అన్వేషించండి

India Pak No War: చితికిపోతామని తెలిసి దారికొచ్చిన పాకిస్తాన్ - గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్ - తెర వెనుక జరిగింది ఇదే !

India Pakistan: భారత్ పాక్ కాల్పుల విరమణ వెనుక చాలా జరిగింది. పాకిస్తాన్ పలు విధాలుగా భారత్‌ను బతిమాలుకుంది.

India Pakistan ceasefire: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలతో మూడో ప్రపంచయుద్ధం వస్తుందని వచ్చిన అంచనాలు తలకిందులు అయ్యాయి. రెండు దేశాలు చర్చలకు అంగీకరించి.. కాల్పుల విరమణ ప్రకటించాయి. ఇందులో అమెరికా హస్తం , ప్రమేయం ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడితే పాకిస్తాన్ చాలా త్వరగా తమకు జరిగిన, జరగబోయే నష్టాన్ని గుర్తించి దారిలోకి వచ్చేసింది. 

మొదట కాల్పుల విరమణ ప్రతిపాదన చేసిన  పాకిస్తాన్

కాల్పుల విరమణ ప్రతిపాదన చేసింది పాకిస్తానే. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి మిస్త్రి ప్రకటించారు. పాకిస్తాన్ సైన్యం నుంచి తమకు ఫోన్ వచ్చిందన్నారు. పాకిస్తాన్ కు నిజంగా  కక్కలేని  మింగలేని పరిస్థితి ఏర్పడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏర్పడిన పరిస్థితుల్ని పాకిస్తాన్ సరిగ్గా డీల్ చేయలేకపోయింది. ఆ ఉగ్రదాడి తమ  పని కాదని గట్టిగా చెప్పలేకపోయింది. కనీసం ఉగ్రవాదులపై చర్యలు తీసుకుంటామని చెప్పలేకపోయారు. అలా చెబితే ఉగ్రవాదులకు కోపం వస్తుంది.  అందుకే సమర్థించుకోక తప్పని పరిస్థితిలో పడిపోయింది.భారత్ సరిహద్దులు దాటి వచ్చిన చేసిన దాడులకు ఏదో ఓ సమాధానం ఇవ్వకపోతే ప్రజల్లో పరువు పోతుంది. అందుకే ఏది జరిగితే అది జరిగిందని దాడులు ప్రారంభించారు. కానీ  రెండు, మూడు రోజులకే తీవ్రమైన సైనిక, ఆర్థిక నష్టాన్ని చూసింది. ఇంకా కొనసాగిస్తే.. దివాలా తీయడం ఖాయమని అర్థమైపోయింది. అందుకే కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేశారు. 

భారత్ అంగీకరించడానికి కారణాలేమిటి ?

కాల్పుల విరమణకు అంగీకరించడంలోభారత్ కూడా ప్లాన్ తో నే వ్యవహరించింది.  పెహల్గాం లాంటి ఉగ్రవాద ఘటనలు చేపడితే పరిస్థితి ఎంత తీవ్రం గా ఉంటుందో చేతల్లో చూపించింది. వంద మందికిపైగా ఉగ్రవాదుల్ని చంపేసింది. తాము ఉగ్రవాద శిబిరాలపైనే చేశామని పదే పదే చెప్పింది. కానీ పాక్.. డ్రోన్ దాడులకు దిగడంతో   పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను నాశనం చేసింది. ఆర్థికంగా కట్టడి చేసింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ పూర్తిగా కుదేలు అయింది. అయితే అదే సమయంలో భారత్‌కూ కొంత నష్టం జరిగింది. ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదిగే ప్రయత్నంలో ఉన్న భారత్ .. ఇలాంటి అవాంఛనీయమైన పరిస్థితుల్ని ఎక్కువ రోజులు కొనసాగించనీయకూడదు. 

ఇక ఉగ్రదాడులు జరిగితే యుద్ధ చర్యలే! 

భారత్ ఈ కాల్పుల విరమణకు అంగీకరించే ముందు విధాన పరంగాఓ కఠిన నిర్ణయం తీసుకుంది. భారత్ ఇకపై ఉగ్రవాద దాడులు జరిగితే.. అవి యుద్ధ దాడులుగానే  భావించి చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. పాకిస్తాన్ ట్రైన్ అయిన జర్నలిస్టులు కశ్మీర్ కో.. మరో చోటకో వచ్చి దాడులు చేస్తే  పాకిస్తాన్ చేసిన యుద్ధంగానే భావిస్తామని కేంద్రం తేల్చింది. దీనికి పాకిస్తాన్ అంగీకరించింది. అందుకే  కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆర్మీ జనరల్స్ స్థాయిలో చర్చలు జరుగుతాయి. గతంలో చర్చలు ఆగిపోయాయి. 

పాక్ కు పెరిగిన అంతర్గత సమస్యలు 

పాకిస్తాన్ కు ఇప్పుడు ఉగ్రవాదుల్నికాపాడటం కాదు.. తమ దేశం చీలకుండా చూసుకోవడం కీలకం. బలూచిస్తాన్ లో .. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పట్టు సాధించింది. అక్కడ వందల మంది సైనికులు చనిపోతున్నారు. ఈ దశలో  పాకిస్తాన్ కు మరో ఆప్షన్ లేకుండా పోయింది. తెగేదాకా లాక్కోకుండా... కాళ్ల బేరానికి వచ్చేసింది. భారత్ ఎలాంటి ఎఫెక్ట్ కోసం చూసిందో అది రావడంతో అంగీకరించిందని అనుకోవచ్చు. 

టాప్ హెడ్ లైన్స్

Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Breaking News: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహ హింస కేసు..!

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Modi video:
"స్పందించి సలహాలు ఇచ్చిన వారికి ధన్యవాదాలు" మరో సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన ప్రధానమంత్రి
Revanth Reddy Indiramma Housing: హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
హైదరాబాద్ క్యూర్ పరిధిలో జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇళ్లు - అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
CJP Protest: సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
సీజేపీ నిరసన ప్రదర్శన వాంటెడ్‌ నేరస్థులకు కొత్త స్వర్గధామంగా మారిందా? వచ్చిన 216 మందిలో 215 మంది గుర్తింపు!
Ashes Test In India:  షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
షాకింగ్.. ఇండియాలో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ? చెన్నై బిగ్ బాష్ లీగ్ తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా క్రేజీ ప్లాన్!
Brezza Facelift: మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
మారుతి బ్రెజ్జా నయా లుక్‌! టర్బో ఇంజిన్ నుంచి ADAS గమనించాల్సిన 5 ప్రధానాంశాలు ఇవే! 
Ravneet Singh Bittu Resign: ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
ప్రధానమంత్రి సలహా మేరకు రాజీనామా చేసిన మంత్రి- వెంటనే రాష్ట్రపతి ఆమోదం
Raj Kundra Legal War: రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
రాజస్థాన్ రాయల్స్ మాజీ, ప్ర‌స్తుత ఓన‌ర్ల మ‌ధ్య లీగ‌ల్ వార్.. బీసీసీఐకి కంప్లైంట్ ఇచ్చిన శిల్ఫా శెట్టి భ‌ర్త కుంద్రా
NTA 47 Officials Removed: నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
నీట్ లీక్‌పై కేంద్రం ఉక్కుపాదం - నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో బిగ్ రీసెట్- 47 మంది అధికారుల తొలగింపు!
Embed widget