అన్వేషించండి

Ayodhya Ram Mandir Donation Scam: అయోధ్య ఆలయంలో స్కామ్‌కు కారణం కింది స్థాయి వ్యక్తులేనా ? - పెద్దలకు తెలియకుండా జరుగుతుందా?

Ayodhya:అయోధ్య ఆలయంలో జరిగిన నిధుల గోలమాల్ యూపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. సిట్ కింది స్థాయి వ్యక్తుల్నే అరెస్టు చేసింది. పెద్దల సంగతేమిటన్న ప్రశ్న వస్తోంది.

Yogi Adityanath Zero Tolerance Ayodhya:  భారతదేశ వ్యాప్తంగా కోట్ల మంది హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య శ్రీరామ జన్మభూమి ఆలయం  లో విరాళాల దుర్వినియోగం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. భక్తులు సమర్పించిన కానుకలు, నగదును కొందరు  నొక్కేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎస్ఐటీ సమర్పించిన ప్రాథమిక నివేదిక ఆధారంగా శుక్రవారం   ఎనిమిది మందిని అరెస్టు చేశారు.  నిందితులకు జూన్ 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ భారీ స్కామ్ వెలుగులోకి రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ రామాలయ తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ , మెంబర్ ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు తక్షణమే రాజీనామా చేశారు. అయితే ఈ స్కామ్ లోతును చూస్తే ఖచ్చితంగా పెద్దల హస్తం ఉంటుందన్న అనుమనాలున్నాయి. 

సీసీటీవీలో దొరికిపోయినా  దొంగలు

ఈ కేసుకు సంబంధించిన లోతైన వివరాలు భక్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఆలయంలోని కానుకల హుండీ లెక్కింపు విభాగంలో పనిచేసే మనీష్ యాదవ్ అనే నిందితుడు పలుమార్లు నగదును దొంగిలిస్తుండగా సీసీటీవీ   కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. అయినప్పటికీ అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఒక పెద్ద నెట్‌వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. రామ్ మందిర్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ వ్యక్తిగత డ్రైవర్, అత్యంత సన్నిహితుడైన రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను .. ఈ మనీష్ యాదవ్‌కు బంధువు కావడమే ఇందుకు కారణం. టిన్ను తనకున్న అధికార బలంతో మనీష్‌ను క్యాష్ కౌంటింగ్ యూనిట్‌లో చేర్పించడమే కాకుండా, అతను దొంగతనాలు చేస్తున్నా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా కప్పిపుచ్చినట్లు తేలింది. కొన్ని విజువల్స్‌లో సీసీటీవీ కెమెరాలను కవర్ చేసి, దొంగిలించిన డబ్బును టాయిలెట్లలో దాచినట్లు కూడా విచారణలో వెల్లడైంది. 

 రూ. 7.5 కోట్ల కుంభకోణం.. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్, నగదు రికవరీ! 

అయోధ్య మాజీ ఎస్పీ ఎమ్మెల్యే పవన్ పాండే ఈ ఆలయ విరాళాల్లో దాదాపు రూ. 7 కోట్ల నుండి రూ. 7.5 కోట్ల మేర అవినీతి జరిగిందని తొలిసారిగా ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఎస్ఐటీ.. ఆరోపణల్లో నిజముందని తేల్చడంతో భారతీయ న్యాయ సంహిత  లోని పలు కఠిన సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్   నమోదైంది. ఈ కేసులో రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లా, కరుణేష్ పాండే, మనీష్ యాదవ్, లవ్‌కుష్ మిశ్రా, రామ్ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆరుగురు బ్యాంక్ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీకి చెందిన కౌంటింగ్ సిబ్బంది కాగా.. మిగిలిన ఇద్దరు వెలుపలి వ్యక్తులు. నిందితుల నుండి ఇప్పటివరకు రూ. 79.85 లక్షల నగదును ఇన్వెస్టిగేటర్లు రికవరీ చేశారు. 

 నైతిక బాధ్యత వహిస్తూ తప్పుకున్న చంపత్ రాయ్! 

ఈ వ్యవహారం సుప్రీంకోర్టు, అలహాబాద్ హైకోర్టు మెట్లు ఎక్కడం, విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించడంతో రామ్ మందిర్ ట్రస్ట్ ప్రతిష్ట మసకబారకుండా ఉండేందుకు చంపత్ రాయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత డ్రైవర్ టిన్ను యాదవ్ ఈ దొంగతనాల నెట్‌వర్క్‌ను నడిపించాడనే ఆరోపణలు రావడంతో.. చంపత్ రాయ్ మరియు ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా సమర్పించారు.  

ఎవర్నీ వదిలేది లేదన్న సీఎం యోగి

మరోవైపు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్  ఈ కుంభకోణంపై అత్యంత సీరియస్‌గా స్పందించారు.  సనాతన ధర్మం , భక్తుల నమ్మకాలతో ఆడుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సిట్ నివేదిక రాగానే తక్షణమే కఠిన చర్యలు ప్రారంభించాం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే జైలు శిక్ష అనుభవించాల్సిందే.. ఎవరికీ మినహాయింపు ఉండదు" అని స్పష్టం చేశారు. అలాగే, ఈ వివాదాన్ని కొందరు రాజకీయంగా వాడుకుని అయోధ్య ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ చేసిన విమర్శలు హాస్యాస్పదమని, దర్యాప్తును చట్టప్రకారం తార్కిక ముగింపునకు రానివ్వాలని సీఎం యోగి పిలుపునిచ్చారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసు.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు
Dharavath Nikhil Death Case: ధరావత్ నిఖిల్ అనుమానాస్పద మృతి కేసు.. సీబీఐ విచారణకు ఆదేశించిన హైకోర్టు
Neymar Donation: భూకంప బాధితుల కోసం బ్రెజిల్ స్టార్ నేమార్ గోల్డెన్ హార్ట్.. భారీ విరాళంతో రియల్ హీరోగా మారిన ఫుట్‌బాల్ వీరుడు.. బ్రెజిల్ అరుదైన రికార్డు
భూకంప బాధితుల కోసం బ్రెజిల్ స్టార్ నేమార్ గోల్డెన్ హార్ట్.. భారీ విరాళంతో రియల్ హీరోగా మారిన ఫుట్‌బాల్ వీరుడు.. బ్రెజిల్ అరుదైన రికార్డు
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి పరిహారం నిధులు జమ
Delhi Dehradun Expressway Accident: ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
ఢిల్లీ- డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‌వేపై రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి- సేఫ్ జర్నీకి ఇవి పాటించండి
CBI Investigation Credibility: సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
సాయికృష్ణ కేసు సీబీఐకి ఇస్తే న్యాయం జరుగుతుందా? మరుగునపడిపోతుందా?
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
White Rice vs Brown Rice : వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
వైట్ రైస్ Vs బ్రౌన్ రైస్.. షుగర్ ఉన్నవారికి ఏది బెస్ట్? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Embed widget