Kidney Stones : కిడ్నీలో రాళ్లకు ప్రధాన కారణాలు ఇవే.. వేసవికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే
Kidney Stones in Summer : కిడ్నీ స్టోన్స్ సమస్యలు వేసవిలో ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదో, వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలో చూసేద్దాం.

- వేసవిలో అధిక వేడి, డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడతాయి.
- శరీరంలో నీటి శాతం తగ్గడం, లవణాలు పేరుకుపోవడం స్టోన్స్ కారణాలు.
- తగినంత నీరు తాగడం, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవడం మేలు.
- తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Kidney Stone Cases in Summer : వేసవిలో కిడ్నీ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా కిడ్నీ స్టోన్స్ సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది. అసలు సమ్మర్లో మూత్రపిండాల సమస్యలు పెరగడానికి, స్టోన్స్ రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సమస్య రాకుండా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
డీహైడ్రేషన్
వేసవిలో అధిక వేడి వల్ల చెమట ద్వారా శరీరంలో నీరు వేగంగా తగ్గిపోతుంది. దాంతో మూత్రం గాఢంగా మారుతుంది. ఆ సమయంలో కాల్షియం, ఆగ్జలేట్ లాంటి మినరల్స్ కిడ్నీలో పేరుకుపోయి రాళ్లుగా మారతాయి.
అధిక ఉష్ణోగ్రత
తీవ్రమైన వేడి, సూర్యరశ్మి వల్ల శరీరం నీటిని వేగంగా కోల్పోతుంది. ఎండ వల్ల విటమిన్ D పెరిగి.. కాల్షియం శోషణ అధికమై స్టోన్స్ ఏర్పడే రిస్క్ పెరుగుతుంది.
ఆహారం..
ఆగ్జలేట్ అధికంగా ఉండే టమాటో, పాలకూర, బీట్రూట్ కూడా దీనికి కారణం కావచ్చు. ఉప్పు, ప్రొటీన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా స్టోన్స్ రిస్క్ పెరుగుతుంది.
కోల్డ్ డ్రింక్స్
వేసవిలో దాహం తీర్చుకోవడానికి సోడా, కోల్డ్ డ్రింక్స్ ఎక్కువ తాగుతారు. అందులో ఫాస్ఫోరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడటాన్ని పెంచుతుంది.
అధిక వ్యాయామం
వేసవి వేడిలో వ్యాయామం చేస్తే చాలా చెమట పడుతుంది. చెమట ద్వారా సోడియం కోల్పోవడంతో కిడ్నీలో లవణాలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. అవి కిడ్నీలో స్టోన్స్గా మారవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వేసవిలో రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగండి. మూత్రం లేత పసుపు రంగులో ఉంటే సరిపోతుందని అర్థం. మధ్యాహ్నం 11 నుంచి 4 గంటల మధ్య బయటకు వెళ్లకండి. వెళ్లాల్సి వస్తే వాటర్ బాటిల్ తప్పనిసరిగా తీసుకెళ్లండి. నిమ్మకాయలో సిట్రేట్ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ ఏర్పడడాన్ని అడ్డుకుంటుంది. రోజూ తేలికపాటి నిమ్మరసం తాగడం మంచిది.
ఉప్పు ఎక్కువగా తింటే మూత్రంలో కాల్షియం పెరుగుతుంది. కాబట్టి రోజుకు 5 గ్రాముల కంటే తక్కువ సోడియం మాత్రమే తీసుకోండి. ఖర్బూజ, దోసకాయ, దానిమ్మ వంటివి తింటే శరీరంలో నీటి స్థాయి పెరుగుతుంది. ఇవి కిడ్నీకి చాలా మేలు చేస్తాయి. సోడా, ప్యాక్ చేసిన జ్యూస్ బదులు నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగండి. ఇవి కిడ్నీ ఆరోగ్యానికి మంచివి. అరటిపండు, ఆపిల్ కూడా తినొచ్చు. చాక్లెట్, కాఫీలకు కూడా దూరంగా ఉండాలి.
వైద్య సహాయం..
నడుం లేదా పొత్తికడుపు దగ్గర తీవ్రమైన నొప్పి వస్తే.. మూత్రంలో రక్తం కనిపిస్తే, వాంతులు, జ్వరం వస్తే వెంటనే యూరాలజిస్ట్ని సంప్రదించండి. ఈ లక్షణాలు నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదకరంగా మారుతాయి. కాబట్టి మొదట్లోనే వైద్య సహాయం తీసుకుంటే మందులతో సమస్యను దూరం చేసుకోగలుగతారు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















