అన్వేషించండి

COVID-19: కరోనాతో 44 సెకన్లకి ఒకరు బలి - కలవరపెడుతున్న కోవిడ్ కొత్త నివేదిక

కొత్తగా వచ్చిన కరోనా లెక్కలు ఇప్పుడు అందరినీ భయపెడుతున్నాయి. ఎందుకంటే ప్రతి 44 సెకన్లకు ఒకరు కరోనాతో చనిపోతున్నారట.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఇప్పటికే కోవిడ్ ఎందరో ప్రాణాలను బలి తీసుకుని.. ఎన్నో జీవితాలను సర్వనాశనం చేసింది. ప్రస్తుతం కొన్ని దేశాలలో కోవిడ్- 19 కేసులు తగ్గుముఖం పట్టినట్టుగా కనిపిస్తున్నాయి. కానీ, దీన్ని తేలికగా తీసుకోవద్దని, చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. వ్యాక్సిన్ కూడా వచ్చింది కదా, కరోనా వచ్చినా ఏమి కాదులే అని చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. అయితే WHO తాజాగా విడుదల చేసిన నివేదికను చూస్తే తప్పకుండా మీరు షాకవుతారు. కరోనా కారణంగా ప్రతి 44 సెకన్లకి ఒకరు ప్రాణాలు కోల్పోతున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది.

44 సెకన్లకి ఒకరు బలి 

గత వారం కేవలం 4.2 మిలియన్ల కంటే తక్కువ కొత్త కేసులు నమోదు కాగా, మరణాలు 13,700 గా ఉన్నాయి. అంటే 5 శాతం తగ్గినట్టు UN ఆరోగ్య సంస్థ నివేదించింది. ఇది మంచి విషయమే. కానీ, అదే కొనసాగుతుంది అనేందుకు ఎటువంటి ఆధారాలు లేవని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గబ్రయేసస్ విలేకరుల సమావేశంలో చెప్పారు. ఫిబ్రవరి నుంచి వచ్చిన నివేదిక ప్రకారం మరణాల సంఖ్య 80 శాతానికి పడిపోయినప్పటికీ ప్రతి 44 సెకన్లకి ఒక వ్యక్తి కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన విషయమని ఆయన పేర్కొన్నారు.

WHO ఇచ్చిన నివేదిక ప్రకారం ఆగ్నేయాసియా, యూరప్, మధ్యప్రాచ్యంలో కోవిడ్-19 మరణాలు తగ్గాయి. అలాగే  ఆఫ్రికా, అమెరికా, పశ్చిమ పసిఫిక్‌లలో వాటి సంఖ్య పెరగడం ఆందోళన కలిగించే విషయమని చెప్పుకొచ్చారు. కోవిడ్-19 పట్ల జాగ్రత్తగా ఉండాలని కాలానుగుణంగా మార్పులు వచ్చినప్పటికీ మహమ్మారి ఇంకా సమసిపోలేదని WHO టెక్నికల్ లీడ్ వాన్ కేర్టోవ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రోగనిర్ధారణ చికిత్సలు తీసుకోవాలని ఆమె సూచించారు. అలాగే వ్యాక్సిన్స్ కూడా వేయించుకుని ముందస్తు రక్షణగా ఉండాలని తెలిపారు.

ఆందోళన కలిగిస్తున్న మంకీ పాక్స్

మరో వైపు మంకీ పాక్స్ కూడా ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉందని WHO చీఫ్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మంకీ పాక్స్ కేసులు పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. దీనిపై ముందుగానే జాగ్రత్త పడి నివారణ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఐరోపాలో మంకీ పాక్స్ కేసులు తక్కువగా నమోదు అవుతున్నప్పటికి అది ఆందోళన కలిగించే అంశంగానే పరిగణించాలని సూచించారు. అమెరికాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ జాగ్రత్త పాటించాలని అన్నారు. ఒక్కసారిగా కేసులు తగ్గుముఖం పట్టడం అనేది అత్యంత ప్రమాదకరమైన సమయం కావచ్చు. దాని వల్ల ప్రజలు వాటికి భయపడకుండా స్వేచ్చగా ఉంటారు. అప్పుడు కేసులు పెరిగితే ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పారు. అందుకే ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ టీకాలు తీసుకుంటూ నిర్లక్ష్యం వహించకుండా జాగ్రత్తలు పాటించాలని ఆయన హెచ్చరించారు.

కరోనా వైరస్ బారిన పడి తేరుకున్న వారిలో దాదాపు 10 నుంచి 20 శాతం మంది దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నట్టు ఒక పరిశోధన తేల్చింది. ఒక నివేదిక ప్రకారం ప్రస్తుతం 144 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలిక కోవిడ్‌తో బాధపడుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్ ఇటీవలి అధ్యయనం ప్రకారం, చిత్త వైకల్యం, మెదడు పనితీరులో సమస్యలు, మూర్ఛ వంటివి కూడా లాంగ్ కోవిడ్ రోగుల్లో కనిపిస్తున్నాయి. కోవిడ్ సోకిన రెండేళ్ల తరువాత ఈ లక్షణాలు బయటపడుతున్నాయి. కాబట్టి, జాగ్రత్తగా ఉండండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు. 

Also Read: బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఆరోగ్య రహస్యం ఇదే, మీరూ ప్రయత్నించండి

Also read: పెళ్లి అయినట్టు కల వస్తోందా? దానర్థం ఇదే

 

టాప్ హెడ్ లైన్స్

Overthinking : అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
అతిగా ఆలోచించి సతమతమవుతున్నారా? ఓవర్‌థింకింగ్‌ను తగ్గించే 3 సులభమైన మార్గాలు ఇవే
Post-Flood Home Cleaning : వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
వరద నీరు తగ్గిన తర్వాత ఇంటిని ఎలా శుభ్రం చేయాలి? తప్పనిసరిగా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే
Monsoon Driving Guide : వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Embed widget