అన్వేషించండి

Rahul Gandhi on Modi: విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ పరువు తీసే వ్యక్తి మోడీ: రాహుల్ గాంధీ

Rahul Gandhi on Modi: విదేశాల్లో భారత్ ను అవమానపరిచారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. తానెప్పుడూ అలా దేశాన్ని అవమానపరచలేదని, అలా చేసింది మోదీనేనని పేర్కొన్నారు.

Rahul Gandhi on Modi: భారతదేశం గురించి విదేశాల్లో అవమానపరిచేలా మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. విదేశీ గడ్డపై తాను ఎప్పుడూ భారత్ ను అవమానపరచలేదని, ఆ పని ప్రధాని మోదీనే చేశారని రాహుల్ అన్నారు. నాకు గుర్తున్నాయ్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని ఏళ్లలో దేశంలో ఏ అభివృద్ది జరగలేదని విదేశీ గడ్డపై ప్రధాని మోదీ పేర్కొనడం తనకు గుర్తుందని రాహుల్ అన్నారు. ఆ కాలంలో అపరిమిత స్థాయిలో అవినీతి జరిగిందని మోదీ చెప్పడం గుర్తుందని తెలిపారు. తానెప్పుడు దేశం పరువు తీయలేదని, తీయాలన్న ఉద్దేశం, ఆసక్తి కూడా తనకు లేదని, తన మాటలను వక్రీకరించడం బీజేపీ నాయకులకు ఇష్టమని రాహుల్ అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ పరువు తీసేది ప్రధాన మోదీ అన్నది వాస్తవమని పేర్కొన్నారు. 'స్వాతంత్య్ర వచ్చిన దగ్గరి నుంచి భారత్‌లో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని ప్రధాని చేసిన ప్రసంగం మీరు వినలేదా?' అని రాహుల్ ప్రశ్నించారు. మోదీ తన మాటలతో భారతీయులను అవమానపరిచారని రాహుల్ మండిపడ్డారు.

కేంబ్రిడ్జిలో రాహుల్ గాంధీ

రెండ్రోజుల క్రితం కేంబ్రిడ్జి బిజినెస్ స్కూల్‌లో రాహుల్ మాట్లాడుతూ మోదీ సర్కారుపై విమర్శలు చేశారు. భారతీయ ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని అన్నారు. సమంజసం కాని క్రిమినల్ కేసుల భయం ప్రతిపక్ష నేతలను వెంటాడుతోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రాథమికాంశాలైన పార్లమెంటు, స్వేచ్ఛాయుత పత్రికా రంగం, న్యాయ వ్యవస్థ ఆంక్షలను ఎదుర్కొంటున్నాయని రాహుల్ విమర్శించారు.  తనతోపాటు చాలా మంది రాజకీయ నేతలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ ను భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందని రాహుల్ అన్నారు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనకు చెప్పారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ లో చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. పొరుగు దేశం పాక్ సైతం ఎప్పుడూ ఆ సాహం చేయలేదని బీజేపీ పేర్కొంది. 

2015లో దుబాయ్ లో మోదీ..

ఎలాంటి నిర్ణయాలు తీసుకోని గత ప్రభుత్వం నుంచి వచ్చిన సమస్యలు ఉన్నాయంటూ 2015లో దుబాయ్ లో మోదీ కాంగ్రెస్ సర్కారు పాలనపై విమర్శలు చేశారు. గతంలో భారతీయులు దేశంలో జన్మించినందుకు చింతిస్తూ.. దేశం విడిచివెళ్లిపోయే పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం మాత్రం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆదాయం తక్కువైనా వారంతా స్వదేశానికి రావడానికి మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రజల ఆలోచన మారిందంటూ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.  ప్రస్తుతం ఆనాడు మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ నేతలపై, సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. నాకు గుర్తుంది అంటూ ఆనాడు మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మోదీపై, బీజేపీ నాయకులపై మండిపడ్డారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Karimnagar Crime News: ఫాలోవర్స్‌తో ఏకాంతంగా గడిపిన భార్య- వీడియోలు షూట్ చేసిన భర్త- డబ్బుల కోసం కరీంనగర్ దంపతుల కన్నింగ్ ప్లాన్  
ఫాలోవర్స్‌తో ఏకాంతంగా గడిపిన భార్య- వీడియోలు షూట్ చేసిన భర్త- డబ్బుల కోసం కరీంనగర్ దంపతుల కన్నింగ్ ప్లాన్  
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

వీడియోలు

AA 23 Announcement Video Decode | Allu Arjun తో ఏం ప్లాన్ చేశావయ్యా Lokesh Kanagaraj | ABP Desam
Mumbai Indians vs Gujarat Giants WPL 2026 | హర్మన్‌ప్రీత్ కౌర్ విధ్వంసం!
Ind vs NZ Shreyas Iyer Records | రికార్డు సృష్టించనున్న శ్రేయస్ అయ్యర్!
Jitesh Sharma Being Dropped from T20 World Cup | వరల్డ్ కప్ జితేష్ సంచలన వ్యాఖ్యలు!
India vs New Zealand 2nd ODI | టీమిండియాలో భారీ మార్పులు ?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karimnagar Crime News: ఫాలోవర్స్‌తో ఏకాంతంగా గడిపిన భార్య- వీడియోలు షూట్ చేసిన భర్త- డబ్బుల కోసం కరీంనగర్ దంపతుల కన్నింగ్ ప్లాన్  
ఫాలోవర్స్‌తో ఏకాంతంగా గడిపిన భార్య- వీడియోలు షూట్ చేసిన భర్త- డబ్బుల కోసం కరీంనగర్ దంపతుల కన్నింగ్ ప్లాన్  
Harish Rao: సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
సజ్జనార్.. ఖాకీ దుస్తులు తీసేసి కాంగ్రెస్ కండువా కప్పుకో - హరీష్ రావు ఆగ్రహం
Bullet Bike Prize in Cockfights: కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
కోడి పందేలు.. వరుస విజయాలతో బుల్లెట్‌ బైక్ నెగ్గిన పందెం రాయుళ్లు
Chandrababu Sankranti Celebrations: నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు
Heart Attacks : Winterలో గుండెపోటు ముప్పు ఎవరికి ఎక్కువ? గుండె ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరికలు ఇవే
Winterలో గుండెపోటు ముప్పు ఎవరికి ఎక్కువ? గుండె ఆరోగ్యంపై వైద్యుల హెచ్చరికలు ఇవే
Ind vs nz 2nd odi highlights: రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
రాజ్‌కోట్‌లో భారత్ ఓటమి.. డారిల్ మిచెల్ సెంచరీతో న్యూజిలాండ్ ఘనవిజయం.. 1-1తో సిరీస్ సమం
Rama Navami 2026: అయోధ్య కాకుండా భారతదేశంలో 4 ప్రసిద్ధ రామ మందిరాలు, రామ భక్తులు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలు!
అయోధ్య కాకుండా భారతదేశంలో 4 ప్రసిద్ధ రామ మందిరాలు, రామ భక్తులు తప్పనిసరిగా దర్శించాల్సిన ప్రదేశాలు!
Nagoba Jatara 2026: నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
నాగోబా జాతర సందర్భంగా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్
Embed widget