అన్వేషించండి

Migraine: రబ్ది, జిలేబి కలిపి తింటే నిజంగానే మైగ్రేన్ నొప్పి తగ్గుతుందా?

మైగ్రేన్ తలనొప్పి భరించలేని నొప్పి. ఇది వచ్చిందంటే గంటలు కాదు రోజులు ఉంటుంది. దీని నుంచి బయట పడేందుకు ఈ ఆహార పదార్థాలు చక్కగా పని చేస్తాయని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది.

నోరూరించే వేడి వేడి జిలేబి తింటుంటే ఎంతైనా తినాలని అనిపిస్తుంది. మరి దానికి తోడు రబ్ది చేరిస్తే ఆ రుచి చెప్పడం కాదు తింటేనే తెలుస్తుంది. ఈ రెండు కలిపి మనసుకి చాలా సంతృప్తిగా ఉంటుంది. రబ్దిని రబ్రీ అని కూడ పిలుస్తారు. పాలతో చేసే ఒకరకమైన స్వీట్ ఇది. తెల్లటి క్రీములాగా రుచిగా ఉంటుంది. అయితే జిలేబి, రబ్ది కలిపి తీసుకుంటే దీర్ఘకాలికంగా వేధించే మైగ్రేన్ సమస్యను తగ్గించుకోవచ్చట. వినేందుకు వింతగా ఉన్న ఇది నిజమేనట. ఆయుర్వేద నిపుణులు ఈ విషయాన్ని సమర్థిస్తున్నారు. మైగ్రేన్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉదయాన్నే ఖాళీ కడుపుతో రబ్ది, జిలేబి కలిపి తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు. దీనికి సంబంధించి ఆయుర్వేద కన్సల్టెంట్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

సూర్యోదయానికి ముందు ఉన్న కాలాన్ని వాత సమయం అంటారు. నొప్పి వాత దోషంతో ముడిపడి ఉంటుంది. రబ్దితో కూడిన జిలేబి కఫవర్ధక ఆహారం అందుకే వాత సమయంలో దీన్ని తినాలని చెబుతున్నారు. ఈ ఆహారం వ్యక్తి నరాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

రబ్ది జిలేబిలు ఎన్ని తినాలి?

జిలేబి, రబ్ది రెండూ తియ్యని పదార్థాలు. చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు కాబట్టి కేలరీలు అధికంగా ఉంటాయి. అందుకే మైగ్రేన్ నొప్పిని తగ్గించుకోవడానికి వీటిని తినాలంటే కాస్త సంకోచిస్తారు. అయితే ఈ సూచన అందరికీ సరిపోదని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చక్కెర తినడం వల్ల ఎటువంటి సమస్యలు లేని వాళ్ళు వారం నుంచి గరిష్టంగా మూడు వారాల వరకు దీన్ని తీసుకోవచ్చు. అయితే డయాబెటిస్, లాక్టోస్ అసమతుల్యతో ఉన్న వాళ్ళు దీన్ని నివారించడమే ఉత్తమం. ఎందుకంటే ఇది తీపి పదార్థం.

జిలేబిని ఫ్రిజ్ లో రాత్రంతా పాలలో నానబెట్టాలి. ఉదయం 5.30/6.00 గంటల్లోపు తినాలి. ఇది మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలిగించేందుకు పని చేస్తుందని ఈ పోస్ట్ కి ఒక నెటిజన్ స్పందించారు. ఇది చేయడం వల్ల నొప్పి తగ్గిందని మరొకరు చెప్పుకొచ్చారు.

మరి దగ్గు మాటేమిటి?

రబ్ది, జిలేబి రెండూ తియ్యగా ఉంటాయి. దాని వల్ల బరువు పెరగడం, మధుమేహం, దగ్గు వంటి సమస్యలు మాటేమిటని మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అధికంగా చక్కెర తీసుకుంటే బరువు పెరుగుతారు. దగ్గు, జలుబు వంటి సమస్యలు ఎదురవుతాయి. కఫవర్ధక ఆహారాన్ని తినాలనే సిద్ధాంతం సరైనదే. అయితే 400 కేలరీలు అధికంగా ఉండే కొవ్వు, చక్కెర ఉన్న రబ్ది జిలేబికి బదులుగా నానబెట్టిన ఖర్జూరం, పుచ్చకాయ, పండిన తీపి మామిడి పండ్లు, పెరుగు తీసుకోవచ్చని మరికొందరు చెబుతున్నారు. ఇవి కూడా మైగ్రేన్ నొప్పిని అదుపులో ఉంచుతాయి. రబ్ది, జిలేబి కలిపి తీసుకుంటే బరువు పెరగడానికి దారి తీస్తుంది. ఇవే కాదు మధుమేహం, పీసీఓస్, హైపోథైరాయిడిజం వంటివి కూడా తీవ్రమవుతాయని మరొక నెటిజన్ రాసుకొచ్చారు. స్వీట్ తీసుకోవడం వల్ల తలనొప్పి మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం కూడా ఉంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మామిడి పండు గుజ్జుతో ఫేస్ ప్యాక్ - ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Night Sweats : రాత్రుళ్లు చెమట వల్ల నిద్ర రావట్లేదా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
రాత్రుళ్లు చెమట వల్ల నిద్ర రావట్లేదా? కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Piles Cases : ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
ఐటీ ఉద్యోగుల్లో పెరుగుతోన్న పైల్స్ సమస్యలు.. కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
Thyroid Weight Loss Tips : థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
థైరాయిడ్ ఉంటే బరువు తగ్గడం కష్టమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
Joining in Hostel : మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget