అన్వేషించండి

Alekhyaa Chitti Pickles : అలేఖ్య చిట్టి పికిల్స్​పై సోషల్ మీడియాలో రచ్చ.. పాపం అంటూనే గట్టిగా వేసుకుంటోన్న నెటిజన్స్

Alekhyaa Chitti Pickles News : పచ్చడి ధర అంత ఉంది ఏంటి అన్నందుకు ఓ అబ్బాయిని అమ్మాయి ఇష్టమొచ్చినట్టు తిట్టింది. అబ్బాయికి సపోర్ట్ చేస్తూ మీమ్ పేజ్​లు రచ్చ చేస్తున్నాయి. ఇంతకీ మేటర్​ ఏంటంటే.. 

Alekhyaa Chitti Pickles Viral Audio : సోషల్ మీడియాను బిజినెస్​ కోసం ఉపయోగిస్తూ ఎంతో మంది సక్సెస్ అవుతున్నారు. ఇన్​స్టాలో పేజ్​లు క్రియేట్ చేసి.. బిజినెస్​ రన్​ చేస్తున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటివారిలో అలేఖ్య చిట్టి పికిల్స్ పేజ్​ కూడా ఒకటి. ముగ్గురు అక్కాచెళ్లెల్లు కలిసి నాన్​వెజ్ పికిల్స్​ అమ్ముతూ క్రియేట్ చేసిన పేజ్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో యువతకు అలేఖ్య చిట్టి పచ్చళ్ల రుచి తెలియకపోయినా.. ఈ అక్కా చెళ్లెల్లు మాత్రం కచ్చితంగా తెలిసే ఉంటారు. ఎందుకంటే పచ్చళ్లకంటే వారే ఎక్కువ ఫేమస్ కాబట్టి. 

రమ్య మోక్ష కంచర్ల, సుమ కంచర్ల, అలేఖ్య కంచర్ల .. ముగ్గురు సిస్టర్స్. వీరు ఇన్​స్టాలో అలేఖ్య చిట్టి పేరుతో నాన్​వెజ్​ పచ్చళ్లు అమ్ముతుంటారు. శుభ్రత, హైజీన్ పేరుతో వీరు అమ్మే పచ్చళ్లకు ఎక్కువ ధర ఉంటుంది. ఇప్పుడు ఈ అలేఖ్య చిట్టి పికిల్స్​పై సోషలో మీడియాలో తెగ రచ్చ జరుగుతుంది. ఎందుకంటే.. పచ్చళ్ల కాస్ట్ ఇంత ఉందేంటని ఓ కస్టమర్​ అడగ్గా.. రాయలేని భాషలో బూతులు తిట్టారు అంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. 

అసలేం జరిగిందంటే.. 

సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ కోసం ఆర్డర్ చేయాల్సిన నెంబర్ అంటూ ఇచ్చిన 7305607487 నెంబర్​కు ఓ అబ్బాయి మెసేజ్ చేశాడు. పచ్చళ్ల గురించి ఎంక్వైరీ చేయడంతో వారు పచ్చళ్ల ధరలు పంపించారు. అది చూసి షాకైన వ్యక్తి.. వారు చెప్పిన రేట్లకు దండం సింబల్​ పెట్టి.. Y so expensive this pickles i didnt understand అంటూ మెసేజ్ పెట్టాడు. దానితో అలేఖ్య చిట్టి పికిల్స్ నెంబర్ నుంచి ఓ ఆడియో వచ్చింది. దానిలో అతనిని చెప్పలేని భాషలో బూతులు తిడుతూ రికార్డ్ పంపారు అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది. 

ఇంతకీ పచ్చళ్ల ధర ఎంతంటే.. 

చికెన్ విత్ బోన్స్ అరకిలో పచ్చడి 530 రూపాయలు. అదే బోన్ లెస్ చికెన్ అయితే 750రూ. చికెన్ తొక్కు పచ్చడి అరకిలో 1000 రూపాయలు. గోంగూర చికెన్ రూ.900. మ్యాంగో చికెన్ అయితే 950 రూపాయలు. రొయ్యల పచ్చడి అరకిలో వెయ్యి రూపాయలు. గోంగూర రొయ్యల పచ్చడి అరకిలో 1200. మామిడికాయ రొయ్యల పచ్చడి అరకిలో 1250 రూపాయలు. చేపలు అరకిలో (బోన్ లెస్) 1300. మటన్ బోన్స్​తో అయితే అరకిలో 1200. బోన్​ లెస్ మటన్ అరకిలో 1420 రూపాయలు. గోంగూర మటన్ 1560 అరకిలో. మ్యాంగో మటన్ 1660 అరకిలో. 

అరకిలో పచ్చళ్లు ఇంత ధర అంటే ఎవరైనా షాక్ అవుతారు. అయినా ఆ అబ్బాయి నార్మల్​గా అడిగితే బూతులు తిడుతూ ఆడియో పంపించారంటూ సోషల్ మీడియాలో ఆడియోను వైరల్ చేస్తున్నారు. మీమ్స్ వేస్తున్నారు. హైజీన్ పేరుతో కాస్ట్ పెంచినా.. వారి పచ్చళ్లు వరస్ట్​గా ఉంటాయంటూ కామెంట్లు, రివ్యూలు ఇస్తున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by plugin_earphones (@plugin_earphones)

 ఫాలోయింగ్ ఎక్కువే.. 

రమ్య మోక్షకు ఇన్​స్టాలో ఓ పేజ్​లో 567 కె ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకున్న మరో పేజ్​లో 261 కె ఫాలోవర్లు ఉన్నారు. అలేఖ్య చిట్టి పికిల్స్ పేజ్​లో కూడా 73.9 కె ఫాలోవర్లు ఉన్నారు.  సుమ కంచర్లకు కూడా 61.3 కె ఫాలోవర్లు ఉన్నారు. వీరిలో రమ్య మోక్షకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఆమె ఫోటోలు, వీడియోలు బాగా వైరల్​ కూడా అవుతాయి. 

వల్గర్ కామెంట్లకు.. 

ఈ ముగ్గురు సిస్టర్స్ వీడియోలు కాస్త ఘాటుగానే చేస్తారు. దానికి ఎవరైనా వల్గర్​గా కామెంట్లు పెడితే.. వారు కూడా అదే రేంజ్​లో రిప్లై ఇస్తుంటారు. అయితే ఇప్పుడు పచ్చళ్ల కోసం ఓ వ్యక్తి పెట్టిన మెసేజ్​కు ఆడియో రూపంలో రిప్లై ఇవ్వడంతో వారి పికిల్స్ బాన్ చేయాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇప్పటివరకు అలేఖ్య చిట్టి పికిల్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget