అన్వేషించండి

దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన CAA,లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రం సంచలన ప్రకటన

Citizenship Amendment Act: దేశవ్యాప్తంగా CAA అమల్లోకి తెస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది.

Citizenship Amendment Act implementation: కేంద్ర ప్రభుత్వం CAA పై కీలక ప్రకటన చేసింది. ఇవాళ్టి నుంచి (మార్చి 11, 2024) ఈ చట్టం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుజల చేసింది. లోక్‌సభ ఎన్నికల ముందు ఈ కీలక నిర్ణయం తీసుకుంది మోదీ సర్కార్. పార్లమెంట్‌లో ఐదేళ్ల క్రితం ఈ బిల్‌  పాస్ అయింది. అప్పటి నుంచి అమలుకి ఎన్నో అడ్డంకులు వచ్చాయి. 2019 బిజెపి ఎన్నికల మేనిఫెస్టోలో CAA ని చేర్చింది బీజేపీ. పొరుగు దేశాల్లో అణచివేతకు గురైన మైనారిటీ వర్గాలకు పౌరసత్వం ఇచ్చేందుకు ఈ చట్టం వెసులుబాటు కల్పిస్తుందని కేంద్రం వివరిస్తోంది.

పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పిస్తుందని చెబుతోంది. 2014 డిసెంబర్ 31కి ముందు భారత్‌కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం లభించనుంది. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు,బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రిస్టియన్‌లకు పౌరసత్వం లభిస్తుందని కేంద్రం గెజిట్‌లో తెలిపింది. నాటి పాత చట్టంలో మార్పులు చేర్పులు చేసి 2019లో పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం రూపొందించింది. 

రెండోసారి NDA అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. హోం మంత్రి అమిత్ షా CAAని అమలు చేయడంపై చాలా పట్టుదలతో ఉన్నారు. ఎప్పుడో అమలు చేయాలని ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. ఈశాన్య రాష్ట్రాల్లో అల్లర్లు జరిగాయి. ఫలితంగా వెనక్కి తగ్గింది కేంద్రం. కానీ...ఈ సారి ఇక వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. గతంలో ఈ చట్టం అమలు చేస్తామన్నప్పుడు జరిగిన అల్లర్లలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పౌరసత్వం కోసం ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకునేలా కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా వెబ్‌ పోర్ట్‌లనీ రూపొందించినట్టు హోంశాఖ వెల్లడించింది. 

 

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs DC Match Highlights IPL 2025 | లక్నో సూపర్ జెయింట్స్ పై 8వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం | ABP DesamGujarat Titans Winning Strategy IPL 2025 | టాప్ లో ఉంటే చాలు..ఇంకేం అవసరం లేదంటున్న గుజరాత్ టైటాన్స్Trolling on Ajinkya Rahane vs GT IPL 2025 | బ్యాటర్ గా సక్సెస్..కెప్టెన్ గా ఫెయిల్..?GT vs KKR IPL 2025 Match Review | డిఫెండింగ్ ఛాంపియన్ దమ్ము చూపించలేకపోతున్న KKR

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi : ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
ఉగ్రదాడి కారణంగా సౌదీ అరేబియా పర్యటన రద్దు చేసుకున్న మోదీ
Pahalgam Terror Attack: కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
కశ్మీర్ వెళ్లిన వైజాగ్‌ టూరిస్టులు మిస్సింగ్- ఉగ్రదాడితో బంధువుల్లో ఆందోళన 
Duvvada Srinivas: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు భారీ షాక్‌- పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైసీపీ 
Anantapur Politics: పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
పెనుగొండ వైఎస్ఆర్‌సీపీలో గందరగోళం - ఉషాశ్రీచరణ్‌కు చెక్ పెడతారా?
BJP Vishnu Meet AP CM: సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
సమన్వయంతో మోదీ పర్యటన విజయవంతానికి సన్నాహాలు -ఢిల్లీలో సీఎంను కలిసిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణు
UPSC CSE Final Result 2024: సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
సివిల్స్ ఫలితాల్లో పిఠాపురం కుర్రాడికి 94వ ర్యాంకు- తొలి ప్రయత్నంలోనే అద్భుతం
IPL 2025 LSG VS DC Result Update: ఢిల్లీ సిక్స‌ర్.. ఆరో విజ‌యంతో స‌త్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన అభిషేక్, రాహుల్, ముఖేశ్, ల‌క్నో చిత్తు
ఢిల్లీ సిక్స‌ర్.. ఆరో విజ‌యంతో స‌త్తా చాటిన క్యాపిటల్స్, రాణించిన పొరెల్, రాహుల్, ముఖేశ్, ల‌క్నో చిత్తు
Singer Sunitha: నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
నాది అంత నీచమైన క్యారెక్టర్ కాదు... ప్రవస్తీ ఆరాధ్య కాంట్రవర్సీలో నిజాలు వెల్లడించిన సునీత
Embed widget