అన్వేషించండి

Tasty Millet Ravva Dosa : క్రిస్పీ, హెల్తీ మిల్లెట్ రవ్వ దోశ.. టేస్టీగా రావాలంటే ఈ రెసిపీని ట్రై చేయండి

Healthy Breakfast : రవ్వ దోశను హెల్తీగా చేసుకోవాలంటే మీరు మిల్లెట్ రవ్వ దోశను ట్రై చేయాలి. దీనిని తయారు చేయడం కూడా చాలా ఈజీ. క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఈ రెసిపీని ట్రై చేయవచ్చు.

Tasty Millet Ravva Dosa Recipe : మిల్లెట్స్ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ముఖ్యంగా సమ్మర్​లో రాగిపిండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వేడిని తగ్గించడం మొదలుకొని.. బరువు తగ్గడంలో బాగా హెల్ప్ చేస్తుంది. అందుకే  దీనిని సమ్మర్​లో ఏదోరకంగా డైట్​లో తీసుకోవాలంటున్నారు నిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం రాగిపిండితో టేస్టీ, క్రిస్పీ రవ్వదోశను చేసుకోవచ్చు. ఇది రవ్వ దోశ కంటే మంచి రుచిని ఇస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మరి ఈ హెల్తీ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

రాగిపిండి - 1 కప్పు

బొంబాయి రవ్వ - 1 కప్పు

గోధుమ పిండి - అరకప్పు

ఉప్పు - తగినంత 

ఇంగువ - చిటికెడు

కరివేపాకు - 2 రెబ్బలు (సన్నగా తురుముకోవాలి)

మిరియాల పొడి - అర టీస్పూన్

జీలకర్ర - 1 స్పూన్

పచ్చిమిర్చి - 2 టీస్పూన్లు 

పలుచని మజ్జిగ - 1 లీటరు

నీరు - తగినంత

నూనె - దోశలు రోస్ట్ చేయడానికి

ఉల్లిపాయ ముక్కలు - పెనం మీద వేసుకోవడానికి 

తయారీ విధానం

ముందుగా కరివేపాకు, పచ్చిమిర్చిని సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఓ మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో రాగిపిండి తీసుకోవాలి. అదే పిండిలో బొంబాయి రవ్వ, గోధుమ పిండి వేసి బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి ప్లేస్​లో మీరు బియ్యం పిండిని వేసుకోవచ్చు. ఇది పిండికి కాస్త జిగురునిస్తుంది. ఇప్పుడు దానిలో సాల్ట్, ఇంగువ, జీలకర్ర, మిరియాల పొడి, పచ్చిమిర్చి తురుము, కరివేపాకు తురుము వేసి కలుపుకోవాలి. అప్పుడు దానిలో మజ్జిగ వేస్తూ పిండిని కలుపుకోవాలి. మజ్జిగను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలపాలి. ఇలా కలిపిన పిండి ఓ పది నిమిషాలు పక్కన పెట్టేయాలి. పది నిమిషాల తర్వాత మజ్జిక పిండిలోకి వెళ్లి కాస్త గట్టిపడుతుంది. దోశ  వేసుకోవడానికి పిండి కాస్త పలుచగా ఉండాలి. అందుకే దానిలో ఓ అరలీటర్ నీరు వేసి రవ్వ దోశకు కలిపినట్లు పిండిని కలుపుకోవాలి. అప్పుడే పిండి దోశ వేయాడనికి సిద్ధమవుతుంది. 

ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై దోశ తవా పెట్టాలి. అయితే మీరు క్రంచీ రవ్వ దోశ చేసుకోవాలనుకున్నప్పుడు నాన్​స్టిక్​ దోశ పాన్​ కన్నా.. ఐరన్ దోశ తవాను ఎంచుకుంటే దోశలు బాగా వస్తాయి. స్టౌవ్ మీద వెలిగించిన దోశ తవా అన్ని వైపులా వేడిగా అయ్యేలా చూసుకోండి. మధ్యలో వేడిగా ఉండి.. చివర్లలో కాకుండా దోశలు మంచిగా రావు. కాబట్టి తవాను అన్ని వైపులా వేడి చేయండి. ఇప్పుడు దానిపై ఓ రెండు టీస్పూన్ల నూనెను వేసి స్ప్రెడ్ చేయండి. దానిలో ఉల్లిపాయలు చల్లి ఇప్పుడు దోశ పిండిని తీసుకుని.. పెనంపై చిలకరించినట్లు.. పూర్తిగా దోశ పాన్​ అంతా వచ్చేలా వేయండి. గ్యాప్స్​లో కూడా పిండిని వేసుకుంటూ.. ఓ పలుచని దోశ వేసుకోవచ్చు. పిండిని అన్నివైపులా సమానంగా ఉంటేనే బాగుంటుంది.

దోశ అంచులకు నూనె వేయాలి. మధ్యలో కూడా నూనె వేసి.. దోశను చివర్లు కూడా రోస్ట్ అయ్యేలా జరుపుతూ.. దానిని కాల్చాలి. ఇలా చేస్తే దోశ అన్నివైపులా క్రిస్పీగా వస్తుంది. లేదంటే మధ్యలోనే ఎక్కువ కాలిపోతుంది. అంతే దోశ రెడీ. ఇలా ఓ రెండు మూడు దోశలు వేసుకునే లోపు పిండి గట్టిపడుతుంది. కాబట్టి మరికొంత నీటిని దానిలో వేసి మళ్లీ కలుపుకుని పిండిని పలుచగా చేసుకోవాలి. సమయం గడిచే కొద్ది నీటిని కలుపుకోవాలని గుర్తించుకోండి. ఈ టేస్టీ, క్రిస్పీ మిల్లెట్ రవ్వ దోశలను కొబ్బరి చట్నీ లేదా అల్లం చట్నీతో వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పైగా ఇవి ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. 

Also Read : సమ్మర్​ స్పెషల్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్.. ఈ టిప్స్​తో సింపుల్​గా రెడీ చేసేయండి

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Surgery: పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
పవన్‌ కుడి భుజానికి చికిత్స పూర్తి- మూడున్నర గంటలపాటు సర్జరీ!
Rotator Cuff Injury: రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ ఎలా అవుతాయి? సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటీ?
Malla Reddy Skips KTR Meeting:కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
కేటీఆర్ అత్యవసర భేటీకి మల్లారెడ్డి డుమ్మా! గులాబీ గూటికి గుడ్‌బై చెప్పి కమలం వైపు అడుగులు?
Leopard In Tirumala: తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో చిరుత- భక్తుల్లో భయాందోళన
HYDRAA Inaction On Owaisi Encroachments: ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
ఓవైసీ కాలేజీలకు ప్రభుత్వం క్లీన్ చిట్ - చెరువులోనే లేదని క్లారిటీ - మజ్లిస్ కోసం రూల్స్ మార్చేశారా?
Telangana Political Mind Games: విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
విపక్షాలపై రేవంత్ మార్క్ మైండ్ గేమ్ - ప్రశాంతంగా పాలన చేసుకోనివ్వాల్సిందేనా ?
Thamizh Murugan Vs God of War: ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
ధనుష్ 'తమిళ్ మురుగన్'... ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకు కౌంటరా?
E20తో మైలేజ్‌ 5 శాతం వరకు తగ్గొచ్చని ఒప్పుకున్న కేంద్రం, కానీ ప్రయోజనాలే ఎక్కువని స్పష్టీకరణ
E20తో మైలేజ్ 5 శాతం వరకు తగ్గొచ్చు - అంగీకరించిన కేంద్రం, కానీ..!
Embed widget