అన్వేషించండి

World Asthma Day 2024 : ఆస్తమా ఉన్నవారిని ట్రిగర్ చేసే అంశాలు ఇవే.. అస్సలు తినకూడని ఫుడ్స్ లిస్ట్

Asthma Day 2024 : దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యనే ఆస్తమా అంటారు. ఈ ప్రాణాంతక సమస్య ఉన్నవారు ఎలాంటి ఫుడ్స్​ తినాలి? లైఫ్​స్టైల్ ఎలా ఉండాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Asthma Prevention Tips : ఆస్తమా అనేది దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్య. ఈ వ్యాధి నయం కాదు. అందుకే ఈ వ్యాధిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించేందుకు.. ప్రతి సంవత్సరం మే 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఆస్తమా దినోత్సవం (World Asthma Day 2024) చేస్తున్నారు. ఆస్తమా సమస్యలు, వ్యాధిని ట్రిగర్ చేసే అంశాలు.. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటివి తినకూడదు వంటి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ డేని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2016లో దాదాపు 340 మిలియన్ల మంది ప్రజలు ఆస్తమాతో ఇబ్బంది పడ్డారని.. నాలుగు లక్షలకు పైగా చనిపోయారని WHO తెలిపింది.

సరైన అవగాహన లేకనే చాలామందిలో ఈ వ్యాధి ప్రాణాలు హరిస్తుందని గుర్తించి.. దానిపై పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. మొట్టమొదటిగా 1998లో ఈ ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని నిర్వహించారు. ఆస్తమాను ఉబ్బసం అంటారు. ఇది ఊపిరితిత్తులలోని శ్వాసనాళాలలో కలిగే దీర్ఘకాలిక వ్యాధి. ఈ సమస్య వలన శ్వాసనాళాలు ఉబ్బి.. ఇరుకుగా మారి.. దగ్గు, గురక, శ్వాసలో ఇబ్బందులు కలిగిస్తాయి. ఎలాంటి పరిస్థితులు దీనిని ట్రిగర్ చేస్తాయి.. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్స్​కి దూరంగా ఉండాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్తమాను ట్రిగర్ చేసే అంశాలు

ఆస్తమాలో వివిధ రకాలు ఉన్నాయి కానీ.. లక్షణాలు అనేవి అందరిలోనూ దాదాపు ఒకే విధంగా ఉంటాయి. గాలినాణ్యత సరిగ్గా లేకుంటే ఆస్తమా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దుమ్ము, డస్ట్, పుప్పొడి, ఎలుకల ద్వారా కూడా కొందరిలో ఆస్తమా వచ్చే అవకాశముంది. సిగరెట్ పొగ, కెమికల్స్, పర్యావరణ కాలుష్య కారకాలు కూడా ఆస్తమాను ప్రేరేపిస్తాయి. ఫుడ్ అలెర్జీ, స్లీప్ ఆప్మియా, ఊబకాయం, శ్వాసకోశ వ్యాధులు, మందు, సిగరెట్, డ్రగ్స్ ఇలా మొదలైనవన్నీ ఆస్తమాను ట్రిగర్ చేస్తాయి. 

ఫుడ్​ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Asthma Day 2024 ఆస్తమాను ఫుడ్​ కూడా ట్రిగర్ చేస్తుంది. కాబట్టి తీసుకునే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. తాజా, పోషకాలతో కూడిన ఆహారం తినడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. దీనివల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలా అని ఆస్తమాను పూర్తిగా తగ్గించగల ఆహారం లేదు. కానీ తాజా పండ్లు, కూరగాయలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే ఆరోగ్యప్రయోజనాలు పొందుతారు. 

ఆహారంలో పాలు, గుడ్లు వంటి విటమిన్ డి అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. క్యారెట్, ఆకుకూరలు, బీటా కెరోటిన్ అధికంగా ఉండే కూరగాయలు, గుమ్మడి గింజలు, మెగ్నీషియం అధికంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటే ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. ఇవి ఆస్తమా లక్షణాలు పెరగుకుండా హెల్ప్ చేస్తాయి. 

ఎలాంటి ఫుడ్స్ తీసుకోకూడదంటే..

డ్రై ఫ్రూట్స్​, వైన్​లలో ఉండే సల్ఫైట్స్ ఆస్తమా లక్షణాలను తీవ్రతరం చేస్తాయి. బీన్స్, క్యాబేజి, ఉల్లిపాయలు, గ్యాస్​ను విడుదల చేసే ఫుడ్స్​ కూడా ఉబ్బసాన్ని తీవ్రం చేస్తాయి. ఎందుకంటే ఇవి గ్యాస్​ను విడుదల చేసి.. ఊపిరితిత్తులపై మరింత ప్రెజర్​ను ఇస్తాయి. కొన్నిరకాల కెమికల్స్, సాలిసైలేట్​లు కలిగిన ఫుడ్స్ తినకపోవడమే మంచిది. 

ఆస్తమాకు చికిత్స తీసుకున్న పూర్తిగా తగ్గదు. కాబట్టి.. ఈ దీర్ఘకాలిక వ్యాధిని లైఫ్​స్టైల్​లోని కొన్ని మార్పులతో కంట్రోల్ చేయవచ్చు. దీనివల్ల మరణాలు దూరమవుతాయి. ఇదే ఉద్దేశంతో ఏటా ఆస్తమా డేను నిర్వహించి.. ప్రజలకు ఈ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. 

Also Read : బరువు తగ్గించడంలో, హెల్తీగా ఉంచడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ ఇవి.. రెగ్యూలర్​ డైట్​లో చేర్చుకోండిలా

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget