అన్వేషించండి

Fever: జ్వరం వచ్చినప్పుడు గుడ్లు, చేపలు, మాంసం తినవచ్చా?

జ్వరం వచ్చిన తరువాత నాన్ వెజ్ తినవచ్చా లేదా అనే సందేహం ఎక్కువ మందికి ఉంది.

వాతావరణం చల్లబడితే చాలు జ్వరాలు వ్యాప్తి చెందడం మొదలవుతాయి. వానాకాలంలో డెంగూ, మలేరియా, టైఫాయిడ్ రెచ్చిపోతాయి. ఈ సీజన్లో ఇంటికొకరు జ్వరంలో మంచానపడుతున్నారు. అయితే జ్వరంతో వచ్చిన వారు ఏం తినాలి? అన్న విషయంపై మాత్రం ఇప్పటికీ చాలా మందిలో అవగాహన లేదు. కోడిగుడ్లు, చికెన్, చేపలు వంటివి తినవచ్చా లేదో తెలియదు. ఎంతో మంది వీటిని తినకూడదని చెబుతారు, మరికొంతమంది తింటే శక్తి అందుతుందని చెబుతారు. వీటిల్లో ఏది నిజం? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

తినవచ్చా లేదా?
ఆరోగ్యనిపుణులు చెప్పిన ప్రకారం జ్వరం వచ్చినప్పుడు తేలికపాటి ఆహారం తీసుకోమని సూచిస్తుంటారు. దానికర్ధం నాన్ వెజ్ తినడం మానివేయమని అర్థం కాదు. తేలికపాటి ఆహారం అయితే ఆ సమయంలో సులువుగా అరుగుతుందని. అదే కోడి గుడ్లు, చికెన్, చేపల్లాంటివి అరగడానికి సమయం పడుతుందని వారి అభిప్రాయం. కానీ వీటిని తినడం వల్ల జ్వరం పెరుగుతుందని, ఇతరత్రా జబ్బులు వస్తాయని మాత్రం ఎక్కడా చెప్పలేదు. అజీర్తి సమస్యలు ఉన్నవారు తినకపోవడమే మంచిది. ఎలాంటి సమస్యలు లేనివారు, జ్వరం వచ్చినప్పుడు తినాలనిపిస్తే నిరభ్యంతరంగా కోడిగుడ్లు, చికెన్, చేపలు తినవచ్చు. వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరానికి ఆ సమయంలో ప్రొటీన్ అవసరం అది కూడా అందుతుంది. అందుకే ఆరోగ్యనిపుణులు ఈ  ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తినమనే సిఫారసు చేస్తున్నారు. 

ఎప్పుడు తినవద్దు?
జ్వరంతో బాధపడుతున్న వారి జీవక్రియ బలహీనంగా ఉన్నా, వికారం, వాంతులతో బాధపడుతున్నా... కోడిగుడ్లు, చేపలు, చికెన్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది. లేకుంటే అరగక వాంతులు, విరేచనాలు కావచ్చు. అవేవీ లేకపోతే హ్యాపీగా తినవచ్చు. కానీ మసాలా, కారం తగ్గించుకోవాలి. వికారం, అజీర్తి సమస్యలు కనిపిస్తే మాత్రం జ్వరం వచ్చినప్పుడు సూప్‌లు, గంజి, పప్పు రసాలు, చిక్కుళ్ల కూరలు తినడం మంచిది. ఇవన్నీ తేలికగా అరగి నీరసాన్ని తగ్గిస్తాయి. 

చేపలు, గుడ్లు, చికెన్ వంటివి ఆరోగ్యకరమైన ప్రోటీన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు B6, B12, జింక్ , సెలీనియం వంటివి పుష్కలంగా దొరుకుతాయి. ఇవి ఎముకలు,మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి. జ్వరం వచ్చినప్పుడు చికెన్ సూప్ వంటివి చేసుకుంటే చాలా మంచిది. శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తి, ప్రొటీన్లు అందుతాయి. జ్వరం వచ్చినప్పుడు తినడం వల్ల త్వరగా కోలుకుంటారు కూడా. కానీ జ్వరం వచ్చినసమయంలో మీకు అరిగించుకునే శక్తి ఉందంటేనే తినండి.  

Also read: ఈ డైట్ ప్లాన్ పాటిస్తే వారం రోజుల్లో డయాబెటిస్ అదుపులోకి రావడం ఖాయం

Also read: మనం రోజూ తినే ఆహారాలలో అలెర్జీకి కారణమయ్యేవి ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
ఉదయం సూర్యుడు ఎర్రగా ఎందుకు? శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు!
Cancer Risk: అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
అర గంట కంటే ఎక్కువ సేపు కంటిన్యూగా కూర్చుంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్‌! ఆందోళన కలిగిస్తున్న కొత్త పరిశోధన !
Monsoon 2026: వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
వర్షం పడుతుంటే టీ తాగుతూ పకోడీలు తినాలనే కోరిక ఎందుకు పెరుగుతుంది?
Gen Z vs Millennials: మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 
మిలీనియల్స్ కంటే జెన్ జీ ఎక్కువ ఫిట్‌, ఆరోగ్యంగా ఉందా? ఆశ్చర్యపరుస్తున్న కొత్త నివేదిక! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
IND vs ENG T20I: బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
బట్లర్ విధ్వంసకర సెంచరీ, బ్రూక్ మెరుపులు.. భారత్‌పై T20ల్లో అత్యధిక స్కోరు నమోదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Visakhapatnam Techie Death Case: విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
విశాఖ టెకీ రాధా గాయత్రి హత్య కేసులో కీలక పరిణామం.. భర్త శ్రీచరణ్‌ అరెస్ట్
Indian Tourists Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు వారు మృతి.. హెల్ప్ లైన్ నెంబర్లు ఏర్పాటు చేసిన భారత ఎంబసీ
Embed widget