News
News
X

Rahul Gandhi on Modi: విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ పరువు తీసే వ్యక్తి మోడీ: రాహుల్ గాంధీ

Rahul Gandhi on Modi: విదేశాల్లో భారత్ ను అవమానపరిచారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను రాహుల్ తిప్పికొట్టారు. తానెప్పుడూ అలా దేశాన్ని అవమానపరచలేదని, అలా చేసింది మోదీనేనని పేర్కొన్నారు.

FOLLOW US: 
Share:

Rahul Gandhi on Modi: భారతదేశం గురించి విదేశాల్లో అవమానపరిచేలా మాట్లాడుతున్నారని బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను రాహుల్ గాంధీ తిప్పికొట్టారు. విదేశీ గడ్డపై తాను ఎప్పుడూ భారత్ ను అవమానపరచలేదని, ఆ పని ప్రధాని మోదీనే చేశారని రాహుల్ అన్నారు. నాకు గుర్తున్నాయ్ అంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. భారత్ కు స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని ఏళ్లలో దేశంలో ఏ అభివృద్ది జరగలేదని విదేశీ గడ్డపై ప్రధాని మోదీ పేర్కొనడం తనకు గుర్తుందని రాహుల్ అన్నారు. ఆ కాలంలో అపరిమిత స్థాయిలో అవినీతి జరిగిందని మోదీ చెప్పడం గుర్తుందని తెలిపారు. తానెప్పుడు దేశం పరువు తీయలేదని, తీయాలన్న ఉద్దేశం, ఆసక్తి కూడా తనకు లేదని, తన మాటలను వక్రీకరించడం బీజేపీ నాయకులకు ఇష్టమని రాహుల్ అన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు భారత్ పరువు తీసేది ప్రధాన మోదీ అన్నది వాస్తవమని పేర్కొన్నారు. 'స్వాతంత్య్ర వచ్చిన దగ్గరి నుంచి భారత్‌లో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదని ప్రధాని చేసిన ప్రసంగం మీరు వినలేదా?' అని రాహుల్ ప్రశ్నించారు. మోదీ తన మాటలతో భారతీయులను అవమానపరిచారని రాహుల్ మండిపడ్డారు.

కేంబ్రిడ్జిలో రాహుల్ గాంధీ

రెండ్రోజుల క్రితం కేంబ్రిడ్జి బిజినెస్ స్కూల్‌లో రాహుల్ మాట్లాడుతూ మోదీ సర్కారుపై విమర్శలు చేశారు. భారతీయ ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని అన్నారు. సమంజసం కాని క్రిమినల్ కేసుల భయం ప్రతిపక్ష నేతలను వెంటాడుతోందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రాథమికాంశాలైన పార్లమెంటు, స్వేచ్ఛాయుత పత్రికా రంగం, న్యాయ వ్యవస్థ ఆంక్షలను ఎదుర్కొంటున్నాయని రాహుల్ విమర్శించారు.  తనతోపాటు చాలా మంది రాజకీయ నేతలపై నిఘా పెట్టేందుకు ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ ను భారత దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తోందని రాహుల్ అన్నారు. ఫోన్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఇంటెలిజెన్స్ అధికారులు తనకు చెప్పారని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ లో చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. పొరుగు దేశం పాక్ సైతం ఎప్పుడూ ఆ సాహం చేయలేదని బీజేపీ పేర్కొంది. 

2015లో దుబాయ్ లో మోదీ..

ఎలాంటి నిర్ణయాలు తీసుకోని గత ప్రభుత్వం నుంచి వచ్చిన సమస్యలు ఉన్నాయంటూ 2015లో దుబాయ్ లో మోదీ కాంగ్రెస్ సర్కారు పాలనపై విమర్శలు చేశారు. గతంలో భారతీయులు దేశంలో జన్మించినందుకు చింతిస్తూ.. దేశం విడిచివెళ్లిపోయే పరిస్థితి ఉండేదని, కానీ ప్రస్తుతం మాత్రం ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఆదాయం తక్కువైనా వారంతా స్వదేశానికి రావడానికి మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రజల ఆలోచన మారిందంటూ మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.  ప్రస్తుతం ఆనాడు మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీజేపీ నేతలపై, సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. నాకు గుర్తుంది అంటూ ఆనాడు మోదీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మోదీపై, బీజేపీ నాయకులపై మండిపడ్డారు.

Published at : 06 Mar 2023 03:02 PM (IST) Tags: Rahul Gandhi News Congress leader Rahul Gandhi Rahul Gandhi on Modi Rahul Gandhi on Modi Comments Rahul Gandhi Sensational Comments

సంబంధిత కథనాలు

Leh Manali Highway: రికార్డు సమయంలో అందుబాటులోకి కశ్మీర్‌ ర‌హ‌దారులు, కారణం ఏంటంటే!

Leh Manali Highway: రికార్డు సమయంలో అందుబాటులోకి కశ్మీర్‌ ర‌హ‌దారులు, కారణం ఏంటంటే!

Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు

Visakha G20 Summit : ఈ నెల 28, 29న విశాఖలో జీ20 సదస్సు, హాజరుకానున్న 69 మంది విదేశీ ప్రతినిధులు

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

TSPSC Paper Leakage: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో 15 మంది అరెస్ట్, ప్రవీణ్ ఇంట్లో నగదు స్వాధీనం

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుద‌ల‌తో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!