అన్వేషించండి

మనం రోజూ తినే ఆహారాలలో అలెర్జీకి కారణమయ్యేవి ఇవే

ఏ ఆహారాలు ఎవరికి పడవో, అలెర్జీని కలిగిస్తాయో చెప్పడం. వాటిని తిన్నాక వచ్చే రియాక్షన్ బట్టే తెలుసుకోవాలి.

కొందరికి కొన్ని ఆహారాలు పడవు, కానీ ఆ విషయం వారికి తెలియదు. తినేస్తూ ఉంటారు. దీని వల్ల కొంతమంది తీవ్రమైన అలెర్జీల బారిన పడతారు. తరచూ మనం తినే ఆహారాలలో ఎక్కువ శాతం అలెర్జీకి కారణమయ్యే ఆహారాలు ఇక్కడ ఇచ్చాం. ఇవి తిన్నాక మీకు ఏదైనా తేడాగా అనిపించినా, రియాక్షన్ వచ్చినా వెంటనే తినడం మానేయాలి. ఎందుకంటే కొన్ని సార్లు ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. 
 
ఆవు పాలు
ఆవు పాలు తాగాక మీకు అసౌకర్యంగా, పొట్టనొప్పిగా అనిపిస్తోందా? అయితే మీకు లాక్టోస్ ఇన్టోలరెన్స్ అనే సమస్య ఉన్నట్టే. ఈ అలెర్జీ ఉన్నవారికి పాలల్లోని లాక్టోజ్‌ను అరిగించుకోలేరు. దీంతో డయేరియా బారిన పడతారు. లేదా వాంతి చేసుకుంటారు. మూడు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వయసు పెరిగేకొద్దీ సమస్య తగ్గుముఖం పడుతుంది. కేవలం పాలే కాదు, పాలు ఆధారిత పదార్ధాలైన పెరుగు, చీజ్, వెన్న లాంటివి కూడా వీరికి పడవు. వారికి దద్దుర్లు, వాపు, వాంతులు, విరేచనాలు వంటివి కలుగుతాయి. పాలు తాగిన అయిదారు నిమిషాల తరువాతే ప్రతిచర్య మొదలవుతుంది. ఇది ప్రేగుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. 

గుడ్లు
గుడ్లు పడని వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి ఆ విషయం తెలియదు. ఒక అధ్యయనం ప్రకారం 68శాతం మంది పిల్లల్లో గుడ్లు అలెర్జీని కలిగిస్తున్నాయి. పదహారేళ్లు దాటాక అలెర్జీ కలగడం తగ్గిపోతుంది. గుడ్డు తిన్నవెంటనే పొట్ట నొప్పి, అతిసారం, దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలు వస్తే ఓసారి ఆలోచించుకోవాలి. 

వేరుశెనగలు
వేరుశెనగలు పడకపోతే మాత్రం వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. వేరుశెనగలు పడకపోతే చర్మం దద్దుర్లు, ఆ దద్దుర్లు ఎర్రగా మారడం, దురద, నోరు, గొంతులో జలదరింపు కలగడం వంటివి కలుగుతాయి. వికారంగా అయి వాంతి కూడా వస్తుంది. గొంతులో ఉక్కిరిబిక్కిరి అయినట్టు అవుతుంది. పీనట్ బటర్ కూడా వీరికి పడదు. 

సోయా
సోయా అలెర్జీలు పిల్లల్లో కలగడం సాధారణం. ఇది సోయా లేదా సోయా ఆధారిత ఆహారాన్ని తినడం వల్ల కలుగుతుంది. అయితే పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఈ అలెర్జీని అధిగమిస్తారు. కొందరిలో మాత్రం జీవితాంతం ఉండిపోయే అవకాశం ఉంది. ఈ అలెర్జీ వచ్చిన వారిలో దురద, నోరు, ముక్కు నుంచి నీరు కారడం, దద్దుర్లు, ఆస్తమా, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలుగుతాయి. సోయాపాలు,సోయా టోఫులు తినడం వల్ల అలెర్జీ కలుగుతుంది. 

గోధుమలు
గోధుమ అలెర్జీ అన్నది గ్లూటెన్ వల్ల కలుగుతుంది. గోధుమల్లోనే గ్లూటెన్ ఉంటుంది. ఇది పడని వారు గోధుమలకు దూరంగా ఉండాలి. చపాతీలు తిన్నాక చర్మంపై దద్దుర్లు, వాంతులు, వాపు వంటివి కలిగితే గ్లూటెన్ అలెర్జీ ఉందేమో చెక్ చేసుకోవాలి. సెలియాక్ డిసీజ్ గోధుమలు పడకపోతే వస్తుంది. 

Also read: గర్భిణిలు కాకరకాయ తింటే చాలా సమస్యలు దరిచేరవు, మీ బిడ్డకోసమైనా తినండి

Also read: ఇంట్లోనే వేడి వేడి మొక్కజొన్న గారెలు, తింటే ఎంతో బలం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget