అన్వేషించండి

Covid-19 Vaccination: మోదీజీ కంగ్రాట్స్, భారత్‌ వ్యాక్సినేషన్ రికార్డ్‌పై స్పందించిన బిల్‌గేట్స్

భారత్‌ 2 వందల కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించి రికార్డు సృష్టించిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ ప్రధాని మోదీకి అభినందనలు తెలిపారు.

మరో మైలురాయి అధిగమించారు..

ఏడాదిన్నర క్రితం ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టిన భారత్...కరోనాను నియంత్రించటంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్‌తోనే ఏ దేశానికీ లేని రికార్డు సాధించింది. 18 నెలల వ్యవధిలోనే 200 కోట్ల డోసులు అందించిన దేశంగా నిలిచింది. ఈ రికార్డుపై మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్ స్పందించారు. ప్రధాని మోదీకి ట్విటర్ ద్వారా అభినందనలు తెలిపారు. "వ్యాక్సినేషన్‌లో మరో మైలురాయి అధిగమించినందుకు ప్రధాని మోదీకి అభినందనలు. భారత వ్యాక్సిన్ తయారీదారులతో మా భాగస్వామ్యం ఉండటం మాకెంతో ఆనందంగా ఉంది" అని ట్వీట్ చేశారు. ఇప్పుడే కాదు. ఈ ఏడాది మే లో స్విట్జర్‌లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సులోనూ బిల్ గేట్స్ భారత్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను కలిశారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలపై మన్‌సుఖ్ మాండవీయ, తాను ఎన్నో అంశాలు చర్చించామని, అభిప్రాయాలు పంచుకున్నామని ఆ 
సమయంలో వెల్లడించారు బిల్‌గేట్స్. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భారత్ విజయం సాధించటం, ఇందుకోసం వినియోగించిన సాంకేతికత ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రశంసించారు.

 గతేడాది మొదలైన డ్రైవ్

గతేడాది జనవరిలో భారత్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన లెక్కల ప్రకారం..ఈ నెల 19 వ తేదీ నాటికి భారత్‌లో 2 వందల కోట్ల 59 లక్షల డోసులు అందించింది. ప్రపంచ దేశాల్లో మళ్లీ కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది కేంద్రం. ఆసియా దేశాల్లో జపాన్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే ఫ్రాన్స్‌లో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. భారత్‌లో ప్రస్తుతానికి తీవ్రత కనిపించకపోయినా, కేసుల సంఖ్య పెరగకుండా ముందుగానే నియంత్రించాలని భావించింది కేంద్రం. అందుకే ఇటీవలే బూస్టర్ డోసులను ఉచితంగా అందించే క్యాంపెయిన్‌నూ ప్రారంభించింది. 
ఈ తరుణంలోనే 2 బిలియన్ డోసుల రికార్డు సాధించింది. ఈ రికార్డుపై ప్రధానినరేంద్ర మోదీ ట్విటర్ ద్వారా స్పందించారు. "భారత్ మరోసారి చరిత్ర సృష్టించింది. 2 వందల కోట్ల డోసుల మైలురాయి దాటినందుకు భారత ప్రజలందరికీ అభినందనలు. వ్యాక్సినేషన్‌ ద్వారా కొవిడ్‌పై సమర్థవంతమైన పోరాటం సాగించాం"  అని ట్వీట్ చేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ కూడా ట్విటర్‌లో అభినందనలు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget