అన్వేషించండి

Cannibal Tribes: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..

మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ఇంకా నరమాంస భక్షకులు జీవిస్తున్నారు. తోటి వ్యక్తిని చంపి మరే తినేసే ప్రమాదకర ప్రజలు జీవిస్తు్న్నారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ఉందా?

సాధారణంగా కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు జరుపుతారు. సాంప్రదాయం ప్రకారం ఖననం చేస్తారు, లేదా దహనం చేస్తారు. అయితే, అక్కడి ప్రజలు మాత్రం అలా చేయరు. ఆ శవాన్ని ముక్కలు చేసి ఆకుల మధ్యలో పెట్టి ఉడికించుకుని మరీ తింటారు. ఇది చదివితేనే ఒళ్లుగగూర్పాటు కలుగుతుంది కదూ. ఈ సాంప్రదాయం ఇప్పటికీ పాటిస్తున్నారట. 

☀ నరమాంస భక్షకులు అనగానే.. అంతా మన దేశంలో నివసించే అఘోరాల వైపే చూస్తారు. కానీ, వారి కంటే ప్రమాదకరమైన మనుషులు ఈ ప్రపంచంలో చాలాచోట్ల ఉన్నారు. కొన్ని దేశాల్లో తమ శత్రువుల శవాలను ఇంటికి తీసుకెళ్లి విందు చేసుకొనే సాంప్రదాయం కూడా ఉంది. వారి గురించి తెలుసుకొనే ముందు.. బంధువులు, స్నేహితులను ఆహారంగా తీసుకొనే తెగ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. 

☀ నరమాంస భక్ష్యాన్ని ‘ఆంత్రోపోఫాగి’ అని కూడా అంటారు. మనుషులను తినే మనుషులను కరిబాలెస్ లేదా కానబాలెస్ (Caríbales or Caníbales) అని అంటారు. ఇది నరమాంస భక్షణకు ప్రసిద్ధి చెందిన వెస్టిండీస్ తెగ ‘కరీబ్’ నుంచి ఉద్భవించింది. మానవ చరిత్ర ఆరంభంలో ఇది విస్తృతమైన ఆచారం. అప్పట్లో మనుషులు కూడా జంతువుల తరహాలోనే ప్రవర్తించేవారు. ఆకలి, శరీరక అవసరాల కోసం తోటి మనిషిని చంపి తినేవారు. కాలం మారేకొద్ది మనుషుల్లో కలిగిన మార్పుల వల్ల నరమాంస భక్ష్యాన్ని వికృతమైన చర్యగా పరిగణించడం మొదలైంది. కానీ, ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉన్న ఆదివాసీ తెగల్లో ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగుతోంది. 

బంధువులను, మిత్రులను తినేస్తారు..: ఆస్ట్రేలియాలోని ఆదిమ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నరమాంసాన్ని తింటారు. దీని కోసం వారు ఇతరులను హత్య చేయరు. కేవలం చనిపోయిన వ్యక్తులను మాత్రమే తింటారు. పశ్చిమ న్యూ గినియాలో ఎన్డీరామ్ కబుర్ నది వెంట కొరోవై అనే తెగ నివసిస్తోంది. ఎవరో మంత్రగాడు వారి సమూహంలోని సభ్యులను చంపేస్తాడని అక్కడి గిరిజనులు నమ్ముతారు. మరణానికి ప్రతీకారం తీర్చుకోవడం కోసం చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని తినడం వారి కర్తవ్యం. అంటే.. చనిపోయిన వ్యక్తి ఆత్మను మంత్రగాడికి దక్కకుండా వారిలోనే కలిపేసుకోవడం వారి ఆచారం. సుమారు 10,000 సంవత్సరాల నాటి ఆదిమ ప్రజల తరహాలోనే ఇక్కడి ప్రజలు నివసిస్తున్నారు. ఈ సాంప్రదాయాన్ని ‘ఎండోకానిబలిజం’ అంటున్నారు. ఈ ప్రక్రియను వారు గౌరవంగా భావిస్తారట. 

ఈ ప్రాంతాల్లో ఎక్కువ: పశ్చిమ మధ్య ఆఫ్రికా, మెలనేసియా(ఫిజి), న్యూ గినియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని మావోరిస్‌లోని కొన్ని ద్వీపాలలో ఇప్పటికీ నరమాంస భక్షణ కొనసాగుతున్నట్లు సమాచారం. పాలినేషియా, సుమత్రా, ఉత్తర-దక్షిణ అమెరికాలోని వివిధ తెగలలో కూడా ఈ సాంప్రదాయం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మానవ మాంసాన్ని ఆహారంగా పరిగణిస్తారు. జంతువుల మాంసంతో సమానంగా వాటిని విక్రయిస్తున్నారు. విక్టోరియస్ మావోరీలు యుద్ధంలో చనిపోయిన సైనికుల శరీరాలతో విందు చేసుకుంటారు. సుమత్రాలోని బతక్ డచ్ పాలకుల నియంత్రణలోకి రాక ముందు మార్కెట్లలో మానవ మాంసాన్ని విక్రయించేవారని సమాచారం.

శత్రువులను తినేస్తారు: ఆఫ్రికాలో ఎక్కువగా మంత్ర విద్యలు, చేతబడులు జరుగుతాయి. ఈ సందర్భంగా బలిచ్చే వ్యక్తులను ఆహారంగా తినేయడం అక్కడి సాంప్రదాయం. యుద్ధంలో బంధీలయ్యే సైనికులను ఒకప్పుడు ఆహారంగా తీసుకొనేవారని అక్కడి చరిత్ర చెబుతోంది. ఫిజి ఐలాండ్ కూడా నరమాంస భక్ష్య చరిత్రకు ప్రసిద్ధి చెందింది. అందుకే దీన్ని ‘నరమాంస ద్వీపం’ అని కూడా అంటారు. ఈ ద్వీపంలో నైహేహే గుహల్లో నివసించే ప్రజలు మాత్రమే ఈ పద్ధతులు పాటిస్తున్నట్లు సమాచారం. మిగతా తెగలు దాదాపు అంతరించిపోయాయి. 

☀ ఖైమర్ రూజ్ తిరుగుబాటులో పోరాడుతున్న కంబోడియన్ సైనికులు ఆకలి వేస్తే.. యుద్ధభూమిలో చనిపోయిన  ఖైమర్ రూజ్ సైనికుల ఆహారంగా తినేస్తారట. యుద్ధం ముగిసిన తర్వాత కొంతమంది శత్రువులను ఇంటకి తీసుకెళ్లి మరీ ఆరగిస్తారట. వారి శరీరంలోని గుండె, కాలేయాలను బయటకు తీసేసి వండుకుని తింటారట. 

☀ మన దేశంలోని అఘోరిలు కూడా నరమాంస భక్షక ఆచారాలను పాటిస్తున్నారు. కేవలం సుమారు 25 మంది వరకు మాత్రమే మానవ పుర్రెలను గిన్నెలుగా ఉపయోగిస్తారు. చితిపై కాలిన మానవ అవశేషాలను బూడిదగా శరీరానికి రాసుకుంటారు. వీరు ఎవరినీ హత్య చేయరు. చనిపోయిన వ్యక్తుల శరీరంలోని కొన్ని భాగాలను మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. 

వీరు చాలా డేంజర్: న్యూ గినియాలో నివసించే ‘అస్మత్’ ఆదివాసీ తెగ చాలా డేంజర్. వీరు మనుషులను హత్య చేసి కూడా ఆహారంగా తీసుకుంటారని ఒకప్పుడు అక్కడ పర్యటించిన జర్నలిస్ట్ వెల్లడించాడు. ఆ పర్యటనలో అతడు అక్కడి ప్రజలు ఒక వ్యక్తిని ఏ విధంగా ఆహారంగా తీసుకున్నారనేది ప్రత్యక్షంగా చూశాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గిరిజనులు చనిపోయిన వ్యక్తి మెదడును అరచేతితో బయటకు లాగారు. దాన్ని ఆకులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆకును చుట్టి.. నిప్పు మీద దాన్ని కాల్చుకుని తిన్నారు’’ అని తెలిపాడు. 

☀ 1961లో రాజవంశానికి చెందిన నెల్సన్ రాక్‌ఫెల్లర్ ఐదవ కుమారుడు మైఖేల్ రాక్‌ఫెల్లర్‌ను కూడా ఈ తెగ ప్రజలు హత్య చేసి ఆహారంగా తీసుకున్నట్లు సమాచారం. రాక్‌ఫెల్లర్ న్యూ గినియా ప్రాంతంలో ఒక యాత్రలో పాల్గొన్నాడు. ప్రమాదవసాత్తు అతడు ప్రయాణిస్తున్న పడవ బోల్తాపడింది. దీంతో అతడు ఈదుకుంటూ ఈ తెగ నివసిస్తున్న ప్రాంతానికి చేరాడు. దీంతో అస్మత్ తెగ ప్రజలు అతడిని హత్య చేసి తినేసినట్లు సమాచారం.

Also Read: గడ్డం పెంచేవారు కుక్కలు కంటే హానికరమట.. ఫీల్ కావద్దు, ఎందుకో తెలుసుకోండి!

☀ అండమాన్ నికోబార్‌కు సమీపంలో, మన దేశానికి తూర్పు దిక్కులో ఉన్న సెంటినలీస్ ద్వీపంలో కూడా నరమాంస భక్షకులు జీవిస్తున్నారు. అయితే, సాధారణ మానవులు ఎవరూ అక్కడ అడుగుపెట్టలేరు. ఒకవేళ ప్రయత్నించినా వారికి ఆహారం కావడం ఖాయం. వీరికి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేదు. 60 వేల ఏళ్ల నుంచి ఈ తెగ ప్రజలు ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే, 2018లో అక్కడి ప్రజలను క్రైస్తవ మతంలోకి మార్చే ప్రయత్నంలో భాగంగా ద్వీపంలో అడుగుపెట్టిన యుఎస్ మిషనరీ జాన్ అలెన్ చౌను విల్లును బాణాలతో చంపినట్లు సమాచారం. మరి, అతడి శరీరాన్ని ఏం చేశారనేది ఇప్పటికీ అంతుచిక్కలేదు. 

Also Read: ఛీ.. యాక్.. ఈ ఆహారాన్ని లొట్టలేసుకుని మరీ తింటారట, ఇది ఏమిటో తెలుసా?

Also Read: ఈ ఊరిలో ప్రజలంతా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఇదో భిన్నమైన గ్రామం

Also Read: కుక్కకు రూ.15 కోట్ల ఆస్తి రాసేసిన ప్లేబాయ్ మోడల్, కారణం తెలిస్తే షాకవ్వడం ఖాయం!

Also Read: కూల్ డ్రింక్ తాగిన కొన్ని గంటల్లోనే వ్యక్తి మృతి.. ఇతడిలా మీరు చేయొద్దు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Curry Leaves and Hair Oil : జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా కనిపించాలంటే.. కరివేపాకుతో ఈ 5 రకాల నూనెలను కలిపి ట్రై చేయండి
Best Foods for Dinner : రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
రాత్రి భోజనం ఇలా ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదట.. ఏం తినాలి? ఏం తినకూడదు?
IRCTC Japan Tour Package : IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే
IRCTC జపాన్ టూర్ ప్యాకేజీ.. తక్కువ బడ్జెట్‌లో 10 రోజుల ప్రత్యేక ప్యాకేజీని పొందండి, పూర్తి వివరాలివే

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget