అన్వేషించండి

విదేశాల్లో మండిపోతున్న బొగ్గు ధరలు- జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అధికారులకు సీఎం జ‌గ‌న్ సూచన

బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలని సూచించారు.

మళ్లీ బొగ్గు కొరత రావచ్చని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సీఎం జగన్ సూచించారు. విదేశాల్లో బొగ్గు ధరలు మండిపోతున్నాయని హితవు పలికారు. రాష్ట్రంలో అవ‌స‌రమైన నిల్వ‌ల‌ను స‌మ‌ర్ద‌వంతంగా సేక‌రించి పెట్టుకోవాలన్నారు. దీనికి అవ‌స‌రం అయిన అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 

తాడేప‌ల్లిలోని క్యాంప్ కార్యాల‌యంలో ఇంధన శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్... బొగ్గు నిల్వలపై పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గతంలో తీసుకున్న నిర్ణయాల అమలు, ప్రగతిని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరించారు. విద్యుత్‌ డిమాండ్, కొనుగోళ్లు, మార్కెట్లో అందుబాటులో ఉన్న విద్యుత్, వాటి ధరలు తదితర అంశాలపై డేటా అనలిటిక్స్‌ ఎస్‌ఎల్‌డీసీలో ఏర్పాటు చేశామని వెల్ల‌డించారు. విద్యుత్‌ కొనుగోలు ఖర్చు తగ్గించుకునేందుకు ఇది చాలా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. కచ్చితమైన డిమాండ్‌ తెలిపేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ విధానాన్ని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. గతంలో ఎంఓపీఈ 4 నుంచి 5 శాతం ఉంటే, ఇప్పుడు 2 శాతానికి తగ్గిందని వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్ పాడైన 24 గంటల్లోపే కొత్తది పెట్టి రైతులకు అవాంతరాల్లేని విద్యుత్‌ అందిస్తున్నామన్న అధికారులు నివేదిక అందించారు. గ‌డచిన 90 రోజుల్లో 99.5శాతం ట్రాన్స్‌ఫార్మర్లను 24 గంటల్లో పే రీప్లేస్‌ చేశామని అన్నారు. 

జ‌గ‌న్ మాట్లాడుతూ... బొగ్గు నిల్వలకు ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. విదేశీ బొగ్గు ధరలు మండిపోతున్న దృష్ట్యా దేశీయంగానే వీటిని సమకూర్చేకునేలా తగిన ప్రయత్నాలు చేయాలని సూచించారు. వేసవి కోసం ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందు చూపుతో చర్యలు తీసుకోవాలన్నారు. సులియారీ, మహానది కోల్‌బాక్స్‌ నుంచి పూర్తిస్థాయి ప్రయోజనాలు పొందేలా ఆలోచనలు చేయాలని సూచించారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టుకునేందుకు ఇప్పటికే 16,63,705 మంది రైతుల అంగీకరించారన్న అధికారులు, రైతులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నందున వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.

వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్‌ పంపిణీ అత్యంత పారదర్శకంగా, నాణ్యంగా  రైతులకు మేలు చేసేదిగా ఉండాలన్నారు సీఎం జగన్. అత్యంత మెరుగైన వ్యవస్థ తీసుకురావాలని సీఎం ఆకాంక్షించారు. మీట‌ర్ల వ‌ల‌న క‌లిగే ఉప‌యోగాల‌ను గురించి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని సీఎం సూచించారు. దీని వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు వివరాలు అందించాల‌న్నారు. రైతుల పేరు చెప్పి దొంగతనంగా విద్యుత్‌ వాడుతున్న ఘటనలు కూడా దాదాపుగా అడ్డుకోగలుగుతున్నామని వివ‌రించారు అధికారులు. మీటర్లు పెట్టడం వల్ల రైతులకు ఎంత కరెంటు అవసరమో తెలుస్తుందని అన్నారు. దీని వల్ల సరిపడా విద్యుత్‌ను వారికి పంపిణీ చేయడానికి వీలు కలుగుతుందని వివ‌రించారు.

కృష్ణప‌ట్నంలో విద్యుత్....
కృష్ణపట్నంలో 800 మెగావాట్ల యూనిట్‌ అందుబాటులోకి వచ్చిందని ఈ సంద‌ర్బంగా అధికారులు సీఎంకు నివేదిక అందించారు. ఈ ప్రాజెక్టును సీఎం జ‌గ‌న్ చేతులు మీద‌గా ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలిపారు. విజయవాడ థర్మల్‌ పవర్‌ కేంద్రంలో కూడా మరో 800 మెగావాట్ల కొత్త యూనిట్‌ కూడా వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేస్తామని సీఎం దృష్టికి తీసుకువ‌చ్చారు. 

జగనన్న కాలనీల్లో విద్యుత్‌ సదుపాయాల‌ కల్పనపై వివరాలు కూడా సీఎం జ‌గ‌న్ ఆరా తీశారు. కాలనీలు పూర్తయ్యే కొద్దీ విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు కల్పించాలని, క్రమేణా ఇతర మౌలిక సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళండ‌ని జ‌గ‌న్ అధికారుల‌కు సూచించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US Iran War Updates: పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ?
పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Best SUVs for Family: రూ.10 లక్షల బడ్జెట్‌లో మీ ఫ్యామిలీకి ఏ SUV సెట్ అవుతుంది? కార్లు, ఫీచర్లు చూడండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో మీ ఫ్యామిలీకి ఏ SUV సెట్ అవుతుంది? కార్లు, ఫీచర్లు చూడండి

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Embed widget