అన్వేషించండి

Cancer Risk with Eggs : గుడ్లు తింటే క్యాన్సర్​ వస్తుందా? FSSAI చేసిన సంచలన ప్రకటన ఇదే

Eggs and Cancer Risk : గుడ్లు ప్రోటీన్ విటమిన్లు ఖనిజాల నిధి. కండరాలను బలపరుస్తాయి. అయితే ఇవి క్యాన్సర్​కు కారణమవుతాయా? FSSAI చేసే సంచలన ప్రకటన ఏంటి?

Eggs Increase Cancer Risk : ఈ మధ్యకాలంలో ఫుడ్స్ గురించి సోషల్ మీడియాలో కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. వ్యూస్ కోసం ఏవో అంశాలు చెప్పి.. ఆ కంటెంట్ వైరల్ అయ్యేలా చూసుకుంటున్నారు. అలా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో గుడ్ల గురించి కూడా కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. కొన్ని బ్రాండ్లు గుడ్లలో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్న నైట్రోఫ్యూరాన్ అనే నిషేధిత యాంటీబయాటిక్ ఆనవాళ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో FSSAI కూడా ఒక పెద్ద విషయాన్ని వెల్లడించింది. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. 

FSSAI వెల్లడించిన విషమిదే..

దేశంలో అమ్ముడయ్యే గుడ్లు పూర్తిగా సురక్షితమని FSSAI క్లారిటీగా తెలిపింది. గుడ్లు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని వెల్లడించింది. సోషల్ మీడియాలోని వాదనలు పూర్తిగా తప్పుదారి పట్టించేవని, వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెప్పింది. FSSAI ప్రకారం.. పౌల్ట్రీ, గుడ్ల ఉత్పత్తిలో నైట్రోఫ్యూరాన్ వాడకం పూర్తిగా నిషేధించారు. ఒకవేళ ఆనవాళ్లు కనిపించినా అది అరుదైన సందర్భం. అన్ని గుడ్లకు ఇది వర్తించదు. శాస్త్రీయ ఆధారాల ప్రకారం.. ఇంత తక్కువ మోతాదు వల్ల క్యాన్సర్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు రావు. 

గుడ్లు ఎందుకు పోషకమైనవి? తినొచ్చా?

గుడ్లలో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్‌కు ఉంటాయి. వీటిలో విటమిన్ A, B12, D, E, ఐరన్, జింక్, కోలిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కండరాలను బలపరుస్తాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఎముకలను బలపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజుకు 1-2 గుడ్లు తినడం చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. 

డాక్టర్లు ఏమంటున్నారంటే..

ఢిల్లీలోని అపోలో హాస్పిటల్‌లో సీనియర్ డైటీషియన్ డాక్టర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ.. గుడ్డు సంపూర్ణ ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం అని తెలిపారు. ఇది కండరాల నిర్మాణానికి, మెదడు ఆరోగ్యానికి, కళ్ళకు మంచిదని చెప్పారు. FSSAI నివేదిక ప్రకారం.. పుకార్లు తప్పు అని స్పష్టమైంది. రోజూ గుడ్లు తినడం వల్ల ఎలాంటి క్యాన్సర్ రాదు. గుడ్లలో కోలిన్ ఉంటుందని.. ఇది మెదడు, కాలేయానికి అవసరమని ఆయన అన్నారు. ఇది మహిళలకు, పిల్లలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యాన్సర్ పుకార్లతో భయపడాల్సిన అవసరం లేదని అన్నారు.

గుడ్లను ఎలా తినాలంటే..

  • గుడ్డు పచ్చిగా కాకుండా ఉడకబెట్టి లేదా పగలకొట్టి ఉడికించుకోవడం ఉత్తమం.
  • వేయించినవి తక్కువగా తినండి.
  • కూరగాయలతో కలిపి తింటే మరీ మంచిది.
  • మంచి బ్రాండ్ లేదా ఫార్మ్ ఫ్రెష్ గుడ్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sleep Issues : యువతలో నిద్ర సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?
యువతలో నిద్ర సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?
Daily Habits Affecting Productivity : మీ పనితీరును దెబ్బతీసే 7 అలవాట్లు ఇవే.. ప్రొడెక్టివిటీని పెంచుకోవాలంటే వాటిని కట్ చేయండి
మీ పనితీరును దెబ్బతీసే 7 అలవాట్లు ఇవే.. ప్రొడెక్టివిటీని పెంచుకోవాలంటే వాటిని కట్ చేయండి
Gym Headphones : జిమ్‌లో హెడ్‌ఫోన్‌లు వాడుతున్నారా? అయితే మీ చెవులకు ముప్పు తప్పదంటోన్న నిపుణులు
వర్కవుట్ చేస్తున్నప్పుడు ఇయర్‌ఫోన్‌ వాడుతున్నారా? నిపుణులు ఇస్తోన్న ప్రమాద హెచ్చరికలు ఇవే.. 
Washing Machine Tips : వాషింగ్ మెషిన్‌లో బట్టలు శుభ్రం కావట్లేదా? మరకలు పోవాలంటే ఈ స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి
వాషింగ్ మెషిన్‌లో బట్టలు శుభ్రం కావట్లేదా? మరకలు పోవాలంటే ఈ స్మార్ట్ టిప్స్ ఫాలో అవ్వండి
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
Kavitha Hunger Strike: ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
ఖమ్మంలో సెగలు రేపుతున్న కవిత దీక్ష! భూబాధితుల కోసం అంబేద్కర్ భవన్‌లో నిరవధిక పోరాటం! 
LPG Cylinder New Rule: ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
ఎల్‌పిజి ఉత్పత్తి పెంచాలని రిఫైనరీస్‌కు కేంద్రం ఆదేశం!రెస్టారెంట్లు, హోటళ్లకు సరఫరా చేయడానికి కమిటీ ఏర్పాటు!
India LPG Cylinder News: మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
మధ్యప్రాచ్య యుద్ధంతో LPG సిలిండర్లపై కీలక నిర్ణయం! బుకింగ్ సమయాన్ని పొడిగింపు!
Pakistan Oil Crisis: పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
పాకిస్తాన్‌లో చమురు సంక్షోభం! పాఠశాలలు బంద్‌! వారానికి 4 రోజులే ప్రభుత్వ ఆఫీస్‌లు! మంత్రుల జీతాల్లో కోత! ఇఫ్తార్ విందులపై నిషేధం! 
Velugumatla Issue: వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Embed widget