అన్వేషించండి

షుగర్ ఉన్న వారికి ఆరోగ్యబీమా పాలసీ దొరకుతుందా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, భారతదేశంలో 20 మరియు 70 సంవత్సరాల వయస్సులో ఉన్నవారిలో 8.7% మధుమేహ జనాభాతో మధుమేహం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హెల్త్ పాలసీల వివరాలు తెలుసుకుందాం.

ప్రపంచ వ్యప్తంగా నవంబర్ 14 ను వరల్డ్ డయాబెటిక్ డే గా జరుపుకుంటారు. డయాబెటిస్ కు సంబంధించిన  అవగాహన అందించడమే ఈ రోజు ఉద్దేశ్యం. ఈ సమస్య లక్షణాలను బట్టి దాన్ని గుర్తించడం, నిర్దారించడం గురించిన చర్చ జరగాలనేది లక్ష్యం. ఈ ఏడాది ‘access to diabetes education’  అనే థీమ్. అంటే పూర్తి స్థాయి లో డయాబెటిస్ కు సంబంధించిన అవగాహన అందించడం . ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 422 మిలియన్ల మంది డయాబెటిస్ రోగులు ఉండగా సంవత్సరానికి 1.5 మిలియన్ల మంది డయాబెటిస్ దాని సంబంధ సమస్యలతో మరణిస్తున్నారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు చెబుతోంది. ఇప్పుడు డయాబెటిస్ చాలా సాధరణం అయిపోయిందని ఈ లెక్కలను బట్టి అర్థం అవుతోంది. అయితే అంత సులభంగా తీసుకోవాల్సిన విషయం కాదు, డయాబెటిస్ విషయంలో నిర్లక్ష్యం అసలు కూడదు.

మన దేశంలో డయాబెటిస్ చాలా వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల్లో ప్రతి ఏటా 8.7 శాతం డయాబెటిక్ రోగుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందట. వీరంతా కూడా 20 నుంచి 70 సంవత్సరాల లోపు వయసు వారు కావడం గమనార్హం. ప్రభుత్వం, వైద్యరంగం కలిసి కట్టుగా ఈ సమస్యకు సంబంధించిన అవగాహన కల్పించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

డయాబెటిక్ పర్సన్ కు హెల్త్ ఇన్ష్యూరెన్స్ దొరుకుతుందా?

కచ్చితంగా దొరకుతుంది. కానీ వీళ్లు ప్రతి ఏటా ప్రీమియం కాస్త ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. మధుమేహం వంటి లైఫ్ స్టైల్ వ్యాధులను కూడా భీమాపాలసీలు కవర్ చేస్తాయి. ఒక్కోసారి పాలసీ ప్రారంభించిన తర్వాత నిర్ధారణ కావచ్చు. అయితే పాలసీ కొనడానికి ముందే మధుమేహం ఉన్నవారికి పాలసీ తీసుకోవాలనుకున్నపుడు మాత్రం కాస్త వెయిటింగ్ పీరియడ్, వెయిటింగ్ పీరియడ్ వర్తించే విధంగా ఉంటుందని ఎడ్విసిప్ జనరల్ ఇన్ష్యూరెన్స్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పూజా యాదవ్ అంటున్నారు.

హెల్త్ ఇన్ష్యూరెన్స్ డయాబెటిక్స్ కి అవసరమా?

నిజానికి డయాబెటిస్ ను మేనేజ్ చెయ్యడం కర్చుతో కూడుకున్న వ్యవహారంగా తయారవుతోంది. ఇది కుటుంబం ఆర్థిక స్థితి మీద ప్రభావం చూపుతోంది. కాబట్టి ఆరోగ్య భీమా పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అది తీసుకునే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. హాస్పిటల్లో చేరినపుడు మాత్రమే కాదు, అంతకు ముందు, హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉండే డే కేర్, హాస్పిటల్ కేర్ ట్రీట్మెంట్లతో పాటు డయాలసిస్ కర్చుల వంటి వాటన్నింటిని కవర్ చేసే పాలసీని ఎంచుకోవాలని డైరెక్టర్, హెడ్ రిటైల్, కేర్ హెల్త్ ఇన్ష్యూరెన్స్ కు చెందిన అజయ్ షా సలహా ఇస్తున్నారు.

ప్రీమియంలో ఎంత తేడా?

సాధారణంగా ప్రీమియం కవరేజిలో వచ్చే సదుపాయాలు, బీమా మొత్తం విలువ, బీమా చేసిన వ్యక్తి వయసు, అతని ఆరోగ్య చరిత్ర వంటి అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మామూలుగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులతో పోల్చినపుడు మధుమేహుల కు ప్రమాదం ఎక్కువ అని బీమా కంపెనీలు అంచనా వేస్తాయి. వీరు హాస్పటలైజ్ అయ్యే అవసరం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయడతారు. అందువల్ల మధుమేహులు 15-30 శాతం వరకు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులతో కలిసి ఉండే ఆరోగ్యవంతుడికి భీమా పాలసి 10 వేల నుంచి 12 వేల మధ్య దొరకుతుంది. 10 లక్షల వరకు బీమా కవరేజి ఉంటుంది. ఒకవేళ పాలసీ దారు డయాబెటిక్ అయితే మాత్రం పరిస్థితిని బట్టి ప్రీమియం 10-20 శాతం వరకు పెరగవచ్చు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget