అన్వేషించండి

చేపల్ని పసుపు, ఉప్పులో ఎందుకు మారినేట్ చేసి పెడతారో తెలుసా?

నోరూరించే చేపలు ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు. చేపలతో చేసిన వంటకాలు అంటే లొట్టలేసుకుని మరీ తింటారు.

సాంప్రదాయ భారతీయ వంటల్లో ఉప్పు, పసుపు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఏదైనా నాన్ వెజ్ వంటకం చేసే ముందు ఆ మాంసాన్ని ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టడం చేస్తారు. ఇక చేపలు అయితే కొంతమంది వాటి వాసన పోగొట్టేందుకు ఉప్పు, పసుపు వేసి కడుగుతారు. అలాగే వాటిని వంట చేసే ముందు ఉప్పు, మిరియాలు, సుగంధ ద్రవ్యాలు వేసి మారినేట్ చేస్తారు. ఇది పురాతన వంట సంప్రదాయం. ఇలా చెయ్యడానికి ఒక కారణం కూడా ఉంది.

పురాతన కాలం నుంచి భారతీయ వంటలలో సువాసన ఇచ్చే పదార్థంగా పసుపుని ఉపయోగిస్తారు. ఇది వంటలకి ప్రత్యేకమైన రుచి ఇవ్వడమే కాదు మారినేట్ చేయడం వల్ల చేపలు ఎక్కువ కాలం తాజాగా ఉంచుతుంది. ఉప్పు వాటి తాజాదనాన్ని చెడిపోకుండా కాపాడుతుంది.

పచ్చి చేపలని మెరినేట్ చేయడానికి పసుపు ఉపయోగించడానికి కారణం అందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు. జెర్మ్స్, ఇన్ఫెక్షన్స్ ని రాకుండా ఉంచడంలో సహాయపడుతుంది. ఉప్పు, పసుపు కలయిక వల్ల చేపలు తాజాగా ఉంటాయి. సూక్ష్మజీవుల సంతానోత్పత్తి అవకాశాలని తొలగిస్తుంది. చేపల్ని ఇలా మెరినేట్ చేసి పెట్టడం వల్ల చెడువాసన ఉండవు. ఇవి చేపలకి మంచి ఆకృతి కూడా ఇస్తాయి.

చేపల వల్ల ప్రయోజనాలు

చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు శరీర నొప్పులని తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు శీతాకాలంలో చేపలు తినడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణగా ఉంటాయి. జలుబు, దగ్గు వంటివి దరి చేరకుండా అడ్డుకుంటాయి. చర్మాన్ని సంరక్షించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. చలికాలంలో చర్మం పొడిబారిపోతుంది. ఒమేగా ఆమ్లాలు ఆ సమస్యని దూరం చేస్తాయి.

గుండె సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా చేపలు తినాలి. గుండె పోటు రాకుండా నివారిస్తుంది. మానసిక ఆందోళనతో బాధపడే వారికి చేపలు అధ్బుతమైన ఔషధం. యాంగ్జయిటీ, డిప్రెషన్ సమస్యలు ఉన్నవాళ్ళు చేపల్ని వారానికి రెండు మూడు సార్లు తింటే మంచిది. కంటి చూపుని మెరుగుపరచడంలోని కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ డి లోపం తలెత్తకుండా ఉండాలంటే చేపలు తినాలి. చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉండదు కాబట్టి చేపల ద్వారా విటమిన్ డి పొందవచ్చు. ఈ విటమిన్ వల్ల శరీరం కాల్షియాన్ని శోషించుకునేలా చేస్తుంది. దీని వల్ల దంతాలు, ఎముకలు ధృడంగా మారతాయి. రోగనిరోధక శక్తి పెరిగేందుకు సీఫుడ్ సహకరిస్తుంది. అందుకే తరచూ చేపలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: ఈ సింపుల్ వ్యాయామాలతో బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోతుంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Annamalai Reaction 1000Crores Google Pay | కోయంబత్తూరులో డీఎంకే వెయ్యికోట్లు పంచిందా..? | ABP DesamRohit Sharma on Impact Player | IPL 2024 లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై హిట్ మ్యాన్ గుస్సా | ABP DesamLoksabha Elections 2024 | Tamil Nadu సహా 21రాష్ట్రాల్లో మొదలైన పోలింగ్ పండుగ | ABP DesamPBKS vs MI Toss Coin in IPL 2024 | కెమెరా మెన్ ఫోకస్ కరో ఫోకస్ కరో అన్నట్లుగా ఐపీఎల్ లో టాస్ లైవ్ షో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad News: సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
సంతానం కోసం గరుడ ప్రసాదం వితరణ - చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జాం
Heavy Temparatures: నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
నిప్పుల గుండంలా తెలుగు రాష్ట్రాలు - ఈ జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: తమిళనాడులో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Lok Sabha Election 2024: ఇది కదా ప్రజాస్వామ్యం గొప్పదనం, వీళ్లే అసలు సిసలు సెలెబ్రిటీలు
Tillu Square OTT: ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
ఓటీటీలో పాన్‌ ఇండియాగా వస్తున్న 'టిల్లు స్క్వేర్‌' - రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌, ఆ రోజు నుంచే స్ట్రీమింగ్‌!
Mahesh Babu SSMB29: క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
క్రేజీ అప్‌డేట్‌, దుబాయ్‌ నుంచి వచ్చేసిన మహేష్‌, రాజమౌళి - ఇక షూటింగ్‌ అప్‌డేటేనా?
Eesha Rebba Birthday : ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
ఈ తెలుగు అందానికి ముప్పై నాలుగు ఏళ్లు.. ఈషా రెబ్బా బర్త్​డే స్పెషల్ ఫోటోలు చూశారా?
Tariff: జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
జూన్‌ నుంచి ఫోన్‌లో మాట్లాడాలంటే వణికి పోవాల్సిందే! ఎన్నికల తర్వాత పడే మొదటి ఎఫెక్ట్ ఇదే!
Embed widget