గ్యారెంటీల అమలు చేసేలా ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎంగా బాధ్యతలు చేపట్టిన రెండో రోజే 'మహాలక్ష్మి' (Mahalaxmi) కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు వంటి వాటిని అమలు చేశారు. మిగిలిన హామీలను కూడా అమలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో రూ.500కే గ్యాస్ సిలిండర్ (500 Rupees Gas Cylinder) అందిస్తామని ప్రకటించింది. సబ్సిడీ సిలిండర్ అందాలంటే ఈ కేవైసీ తప్పనిసరి అని కొందరు ప్రచారం చేశారు. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీలకు ఈ కేవైసీ ప్రక్రియ కోసం పరుగులు తీశారు. అయితే, ఇప్పటివరకూ రూ.500లకే సిలిండర్ హామీ అమలుకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు అందలేదని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అలాగే 'ఈ కేవైసీ' కోసం కూడా గ్యాస్ ఏజెన్సీ ఆఫీసులకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇంటి వద్దే ఈ కేవైసీ

గ్యాస్ సిలిండర్ ఈ కేవైసీకి సంబంధించి ఆఫీసులకు గుంపులుగా వచ్చి ఇబ్బందులు పడొద్దని ప్రజలకు సూచించారు. డెలివరీ బాయ్స్ వద్దే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గ్యాస్ ఈ కేవైసీకి సంబంధించి కేంద్రం ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని, వీలైనంత త్వరగా వినియోగదారుల ఇంటి వద్దకే వెళ్లి కేవైసీ పూర్తి చేయాలని తమకు ఆదేశాలు అందినట్లు చెప్పారు. డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా కేవైసీ ప్రక్రియ పూర్తి చెయ్యొచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ బాయ్స్ వద్ద ఎవరిదైనా పూర్తి కాకపోతే, అలాంటి వారు మాత్రమే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్లాలని తెలిపారు.

రూ.500కే సిలిండర్ పై కసరత్తు

మరోవైపు, 'మహాలక్ష్మి' పథకంలో భాగంగా రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేయాలని పౌర సరఫరాల శాఖకు తాజాగా ఆదేశాలు అందాయి. ఈ పథకం లబ్ధిదారుల ఎంపిక కోసం ఆ శాఖ 2 రకాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రేషన్ కార్డు ఉన్న వారితో పాటు లేని వారిలోనూ లబ్ధిదారులను ఎంపిక చేయడం ఒకటి, రేషన్ కార్డులతో సంబంధం లేకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడం ఇంకొకటిగా ప్రతిపాదించింది.

సుమారు కోటి కనెక్షన్లు

తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు ఉండగా హెచ్‌పీసీఎల్‌ నుంచి 43.40 లక్షలు, ఐఓసీఎల్‌ నుంచి 47.97 లక్షలు, బీపీసీఎల్‌ నుంచి 29.04 లక్షల వినియోగదారులు ఉన్నారు. వీరిలో 44 శాతం మంది అంటే 52.80 లక్షల మంది ప్రతి నెలా సిలిండర్ బుక్ చేసుకుంటున్నారు. 89.99 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డు ఉండగా, తొలి ప్రతిపాదన ప్రకారం వీరికి పథకాన్ని వర్తింపచెయ్యొచ్చు. అయితే, వీరిలో అనర్హులు కూడా లబ్ధి పొందే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రెండో ప్రతిపాదన మేరకు లబ్ధి దారుల ఎంపికకు సమయం ఎక్కువ పడుతుంది. ఈ మేరకు నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అధికారులు అందజేశారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.955 కాగా, సాధారణ కనెక్షన్లు ఒక్కో బుకింగ్ కు కేంద్రం రూ.40 రాయితీ అందిస్తోంది. ఉజ్వల్ కనెక్షన్లకు రూ.340 రాయితీ లభిస్తోంది. తెలంగాణలో మొత్తం 11.58 లక్షల ఉజ్వల్ కనెక్షన్లుండగా, కేంద్రం విజ్ఞప్తి మేరకు 'గివ్ ఇట్ అప్'లో భాగంగా రాష్ట్రంలో 4.2 లక్షల మంది రాయితీ వదులుకున్నారు. ఈ పథకం కింద ఏడాదికి ప్రతి లబ్ధిదారునికి 6 గ్యాస్ సిలిండర్లు ఇస్తే ప్రభుత్వంపై దాదాపు రూ.2,225 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. అదే 12 సిలిండర్లు ఇస్తే ఆ భారం డబుల్ అవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Breaking News Live Telugu Updates: తెలంగాణ అసెంబ్లీలో నేడు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Hero Xoom 125 లో రెండు వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Hero Xoom 125 VX vs ZX - ₹8,000 తేడాతో ఏ ఫీచర్లు మారాయి?
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget