By: ABP Desam | Updated at : 15 Sep 2023 09:19 PM (IST)
Chandrayaan-1 data shows Earth's electrons are forming water on Moon
చంద్రుడిపై ఉన్న నీటిజాడల మిస్టరీ వీడింది. జాబిల్లిపై నీటిజాడలు ఉన్నాయని... ఇప్పటికే అనేక అధ్యయనాల్లో తేలినా..? ఆ నీరంతా ఎక్కడిది..? నీటిజాడలు ఎలా ఏర్పడ్డాయి..? అనేవి ప్రశ్నిలుగా మిగిలిపోయాయి. ఆ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికింది. చంద్రుడిపైకి నీరు ఎలా ఏర్పండి..? ఎలా ఏర్పడుతోంది..? అన్నది తెలిసిపోయింది. అండపిండ బ్రహ్మాండంలో... గ్రహాల మధ్య జరుగుతున్న రహస్య ప్రక్రియ బయటపడింది. చందమామపై ఉన్న నీటి ఆనవాళ్లకు భూగ్రహమే కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూగ్రహం నుండి అధిక శక్తి గల ఎలక్ట్రాన్లు దాని ఉపగ్రహమైన చంద్రునిపై నీటిని ఏర్పరుస్తాయని తెలుసుకున్నారు. చంద్రయాన్-1 ద్వారా సేకరించిన డేటా ఆధారంగా... జాబిల్లిపై నీటిజాడలు ఏర్పడటానికి గల కారణాలను విశ్లేషించారు.
చందమామపై నీటి జాడలు ఉన్నట్టు భారత్ సహా పలు దేశాలు జరిపిన ప్రయోగాల్లో నిర్ధారణ అయినా.. అవి ఎలా ఏర్పడ్డాయన్న అన్న ఉత్కంఠకు.. ఇప్పుడు తెరపడింది. వాతావరణమేలేని జాబిల్లి ఉపరితలంపై నీటి ఆనవాళ్ల రహస్యాల గుట్టును చంద్రయాన్-1 ఛేదించింది. భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్స్ కారణంగానే చంద్రుడిపై నీరు ఏర్పడిందని తేల్చారు. చంద్రయాన్-1 మిషన్లోని ఇమేజింగ్ స్పెక్ట్రోమీటర్ అయిన మూన్ మినరాలజీ మ్యాపర్ పరికరం సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటాను అమెరికాలోని మనోవాలో గల యూనివర్సిటీ ఆఫ్ హవాయి శాస్త్రవేత్తల బృందం ఇటీవల అధ్యయనం చేసింది. ఆ వివరాలను జర్నల్ నేచర్ ఆస్ట్రానమీలో ప్రచురించింది. భూ వాతావరణంలో ఉండే ఎలక్ట్రాన్స్.. చంద్రుడిపై నీరు ఏర్పడటానికి దోహదపడి ఉంటాయని వీరి అధ్యయనంలో తేలింది.
భూ వాతావరణంలోని ఎలక్ట్రాన్లు చంద్రుని ఉపరితలంపై ఉన్న రాళ్లు, ఖనిజాలను విచ్ఛిన్నం చేయడం లేదా కరిగించడం వంటి పర్యావరణ ప్రక్రియలకు దోహదం చేస్తున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. చంద్రుడిపై నీటి సాంద్రత, నీటి పంపిణీ దాని నిర్మాణం, పరిమాణాన్ని అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో చంద్రుడిపై మానవ అణ్వేషణకు నీటి వనరులను అందించడానికి ఈ పరిశోధనలు కీలకమని పరిశోధకులు చెప్పారు. ఈ కొత్త అన్వేషణ చంద్రునిపై శాశ్వతంగా నీడ ఉన్న ప్రాంతాల్లో... గతంలో కనుగొనబడిన నీటి మంచుకు సంబంధించి మూలాలను వివరించడానికి కూడా సహాయపడుతుందని చెప్పారు.
సూర్యుడి నుంచి వచ్చే సోలార్ విండ్లో ఉండే ప్రోటాన్ల వంటి అధిక శక్తి అణువుల చందమామ ఉపరితలాన్ని తాకినప్పుడు అక్కడ నీరు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని గతంలో జరిగిన చాలా అధ్యయానాలు వెల్లడించాయి. అయితే చంద్రుడు భూ అయస్కాంత వాతావరణం గుండా వెళ్తున్నప్పుడు సోలార్ విండ్ తాకదు. అలాంటి సమయంలో చంద్రుడి ఉపరితలంపై ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే దానిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు. చంద్రయాన్-1 సేకరించిన రిమోట్ సెన్సింగ్ డేటా ప్రకారం.. భూఅయస్కాంతావరణంలో చంద్రుడు ప్రయాణిస్తున్నప్పుడు కూడా జాబిల్లిపై నీరు ఏర్పడినట్లు తేలింది. అంటే.. సౌరగాలిలోని ప్రోటాన్లతో సంబంధం లేకుండానే జాబిల్లిపై నీరు ఏర్పడే అదనపు మార్గాలు ఉన్నాయని తెలిసింది. ముఖ్యంగా, భూ వాతావరణంలోని అధిక శక్తి గల ఎలక్ట్రాన్ల నుంచి విడుదలయ్యే రేడియేషన్ కూడా.. సౌరగాలిలోని ప్రోటాన్ల మాదిరిగా పనిచేస్తుందని హవాయి యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
చంద్రుడి మీద నీటిజాడలకు... ఇదొక్కటే కారణం కాదు. సుమారు 350 కోట్ల సంవత్సరాల కిందట గ్రహశకలాలు, తోకచుక్కలు ఢీకొట్టినప్పుడు పుట్టుకొచ్చి ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి. భూమిపై వాతావరణం నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లు అంతరిక్షంలోకి వెళ్లిపోతుంటాయి. ఇవి చంద్రుడి మీద కలిసిపోయి నీరుగా ఏర్పడి ఉండొచ్చని గతంలో కొందరు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మొత్తానికి చంద్రునిపై నీటి అణువుల ఆవిష్కరణలో చంద్రయాన్-1 కీలక పాత్ర పోషించింది. చంద్రయాన్-1ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2008 అక్టోబర్లో ప్రయోగించింది. ఆర్బిటర్, ఇంపాక్టర్తో కూడిన ఈ మిషన్ 2009 వరకు పనిచేసింది. చంద్రుడిపై నీటి జాడలను గుర్తించింది.
Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్
ODI World Cup 2023 : నేటి నుంచి వరల్డ్ కప్ ప్రాక్టీస్ మ్యాచ్లు- మరి భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో తలపడుతుంది?
Rs 2000 Notes: సెప్టెంబర్ 30 తర్వాత ఏం జరుగుతుంది, రూ.2000 నోట్లు చెల్లుతాయా, చెత్తబుట్టలోకి వెళ్తాయా?
Top Headlines Today: టీడీపీని నడిపించేందుకు బ్రహ్మణి సిద్ధపడ్డారా? తెలంగాణలో బీజేపీ గాడిన పడుతుందా? టాప్ న్యూస్
Petrol-Diesel Price 29 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
/body>