అన్వేషించండి

World's Worst Tsunami: ఆ మహా ప్రళయానికి 20 ఏళ్లు - మానవాళి మరచిపోలేని పీడకల, రాకాసి అలలు మిగిల్చిన కన్నీళ్లు!

World's Worst Tsunami: సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఇదే రోజున రాకాసి అలలు ఎందరి జీవితాలనో అల్లకల్లోలం చేశాయి. హిందూ మహాసముద్రంలో సునామీ మిగిల్చిన కన్నీటి విషాదం ఇదీ..

World's Worst Tsunami: 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం అల్లకల్లోలం సృష్టించింది. డజనుకు పైగా దేశాల్లో 2,20,000 కంటే ఎక్కువ మందిని బలిగొన్న ఈ సునామీకి నేటితో 20 ఏళ్లు పూర్తైంది. ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపం పశ్చిమ తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా భారీ అలలు ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్, హిందూ మహాసముద్ర బేసిన్ చుట్టూ ఉన్న 9 ఇతర దేశాల తీర ప్రాంతాల్లోకి వచ్చాయి. కొన్ని నివేదికల ప్రకారం హిందూ మహాసముద్రంలో ఈ భూకంపం 10 నిమిషాలకు పైగా సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 9.1గా నమోదైంది. 120 అడుగుల పెద్ద అలలతో బీభత్సం సృష్టించిన ఈ భూకంపం పేరు చెబితే.. ఆనాటి రోజులను చూసిన వారు ఇప్పటికీ వణికిపోతుంటారు.

ఈ సునామి దాటికి కేవలం ఇండోనేషియాలోనే లక్ష 70 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమత్ర దివుల్లో శకలాలు మాత్రమే మిగిలాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌లో అయితే 107, కేరళ 177, తమిళనాడులో 8009, పాండిచ్చేరిలో 599, అండమాన్ నికోబార్ దీవుల్లో దాదాపు 3513 మంది మృత్యువాత పడ్డారు.

Image

భారీ విపత్తుకు 20 ఏళ్లు

డిసెంబర్‌ 26, 2004లో వచ్చిన సునామీ ఎందరి జీవితాలనో అతలాకుతలం చేసింది. ఇప్పటికీ ఆ రాకాసి అలలు తమ కళ్ల ముందే మెదలాడుతున్నాయని.. ఆ భయానక దృశ్యాలు గుర్తొచ్చినప్పుడల్లా ఆందోళన ఎక్కువవుతుందని అప్పటి సునామీ బాధితులు ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అలల విధ్వంసానికి ఎత్తైన భవనాలు సైతం క్షణాల్లో నేలకూలిపోయాయి. అప్పట్లో హిందూ మహా సముద్రంలో ఎలాంటి హెచ్చరిక వ్యవస్థ లేదు. దీని వల్ల భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. థాయిలాండ్‌లోని సముద్ర తీర హోటళ్లు, రిసార్ట్‌లకు వచ్చిన టూరిస్టులు ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ప్రసిద్ధ దేవాలయాలు, స్టేడియం వంటివి కూడా ఈ సునామీ ధాటికి కుప్పకూలిపోయాయి. కేవలం తమిళనాడు నాగపట్టణంలోనే 6 వేల మందికి పైగా మరణించారు.   

ఘోర విషాదం మిగిల్చిన..

  • గ్లోబర్ డిజాస్టర్ డేటాబేస్ EM-DAT ప్రకారం, ఈ సునామీ కారణంగా మొత్తం 2,26,408 మంది మరణించారు.
  • ఈ సునామీకి అత్యంత ప్రభావితమైన ప్రాంతాల్లో సుమత్రా ఒకటి. మొత్తం 1,65,708 మంది మరణించగా, ఇండోనేషియాలో మాత్రం  1,20,000 కంటే ఎక్కువ చనిపోయారు.
  • భారీగా వీచిన అలలు క్రమక్రమంగా హిందూ మహాసముద్రం చుట్టూ ప్రవహించాయి. కొన్ని గంటల తర్వాత శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్‌లను తాకాయి.
  • అత్యంత వేగంగా వ్యాపించిన ఈ అలలు గంటకు 800 కిలోమీటర్ల (500 mph) వేగంతో ప్రయాణించాయి. ఇది బుల్లెట్ రైలు కంటే రెండింతలు ఎక్కువ.
  • EM-DAT ప్రకారం, శ్రీలంకలో 35,000 మందికి పైగా మరణించారు. భారతదేశంలో 16,389 మంది, థాయ్‌లాండ్‌లో 8,345 మంది మరణించారు.
  • సోమాలియాలో దాదాపు 300 మంది, మాల్దీవుల్లో 100 మందికి పైగా, మలేషియా, మయన్మార్‌లలో డజన్ల కొద్దీ మరణించారు.

Image

కనుమరుగైన అందాలు..

సునామీకి ముందు పర్యాటకులకు స్వర్గధామంగా ఉన్న సుమత్రా దీవులు, తర్వాతి కాలంలో వాటి రూపురేఖలనే కోల్పోయాయి. చాలా ఏళ్ల పాటు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సందర్శకులు కూడా భయపడిపోయారంటేనే అర్థం చేసుకోవచ్చు సునామీ ప్రభావం ఏ స్థాయిలో ఉందో. ఇప్పుడిప్పుడే నివాసాలు, రిసార్టులు, మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సముద్రానికి కిలోమీటర్‌ అవతల మాత్రమే ఏర్పాటు చేసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నటు తెలిపారు. మత్స్యకారులు మాత్రం తమ జీవనోపాధిని దృష్టిలోపెట్టుకొని తీరం సమీపానికి చేరుకున్నారు. వారిలో సునామీ తాలూకూ భయాన్ని తొలగించేందుకు అధికారులు, ఏటా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం.

Also Read : UK Sharia: యూకే లో శరవేగంగా పెరుగుతున్న షరియా కోర్టులు, ముస్లిం జనాభా - ఇస్లామిక్ దేశంగా మారబోతోందా ?

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్

వీడియోలు

Tilak Varma Innings Ind vs SA T20 | అహ్మదాబాద్‌లో రెచ్చిపోయిన తిలక్ వర్మ
Hardik Pandya in India vs South Africa T20 | రికార్డులు బద్దలు కొట్టిన హార్దిక్
Suryakumar Yadav Batting Ind vs SA Series | బ్యాటర్‌గా విఫలమయ్యానన్న సూర్యకుమార్
India vs South Africa 5th T20 Highlights | సిరీస్ సొంతం చేసుకున్న భారత్
Atha Kodalu In Sarpanch Elections Heerapur | హోరాహోరీ పోరులో కోడలిపై గెలిచిన అత్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup 2026 Team India Squad :టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
టి20 ప్రపంచ కప్ ఇండియా స్క్వాడ్‌ నుంచి శుభ్‌మన్‌ గిల్ అవుట్‌! బీసీసీఐ ప్రకటించిన జాబితా ఇదే!
IPS PV Sunil Kumar: రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
రఘురామపై ఐపీఎస్ సునీల్ కుమార్ డైరక్ట్ ఎటాక్ - 420 అంటూ విమర్శలు - ఏం జరగబోతోంది?
Imran Khan : ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
ఇమ్రాన్ ఖాన్ బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష!పాకిస్తాన్ కోర్టు సంచలన తీర్పు!
Radhika Apte : సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
సెట్స్‌లో అసభ్యకర జోకులు - డబ్బు కోసమే ఆ సినిమాల్లో నటించా... రాధికా ఆప్టే సెన్సేషనల్ కామెంట్స్
Highest Opening Day Collection In India: షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్‌ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
షారుఖ్, సల్మాన్ కాదు... ఇండియాలో హయ్యస్ట్‌ ఓపెనింగ్ రికార్డు తెలుగు హీరోదే - ఎవరో తెలుసా?
Actor Sreenivasan Death: మాలీవుడ్‌లో విషాదం... సీనియర్ నటుడు శ్రీనివాసన్ మృతి - బ్లాక్‌బస్టర్స్‌ తీసిన కుమారుడు
మాలీవుడ్‌లో విషాదం... సీనియర్ నటుడు శ్రీనివాసన్ మృతి - బ్లాక్‌బస్టర్స్‌ తీసిన కుమారుడు
Vrusshabha Tralier : 'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
'వృషభ' మహారాజుకు ఎదురెళ్లడం అంత సులభమా? - మోహన్ లాల్ హిస్టారికల్ యాక్షన్ డ్రామా ట్రైలర్ చూశారా?
Year Ender 2025: ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
ప్రతి ఆర్మీ జవాన్‌ మీసం మెలేసే సంవత్సరం 2025; సాధించిన ఘనతలు చూస్తే గూజ్‌బంప్సే!
Embed widget