అన్వేషించండి

Independence Day 2022: ఆగస్టు 15, జనవరి 26న జెండా ఆవిష్కరణలో ఇంత తేడా ఉందా!

Flag Hoisting vs Flag Unfurling: జాతీయ జెండాను స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఒకలా, గణతంత్ర దినోత్సవాల్లో మరోలా ఎగరేస్తారు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

ఈ ఏడాది స్వాతంత్య్ర వేడుకలు ప్రత్యేకంగా నిలవనున్నాయి. హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం రెపరెప లాడుతోంది. అయితే....ఏటా రెండు సందర్భాల్లో దేశమంతా జాతీయ పతాకాని గౌరవ వందనం చేస్తుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓ సారి, ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో మరోసారి. ఈ రెండు సార్లు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించినప్పటికీ...ఆ విధానంలో ఎంతో తేడా ఉంటుంది. జనవరి 26న ఒకలా, ఆగస్టు 15నమరోలా జెండా ఎగరేస్తారు. దీన్నే ఫ్లాగ్ కోడ్ అంటారు. ఈ రెండు సందర్భాల్లో పాటించే జాగ్రత్తలేంటో..కనిపించే తేడాలేంటో ఓ సారి చూద్దాం. 

తేడాలివే..

1. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాల్లో జెండా కర్రకు త్రివర్ణ పతాకం కింది భాగంలో కట్టి ఉంటుంది. ఆ తాడుని పైకి లాగుతున్న కొద్ది జెండా పైకి చేరుకుంటుంది. చివరకు చేరుకోగానే తాడుని గట్టిగా లాగుతారు. అప్పుడు త్రివర్ణ పతాకం రెపరెపలాడుతుంది. 1947 ఆగస్టు 15వ తేదీన దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఇదే విధంగా చేశారు. స్వాతంత్య్రం సాధించిన ఆ చరిత్రాత్మక ఘటనకు సాక్ష్యంగా జెండాను ఆవిష్కరించారు. అప్పుడు ఆయన పాటించిన విధానమే ఇప్పటికీ కొనసాగుతోంది. రాజ్యాగంలోనూ దీని గురించి ప్రస్తావించారు. ఇంగ్లీష్‌లో దీన్నే "Flag Hoisting" అంటారు. అదే రిపబ్లిక్ డే వేడుకల్లో ముందుగానే జెండా పైన కట్టేసి ఉంటుంది. దాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ప్రక్రియను రాజ్యాంగంలో "Flag Unfurling"గా పేర్కొన్నారు. 

2. ఆగస్టు 15వ తేదీన దేశ ప్రధానమంత్రి జెండాను ఆవిష్కరిస్తారు. రాష్ట్రపతికి ఆ అవకాశం ఉండదు. ఇందుకు ఓ ప్రధాన కారణముంది.1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటికి దేశానికి ప్రధాని మాత్రమే ఉన్నారు. ఆయనే దేశ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికి రాజ్యాంగం కూడా అమల్లోకి రాలేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక, రాష్ట్రపతి పదవిని తీసుకొచ్చారు. అందుకే..ఆగస్టు 15న త్రివర్ణపతాకాన్ని ప్రధాని ఆవిష్కరిస్తే, ఆ రోజు సాయంత్రం రాష్ట్రపతి దేశాన్ని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తారు. అదే గణతంత్ర దినోత్సవంలో రాష్ట్రపతి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కనుక, రాజ్యాంగానికి అధినేతగా భావించే రాష్ట్రపతి జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తారు. 

3.ఆగస్టు 15న ఎర్రకోట వేదికగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తే..గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌పథ్‌లో జెండా ఎగరేస్తారు. 

ఫ్లాగ్ కోడ్ పాటించాల్సిందే..

కచ్చితంగా ఫ్లాగ్ కోడ్ నియాలను పాటిస్తూనే జెండా ఎగురవేయాలి. జాతీయ జెండా పట్ల పూర్తి గౌరవంతో ప్రజలు మెలగవలసి ఉంటుంది. అంతే జెండాను అవమానించే ప్రవర్తిస్తే మాత్రం భారీ జరిమానాతో పాటూ మూడేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. 2002 జనవరి 26 కొత్త ఫ్లాగ్ కోడ్ అమల్లోకి వచ్చింది. 2022న జూలైలో సవరణలు కూడా చేశారు. వాటి ప్రకారం జాతీయ జెండాను ఏ సమయంలోనైనా ఎగురవేయచ్చు. ఇంటి మీద కూడా ఎగురవేసుకోవచ్చు. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే మీ ఇంటిపై నిరభ్యంతరంగా జాతీయ జెండా ఎగురవేయండి. 

ఫ్లాగ్ కోడ్‌ను అనుసరించండి...
1.జెండాను ఒకప్పుడు ఖాదీ వస్త్రంతోనే తయారు చేసేవారు. ఇప్పుడు పాలిస్టర్‌తో చేసినవి కూడా అనుమతిస్తున్నారు. 

2. జాతీయ జెండాను ఎగురవేశాక, ఆ జెండా కన్నా ఎత్తులో ఇతర ఏ జెండా ఉండకుండా చూసుకోవాలి. అది దేవుడినిక సంబంధించినదైనా కూడా జాతీయ జెండా కన్నా తక్కువ ఎత్తులోనే ఉండేట్టు చూసుకోవాలి. 

3. చిరిగిపోయిన, నలిగిపోయిన జెండాను ఎగురవేయకూడదు. 

Also Read: Bihar Politics: బీజేపీ బిహార్ మిషన్ స్టార్ట్ అయిందా? కాషాయ పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా?

Also Read: Munugodu Congress : మన మునుగోడు - మన కాంగ్రెస్ ! ఉపఎన్నికల్లో అమల్లోకి రేవంత్ ప్లాన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

US Iran War Updates: పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ?
పశ్చిమాసియాకు భారీగా చేరుకున్న అమెరికా సైన్యం.. ఏ క్షణంలోనైనా ఇరాన్‌లో గ్రౌండ్ ఆపరేషన్ ?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Best SUVs for Family: రూ.10 లక్షల బడ్జెట్‌లో మీ ఫ్యామిలీకి ఏ SUV సెట్ అవుతుంది? కార్లు, ఫీచర్లు చూడండి
రూ.10 లక్షల బడ్జెట్‌లో మీ ఫ్యామిలీకి ఏ SUV సెట్ అవుతుంది? కార్లు, ఫీచర్లు చూడండి

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Amaravati What Next: అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
అమరావతికి చట్టబద్ధత - అసెంబ్లీ తీర్మానం తర్వాత అసలు ప్రక్రియ ఇదే!
Embed widget