అన్వేషించండి

Career Options After 12th : ఇంటర్ తర్వాత అద్భుతమైన కెరీర్ ఆప్షన్స్.. ఎక్కువ జీతంతో పాటు లైఫ్ సెట్ చేసుకోగలిగే ఎంపికలు ఇవే

Courses after Inter : ఇంటర్ తర్వాత కెరీర్ మనం ఎలా మలచుకుంటామో.. అదే మన భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది. అందుకే 12 తర్వాత ఎంచుకోగలిగే 5 అద్భుతమైన కెరీర్ ఆప్షన్స్ ఇప్పుడు చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇంటర్ తర్వాత కెరీర్ ఎంచుకోవడం భవిష్యత్తుకు కీలకం.
  • డేటా సైన్స్, ఏఐ రంగాల్లో మంచి అవకాశాలున్నాయి.
  • న్యాయ రంగం, ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఆశాజనకం.
  • దేశ సేవకు NDA, క్రియేటివిటీకి డిజిటల్ మార్కెటింగ్.

Top Career Options After 12th : ఇంటర్ పరీక్షలు అయిపోగానే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదుర్కొనే అతిపెద్ద ప్రశ్న పిల్లల్ని తర్వాత ఏమి చేయాలి? ఈరోజుల్లో మంచి కెరీర్ కావాలనుకుంటే ఎలాంటి ఆప్షన్స్ ఎంచుకోవాలో అని ఆలోచిస్తారు. కానీ ఒకప్పుడు చాలామంది డాక్టర్లు లేదా ఇంజనీర్లు అవ్వాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. నేటి ప్రపంచంలో తెలివైన కెరీర్ ఆప్షన్ లేకుంటే.. ఫ్యూచర్ ప్రశ్నార్థకంగా మారుతుంది. భవిష్యత్తులో సక్సెస్ అయ్యేందుకు ఇంటర్ తర్వాత కెరీర్ ఆప్షన్ ఎంచుకోవడం కీలకం. వాటివల్ల మీరు మంచి ఆదాయం, సమాజంలో గౌరవం, సురక్షితమైన భవిష్యత్తును పొందగలుగుతారు. అలాంటి అద్భుతమైన కెరీర్ ఎంపికల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంచుకునే కెరీర్ ఆప్షన్ ముఖ్యం

ఈ రోజుల్లో కష్టపడితే సరిపోదు.. సరైన వృత్తిని ఎంచుకోవడం కూడా ముఖ్యం. చాలామంది ఏమి చేస్తారంటే.. ఎక్కువమంది దేనిలో జాయిన్ అవుతున్నారో చూసి.. వారిని అనుసరించి.. ఉద్యోగ హామీ లేని కోర్సులను ఎంచుకుంటారు. అలాకాకుండా స్టూడెంట్స్ తమ ఆసక్తి, నైపుణ్యాలకు అనుగుణంగా ఉండే వృత్తిని ఎంచుకోవడం చాలా అవసరం. తద్వారా మీరు విజయవంతమైన, సమతుల్యమైన జీవితాన్ని పొందగలుగుతారు.

డేటా సైన్స్, ఏఐ

సోషల్ మీడియా కాలంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కెరీర్ ఆప్షన్స్​లో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి. డేటాను అర్థం చేసుకోగల, సరైన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడగల నిపుణులను ప్రధాన కంపెనీలు నియమించుకుంటున్నాయి. కాబట్టి మ్యాథ్స్, టెక్నాలజీపై ఆసక్తి ఉన్న విద్యార్థులు దీనిని ఎంచుకోవచ్చు. ప్రారంభ జీతం కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

న్యాయ రంగం..

ఈరోజుల్లో లాయర్ వృత్తి కూడా ఆశాజనకంగా మారింది. న్యాయవాదుల పాత్ర ఇకపై కోర్టు గదికే మాత్రమే పరిమితం కాకుండా కార్పోరేట్​ వైపు అడుగులు వేస్తుంది. దీనికోసం మీరు బి.ఏ ఎల్.ఎల్.బి లేదా బి.బి.ఏ ఎల్.ఎల్.బి.. వంటి ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సును చేయవచ్చు. విద్యార్థులు పెద్ద కంపెనీలలో న్యాయ సలహాదారులుగా మారవచ్చు. ఈ రంగం మంచి జీతభత్యాలు అందించడమే కాకుండా.. మీకు మంచి క్రెడిబులిటీ ఇస్తుంది.

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్

నిర్వహణ రంగంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు.. ఐపీఎం (ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్) ఎంచుకోవచ్చు. దీనివల్ల విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేసిన వెంటనే తమ నిర్వహణ అధ్యయనాలను ప్రారంభించవచ్చు. తద్వారా ప్రత్యేక గ్రాడ్యుయేట్ డిగ్రీ అవసరం ఉండదు. ఈ కోర్సు సమయాన్ని ఆదా చేయడంతో పాటు.. త్వరగా వృత్తి మార్గాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతుంది.

ఎన్​డీఏ 

దేశ సేవ చేయాలనే తపన ఉన్న విద్యార్థులు ఎన్‌డిఎని ఎంచుకోవచ్చు. ఇదొక ప్రతిష్టాత్మకమైన ఎంపిక. 12వ తరగతి తర్వాత ఎన్‌డిఎ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా విద్యార్థులు భారత సైన్యంలో అధికారులుగా చేరవచ్చు. ఈ రంగంలో లభించే గౌరవం, సౌకర్యాలు, క్రమశిక్షణ దీనిని అన్నింటికంటే ప్రత్యేకంగా చేస్తాయి. దేశానికి సేవ చేయాలనుకునే వారి కోసమే ఈ వృత్తి ఉంది.

డిజిటల్ మార్కెటింగ్..

నేటి డిజిటల్ యుగంలో డిజిటల్ మార్కెటింగ్, కంటెంట్ క్రియేషన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలు. ప్రతి కంపెనీకి, సెలబ్రెటీకి తమ సోషల్​ మీడియా ఫాలోవర్స్ పెంచుకోవడానికి నిపుణులు అవసరం. ఈ రంగం క్రియేటివిటీ ఉన్న విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. ప్రపంచ స్థాయిలో పనిచేసేందుకు వీలు కల్పిస్తుంది.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Thyroid In Women : మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
మహిళల్లో థైరాయిడ్ సమస్యలు మగవారికంటే ఎక్కువ రావడానికి కారణాలేంటి? ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Nerve Weakness : నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
నరాల బలహీనతకి కారణాలు ఏంటి? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
Severe Traumatic Brain Injury : రోడ్డు ప్రమాదంలో మెదడుకు తీవ్ర గాయం.. 30 ఏళ్ల వ్యక్తిని అత్యాధునిక పద్ధతిలో కాపాడిన వైద్యులు
రోడ్డు ప్రమాదంలో మెదడుకు తీవ్ర గాయం.. 30 ఏళ్ల వ్యక్తిని అత్యాధునిక పద్ధతిలో కాపాడిన వైద్యులు
Advertisement

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో అందరి కన్ను!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
AP Local Body Elections 2026 Delay: ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
ఏపీ లోకల్ పోల్స్‌పై చంద్రబాబు మౌనం - ఇంకెప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు?
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
అమల్లోకి కొత్త EV పాలసీ - పెట్రోల్ బైక్‌లకు గుడ్‌బై గడువు ఫిక్స్, EV కొనేవాళ్లకు భారీ ప్రోత్సాహకాలు
ఏప్రిల్‌ 1 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ బండ్ల రిజిస్ట్రేషన్‌ మాత్రమే, రూ.30,000 రాయితీ కూడా!
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Kajal Aggarwal: కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
కాజల్ సన్నబడిందా? ఇండియా స్టోరీ ప్రమోషన్లలో చందమామ
Embed widget