అన్వేషించండి

Eye Health: ఇలా చేశారంటే మీ కంటి చూపుకి ఏ ఇబ్బంది ఉండదు, కళ్ళజోడు అవసరమే రాదు

కళ్ళు చాలా సున్నితమైనవి. అందుకే వాటి మీద అదనపు శ్రద్ధ పెట్టడం చాలా అవసరం.

శరీరంలోని ముఖ్యమైన భాగాల్లో కళ్ళు ఒకటి. కానీ వాటి మీద శ్రద్ద మాత్రం చాలా తక్కువగా పెడతారు. గంటల గంటలు ఫోన్లు, టీవీ, కంప్యూటర్స్ చూడటం వల్ల కళ్ళు చాలా అలిసిపోయి బలహీనంగా మారిపోతున్నాయి. బలహీనమైన కంటి చూపు రోజువారీ జీవితానికి మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సమతుల్య ఆహారం తీసుకోకపోవడం వల్ల దృష్టి లోపం సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే కళ్ళు ఆరోగ్యంగా, దృష్టిని బలంగా ఉంచుకోవడానికి తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారాల జాబితా ఇక్కడ ఉంది. ఈ పదార్థాలు తింటూ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కంటికి ఎటువంటి నష్టం వాటిల్లదు.

సమతుల్య ఆహారం తీసుకోవాలి

గుడ్లు, క్యారెట్లు, ఆకుకూరలు, బెర్రీలు, గింజలు, తాజా పండ్లు వంటి సూపర్ ఫుడ్ తో పాటు కాలనుగుణమైన సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహాలన్నింటిలో పోషకాలు ఉన్నాయి. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు మీ దృష్టి సన్నగిల్లకుండా చేయడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాలు మాక్యులర్ డిజేనరేషన్,కంటి శుక్లం వంటి వయస్సు సంబంధిత దృష్టి సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. వీటిలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. పొడి కళ్ళ సమస్యని వదిలించుకోవడానికి, కళ్ళ కింద నల్లటి వాలయాలు పోగొట్టుకునేందుకు కూడా ఇవి సహాయపడతాయి.  

కంటి వ్యాయామాలు చేయాలి

 ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కళ్ళు శరీరంలోని అత్యంత వేగవంతమైన, చురుకైన కండరాలు. అందుకే ఇతర అవయవాల మాదిరిగానే వాటిని ఫిట్ గా ఉంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. 10-15 నిమిషాల పాటు ఆప్టికల్ ఇల్యూషన్స్ చూడం మెమరీ గేమ్ లు ఆడటం వంటివి చేయొచ్చు. కనుగుడ్డు ఎడమ నుంచి కుడికి, పైకి కిందకి కొన్ని సార్లు తిప్పుతూ ఉండాలి. కనుబొమ్మలు ఎగరేయడం కూడా వ్యాయామం కిందకే వస్తుంది.

స్క్రీన్ టైమ్ నుంచి బ్రేక్ అవసరం

టీవీ చూడటం, కంప్యూటర్ లేదా ఫోన్ చూడటం వల్ల కళ్ళు ఎక్కువగా అలసిపోతాయి. అతిగా స్క్రీన్ చూడటం వల్ల చూపు మందగించడం, కళ్ళు పొడిబారటం. తలనొప్పి, మైగ్రేన్ వస్తాయి. అందుకే 20 నిమిషాలకు ఒకసారి కళ్ళు మూసుకోవడం చేయాలి. 20 సెకన్ల పాటు కళ్ళు మూసుకుని వాటికి విశ్రాంతి ఇవ్వాలి. కళ్ళు తేమగా ఉండాలంటే రెప్పలు వేస్తూ ఉండాలి.

నెయ్యి రాసుకోవడం

ఆయుర్వేదం ప్రకారం కళ్ళకు నెయ్యి లేదా వెన్న రాసుకోవచ్చు. అనేక ఆరోగ్య సమస్యలకి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. దేశీ నెయ్యిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపును బలోపేతం చేయడంలో సహాయపడతాయి. కంటి చూపు మెరుగుపరుచుకోవడం కోసం కళ్ళ చుట్టూ నెయ్యి రాసే ప్రతిరోజు కాసేపు మసాజ్ చేసుకోవాలి.

పొగ తాగకూడదు

కంటి సమస్యలతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు ధూమపానం ప్రధాన కారణం. ధూమపానం, పొగాకు కంటి శుక్లం అభివృద్ధి చెసే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయని వైద్యులు చెబుతున్నారు. అంధత్వం రావడానికి ఇది కూడా ఒక కారణం. ఆప్టిక్ నరాలు దెబ్బతింటాయి. గ్లకోమా, మధుమేహం సంబంధిత రెటినోపతికి దారితీయవచ్చు.

ఆరుబయట కళ్ళని రక్షించుకోవాలి

అతినీలలోహిత కిరణాలు రేటినాకు హాని కలిగించకుండా ఉండటం కోసం ఎప్పుడు సన్ గ్లాసెస్ ధరించాలి. UV-A, UV-B రేడియేషన్‌లను 99 నుండి 100 శాతం నిరోధించే సన్ గ్లాసెస్‌ను కొనుగోలు చేయాలి. ఎందుకంటే ఇవి కంటి చికాకు, కంటిశుక్లం వచ్చేలా చేస్తాయి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: పాలిచ్చే తల్లులు తినాల్సిన పోషకాల లడ్డూ- ఇది ఎలా తయారుచేయాలంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024: మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Dil Raju Trolls Tamil Trollers | Family Star తమిళ్ ప్రమోషన్స్ లో దిల్ రాజు ఫన్ | ABP DesamCM Revanth Reddy on Phone Tapping | ఫోన్ ట్యాపింగు కేసులో KTR పై CM Revanth Reddy సంచలన వ్యాఖ్యలుKadiyam Srihari Joins Congress | కాంగ్రెస్ నేతలతో కడియం భేటీ..మరి పాతమాటల సంగతేంటీ.? | ABP DesamPrabhakar Chowdary Followers Angry | ప్రభాకర్ చౌదరికి టీడీపీ దక్కకపోవటంపై టీడీపీ నేతల ఫైర్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024: మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
మెరిసిన విరాట్‌ కోహ్లీ, కోల్‌కత్తా లక్ష్యం ఎంతంటే ?
Telangana News: తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
తెలంగాణ ప్రజలకు అలర్ట్ - భానుడి ఉగ్రరూపం, ఈ జిల్లాలో వడగాల్పులు
Paruchuri Gopala Krishna: ‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
‘హనుమాన్’లో రొమాన్స్ పెంచి ఉంటే బాగుండు, శివుడిని ఎందుకు చూపించారో అర్థం కాలేదు: పరుచూరి రివ్యూ
Chandrababu: 'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
'రూ.10 ఇచ్చి రూ.100 లాగేస్తున్నారు' - 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి సీఎంను చూడలేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు
Andhra Pradesh: దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
దటీజ్ సీఎం జగన్, రెండేళ్ల ముందే రాజ్యసభ అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ అధినేత
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
శ్రీవారి భక్తులకు అలర్ట్ - తిరుమల నడకదారిలో చిరుత కలకలం
Manchu Manoj Comments: ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
ఎట్టకేలకు మెగా ఫ్యామిలీతో గోడవలపై నోరు విప్పిన మంచు మనోజ్‌ - ఏమన్నాడంటే..!‌ 
Embed widget