అన్వేషించండి

Ayodhya Ram Mandir Donation Row 2026: అయోధ్య రామందిరం నిధుల వివాదం- రాముడి విరాళాలు మాయమయ్యాయా? యోగి సర్కార్ ఏం తేల్చబోతోంది?

Yogi Adityanath SIT Probe Ayodhya: అయోధ్య రామమందిరం విరాళాలు పక్కదారి పట్టాయన్న ఆరోపణలపై యూపీ ప్రభుత్వం నియమించిన ఎస్ఐటీ దర్యాప్తుచేస్తోంది. దేవుడి నిధులు కొట్టేశారన్న ప్రచారం సంచలనంగా మారుతోంది.

Shri Ram Janmabhoomi Trust Audit:  అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు భక్తులు సమర్పించిన కానుకలు, నిధులు పక్కదారి పట్టాయంటూ వస్తున్న ఆరోపణలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన రాముడి ఆలయ విరాళాల్లో అవినీతి జరిగిందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు, సోషల్ మీడియా వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారాయి. సమాజ్‌వాదీ పార్టీ , కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ  వంటి ప్రతిపక్షాలు ఈ ఇష్యూపై యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై, రామమందిర ట్రస్ట్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
  
  వివాదానికి కారణం ఏంటి? ప్రతిపక్షాల ఆరోపణలు! 

అయోధ్య రామందిరంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకలు, కోట్లాది రూపాయల విరాళాలు క్రమపద్ధతిలో మాయమయ్యాయని  , ఇందులో భారీ కుంభకోణం జరిగిందని జూన్ మొదటి వారంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ అభిమానుల నమ్మకాన్ని ఈ ఘటన దెబ్బతీసిందని, దీనిపై కోర్టు సుమోటోగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. దీనికి తోడు.. కాంగ్రెస్ నేతలు అజయ్ రాయ్, దిగ్విజయ్ సింగ్,  ఆప్  ఎంపీ సంజయ్ సింగ్ సైతం రంగంలోకి దిగి.. విరాళాల నిధులతో పాటు రూ. 55 కోట్లకు పైగా భూముల కొనుగోలు వ్యవహారా కూడా భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు.

 రంగంలోకి యూపీ ప్రభుత్వం.. యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం 

రాముడి నిధులపై వస్తున్న ఆరోపణలు అత్యంత సున్నితమైనవి కావడం, దేశవ్యాప్తంగా భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉండటంతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తక్షణమే స్పందించారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు, విపక్షాల నోళ్లు మూయించేందుకు జూన్ మధ్యలో ఉన్నత స్థాయి ప్రత్యేక విచారణ బృందాన్ని  ఏర్పాటు చేశారు. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో.. ఐజీ కిరణ్ ఎస్, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ నీల్ రతన్‌లతో కూడిన ఈ ముగ్గురు సభ్యుల కమిటీ అయోధ్యలోనే క్యాంప్ వేసి నిశితంగా దర్యాప్తు చేస్తోంది. 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం యోగి ఆదేశించారు.

 సీసీటీవీ ట్యాంపరింగ్ క్లూస్.. పోలీసుల తనిఖీల్లో దొరికిన నగదు! 

SIT దర్యాప్తు ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే కొన్ని షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హుండీ గదికి సంబంధించిన సిసిటివి  ఫుటేజీలను కొందరు సిబ్బంది ట్యాంపరింగ్  చేసినట్లు దర్యాప్తు సంస్థ ప్రాథమిక ఆధారాలు సేకరించింది. గత 11 నెలల్లో దాదాపు రూ. 10 కోట్లు కేవలం భద్రత కోసమే ఖర్చు చేసినప్పటికీ ఈ లూటీ జరగింది.  ఈ క్రమంలోనే ఆలయానికి చెందిన లవ్ కుష్ మిశ్రా అనే ఉద్యోగితో పాటు కొందరి ఇళ్లలో తనిఖీలు చేయగా.. దాదాపు రూ. 10 లక్షల నగదు లభ్యమైంది. ప్రస్తుతం ఎస్ఐటీ బృందం దాదాపు 200 మంది అనుమానితులను, ఆలయ సిబ్బందిని విచారిస్తోంది.

 రాముడి డబ్బులే కొట్టేశారన్న విమర్శలకు ట్రస్ట్ సమాధానం ఏంటి? 

ఈ విమర్శలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ క్లారిటీ ఇచ్చారు. నిధులు ఎక్కడికీ పక్కదారి పట్టలేదని, అంతా సురక్షితంగా ఉందని స్పష్టం చేశారు. ఆలయంలో విరాళాల లెక్కింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా సాగుతుందని.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ఉద్యోగులు, ట్రస్ట్ సభ్యులు సంయుక్తంగా ఈ లెక్కింపును నిర్వహిస్తారని, దీనికి సంబంధించిన ఇంటర్నల్ ఆడిట్  ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటుందని తెలిపారు. ఈ ఆరోపణలన్నీ కేవలం మందిరం ప్రతిష్టను దెబ్బతీయడానికి రాజకీయ ప్రేరేపితంగా చేస్తున్నవేనని ట్రస్ట్ కొట్టిపారేసింది.   

 రాజకీయ కోణం వెనుక అసలు కథ! 

అయోధ్య రామందిరం అనేది కేవలం ఒక ధార్మిక క్షేత్రం మాత్రమే కాదు.. భారతీయ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన సెంటిమెంట్. అందుకే ప్రతిపక్షాలు ఈ ఇష్యూను వదిలిపెట్టడం లేదు. ఒకవేళ ఎస్ఐటీ విచారణలో చిన్న తప్పు జరిగినా అది అధికార బీజేపీకి జాతీయ స్థాయిలో పెద్ద మైనస్ అవుతుంది. అందుకే సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తూ.. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షిస్తామని నమ్మకం కలిగిస్తున్నారు. విచారణ నివేదిక పూర్తిగా బయటకు వస్తేనే.. ఇందులో జరిగింది కేవలం కొందరు కిందిస్థాయి సిబ్బంది చేసిన చేతివాటమా లేక దీని వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందా అనేది స్పష్టమవుతుందని చెబుతున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
ఇరాన్‌లోని బుషెహర్‌ సహా పలు నగరాల్లో భారీ పేలుళ్లు! ఖండించిన అమెరికా! అటాక్ చేసింది ఎవరు? 
Harshit Rana, Varun Chakaravarthy Injury Blow: టీమిండియాకు డ‌బుల్ బ్లో.. గాయాల‌తో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్
టీమిండియాకు డ‌బుల్ బ్లో.. గాయాల‌తో హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఔట్
IND VS ENG Historic Lords Test: లార్డ్స్ హిస్టారికల్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!
హిస్టారికల్ లార్డ్స్ టెస్ట్ కు హర్మన్‌ప్రీత్ కౌర్ సేన రెడీ.. 142 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇంగ్లాండ్‌తో చారిత్రాత్మక పోరు, శ్రీ చరణి డెబ్యూ ఫిక్స్!
ABP Desam Top 10, 9 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 9 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs ENG 4th T20I: భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
భారత్‌పై తొలి టీ20ఐ సిరీస్‌ గెలుచుకున్న ఇంగ్లండ్! నాలుగో మ్యాచ్‌ గెలుచుకోవడంలో టీమిండియా విఫలం!
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Embed widget