అన్వేషించండి

Ayodhya Temple: అయోధ్య రామమందిరానికి పోటెత్తుతున్న భక్తులు... దర్శన వేళల్లో స్వల్ప మార్పులు

Rammandhir: అయోధ్యలో రామమందిరం దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్న నేపథ్యంలో స్వామివారిని దర్శన వేళలు ఉదయం 6 గంటల నుంచే ప్రారంభించారు.

Ayodhya: అయోధ్యలో రామమందిరానకి భక్తుల తాకిడి భారీగా పెరగడంతో శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు  కీలక నిర్ణయం తీసుకుంది. బాలరాముడి దర్శన వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా...ఇకపై ఉదయం 6 గంటలకే బాలరాముడిని దర్శించుకోవచ్చు. రాత్రి 10 గంటల వరకు భక్తులను  దర్శనానికి అనుమతించనున్నారు.
 
అయోధ్య ఆలయం
ఐదు వందల ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్య(Ayodhya)కు మళ్లీ రాముడు తిరిగొచ్చాడు. హిందూవుల ఆరాధ్య దైవం శ్రీరాముడికి ప్రతి ఊరిలో గుడి (Temple) ఉన్నా...ఆయన ఏలిన రాజ్యం, సొంత ఊరులో మాత్రం ఆ బాలరాముడికి కోవెల లేదన్న చింత ప్రతి హిందూవులోనూ ఉంది. ఐదు వందలఏళ్ల క్రితమే అయోధ్యలో రామమందిరాన్ని కూల్చివేసి ముస్లిం రాజులు అక్కడ మసీదు నిర్మించారు. అప్పటి నుంచి అక్కడ తిరిగి రామమందిరం నిర్మించాలని ప్రతి హింధువుల సంకల్పం. బాబ్రీ మసీదు కూల్చివేత  అనంతరం దశాబ్దాల  తరబడి రాజకీయ, న్యాయపోరాటాల అనంతరం...అక్కడ రామమందిరం(Rammandhir) ఆనవాళ్లు ఉన్నాయని, వాటి పునాదులపైన మసీదు నిర్మించారని 2019లో  సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తిరిగి అక్కడ రామమందిరం  నిర్మించేందుకు శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టుకు అనుమతించింది.
అయోధ్యలోనే మరోచోట మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించాలని  ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ఎన్నో ఏళ్లనాటి హిందువుల కల ఫలించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సుమారు  11 వందల కోట్లతో అత్యద్భుతమైన  ఆలయ నిర్మాణ పనులు చేపట్టింది. 2020 ఆగస్టు 5న  ఆలయ నిర్మాణానికి శంకుస్థాపనం చేసి.. 2024లో పూర్తి చేశారు. గతేడాది జనవరి 22న  ఈ భవ్య రామమందిరంలో  బాలరాముడికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రధాని మోడీ(Narendra Modi) చేతుల మీదుగా అంగరంగ వైభవంగా  నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తొలిరోజే  దాదాపు 5 లక్షల మంది భక్తులు ఈ ఆలయంలో దేవుడిని దర్శించుకున్నారు.  ఆ తర్వాత  రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాలరాముడిని దర్శనానికి అనుమతిస్తున్నారు. 
 
దర్శన వేళల్లో మార్పులు
దాదాపు రెండున్నర ఎకరాల్లో అత్యద్భుతమైన నగరశైలిలో  ఐదు  అంతస్తులుగా నిర్మించిన  అయోధ్య రామమందిరం  ఆధ్యాత్మికంగానే గాక...పర్యాటకంగానూ ఎంతో  పేరు తెచ్చుకుంది. వందల ఏళ్ల తర్వాత తిరిగి అయోధ్య చేరుకున్న రాములోరిని కళ్లారా చూడాలని దేశంలోని హిందూవులంతా అనుకుంటున్నారు. దీంతో  ఒక్కసారిగా  అయోధ్యకు భక్తుల తాకిడి పెరిగింది. పైగా మహాకుంభమేళాకు  వెళ్లిన ఇతర  రాష్ట్రాల భక్తులు సైతం....అయోధ్య రామయ్యను దర్శించుకుని వస్తున్నారు. దీంతో ఆలయాన్ని భక్తులు పోటెత్తుతున్నారు. వస్తున్న భక్తులందరికీ స్వామివారి దర్శనం కల్పించడం ట్రస్టుకు  ఇబ్బందిగా మారింది. దీంతో దర్శన వేళల్లో స్పల్ప మార్పులు  చేశారు.ఇప్పటి వరకు ఉదయం 7గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తుండగా...ఇకపై ఉదయం 6 గంటల నుంచే దేవుడి గుడి తలుపులు తెరుచుకోనున్నాయి. అక్కడి నుంచి నిరంతరాయంగా  రాత్రి 10 గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు.
 
తెల్లవారుజామున 4గంటలకే మంగళ హారతితో స్వామివారిని మేల్కొపుతారు. ఆ తర్వాత కాసేపు ద్వారాలు మూసివేస్తారు. భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారన్న సంకేతంగా  ఉదయం 6 గంటలకు శ్రింగార్ హారతి ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌భోగి నైవేధ్యం సమర్పణ ఉంటుంది.ఆ సమయాల్లో మాత్రం భక్తులను అనుమతించరు. కానీ ఇకపై ఆయా సమయాల్లోనూ భక్తులను దర్శనానికి అనుమతించాలని నిర్ణయించారు. అలాగే, సాయంత్రం 7గంటలకు సంధ్యా హారతి ఇస్తారు. ఈ సమయంలో ఆలయ ద్వారాలు 15 నిమిషాల పాటు మూసివేసి తిరిగి భక్తుల దర్శనార్థం తెరుస్తారు. అలాగే, ప్రస్తుతం రాత్రి 9.30 గంటలకు ఇచ్చే శయన హారతిని ఇకపై రాత్రి 10 గంటలకు ఇవ్వనున్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Delimitation Bill 2026: డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
Bangalore Viral News: పిల్లి పిల్లలకు తండ్రెవరు? - పోలీసుల వద్దకు చేరిన బెంగళూరులో రెండు కుటుంబాల పంచాయతీ
పిల్లి పిల్లలకు తండ్రెవరు? - పోలీసుల వద్దకు చేరిన బెంగళూరులో రెండు కుటుంబాల పంచాయతీ
Tamil Nadu Assembly Elections: స్టాలిన్‌కు ఆయుధంగా దొరికిన డీలిమిటేషన్ - సెంటిమెంట్‌తో క్లీన్ స్వీప్ చేస్తారా?
స్టాలిన్‌కు ఆయుధంగా దొరికిన డీలిమిటేషన్ - సెంటిమెంట్‌తో క్లీన్ స్వీప్ చేస్తారా?
IMD Rains Alert: భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?
భారత్‌లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటీ?

వీడియోలు

Ruturaj Angry with CSK Fielding vs KKR | ఫీల్డింగ్‌పై CSK కెప్టెన్ సీరియస్ వార్నింగ్
Noor Ahmad CSK vs KKR IPL 2026 | చెపాక్‌లో నూర్ అహ్మద్ సునామీ
Virat Kohli Injured in IPL 2026 ? | కాలికి కట్టుతో విరాట్.. టెన్షన్ లో ఫ్యాన్స్
Praful Hinge Huge Craze in Social Media | ఒకే మ్యాచ్‌తో ప్రఫుల్‌కు ఫుల్ క్రేజ్‌
IPL 2026 CSK vs KKR Highlights | చెన్నైపై వ‌రుస‌గా రెండో విజ‌యం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 RCB VS LSG Result Update: టాప్ లేపిన ఆర్సీబీ.. నాలుగో విజ‌యంతో స‌త్తా.. ఆకట్టుకున్న కోహ్లీ, భువీ, .. ల‌క్నో చిత్తు
టాప్ లేపిన ఆర్సీబీ.. నాలుగో విజ‌యంతో స‌త్తా.. ఆకట్టుకున్న కోహ్లీ, భువీ, .. ల‌క్నో చిత్తు
Delimitation Bill 2026: డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
డీలిమిటేషన్‌తో పాకిస్తాన్‌కు చెక్! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు అడుగులు!
Raghurama on Amaravati: అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అనడం మానేయాలి - డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
అమరావతిని చంద్రబాబు దేవతల రాజధాని అనడం మానేయాలి - డిప్యూటీ స్పీకర్ రఘురామ కీలక వ్యాఖ్యలు
Ration shops: రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
రేషన్ తీసుకోలేదని కంగారు పడుతున్నారా ..నో టెన్షన్ - 30వ తేదీ వరకూ తీసుకోవచ్చు!
AP high Court: ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ
ఆకివీడు రామాలయంపై హైకోర్టు కీలక ఆదేశాలు - స్వయంగా వాదనలు వినిపించిన రఘురామ
TDP Son Rise: మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
మరో తరానికి టీడీపీ బాధ్యతలు - నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు వెనుక చంద్రబాబు వ్యూహం !
Peddi Postponed: జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం
జూన్‌కు వాయిదా పడిన పెద్ది... అఫీషియల్‌గా చెప్పిన రామ్ చరణ్ టీం
Gas Cylinder Blast: సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
సత్యసాయి జిల్లాలో ఘోరం.. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి, అసలేం జరిగింది?
Embed widget