అన్వేషించండి

ఉద్యోగులకు షాక్, వారి ఫోన్ బ్యాటరీ స్క్రీన్‌షాట్స్ అడుగుతున్న బాస్, ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

అక్కడి ఉద్యోగస్తులు.. ఆఫీసు విడిచే ముందు తప్పకుండా తమ బాస్‌కు ఫోన్ బ్యాటరీ గ్రాఫ్ స్క్రీన్ షాట్‌ను పంపించాలి. ఎందుకంటే..

ఆఫీసులో పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లే ముందు తప్పకుండా ఉద్యోగులు తప్పకుండా తమ మొబైల్ ఫోన్ బ్యాటరీ స్క్రీన్ షాట్‌ను బాస్‌కు చూపించాల్సిందే. లేకపోతే, వాళ్లు తర్వాతి రోజు నుంచి ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అయితే, ఉద్యోగుల మొబైల్ బ్యాటరీ స్క్రీన్ షాట్స్‌తో బాసుకు పనేంటి అనేగా మీ సందేహం? అయితే, పదండి.. చైనాలోని ఆ సంస్థలో ఎందుకు ఆ రూల్ పెట్టారో తెలుసుకుందాం. 

కోవిడ్-19కు పుట్టినిల్లయిన ఉహాన్ గురించి మీకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆ నగరంలోని ఓ చిన్న సంస్థలో బాస్ పెట్టిన రూల్స్ ఇప్పుడు ఆన్‌లైన్‌లో చర్చనీయంగా మారాయి. ఉద్యోగులు ఆఫీసులో అడుగు పెట్టిన వెంటనే తమ మొబైల్ ఫోన్ బ్యాటరీ స్క్రీన్ షాట్‌ను బాస్‌కు పంపాలి. మళ్లీ ఇంటికి తిరిగి వెళ్లే ముందు కూడా అదే పని చేయాలి. బాస్ పెట్టిన ఈ రూల్‌ను పాటించడం అక్కడి ఉద్యోగులకు అస్సలు నచ్చడం లేదు. గట్టిగా అరిచి తమ నిరసన వ్యక్తం చేయాలనే కోపం వస్తున్నా.. ఉద్యోగం పోతుందనే భయంతో మౌనంగా స్క్రీన్ షాట్ తీసి పంపేస్తున్నారు.

ఆ సంస్థలో పనిచేసే ఓ ఉద్యోగి తనకు తెలిసిన జర్నలిస్టుకు ఈ విషయాన్ని చెప్పాడు. అంతే, తర్వాతి రోజు ఈ వార్త కరోనా కంటే వేగంగా వ్యాపించింది. ఆన్‌లైన్‌లో పెద్ద చర్చే జరిగింది. అంతా ఆ బాసును తిట్టిపోస్తున్నారు. ఉద్యోగుల ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారంటూ మండిపడుతున్నారు. అయితే, తాను ఆ పని చేయడానికి న్యాయమైన కారణమే ఉందని ఆ బాస్ అందరికీ వివరణ ఇస్తున్నాడు.  

ఇటీవల తమ సంస్థలో ఉత్పాదన బాగా తగ్గిపోయింది. ఉద్యోగుల పనితీరు మందగించింది. ఉద్యోగులు తమ స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేయడమే ఇందుకు కారణమని ఆ బాస్‌కు సందేహం కలిగింది. ఫోన్లలో వీడియోలు చూస్తూ, గేమ్స్ ఆడుతూ టైంపాస్ చేయడం వల్ల సంస్థ నష్టాల్లోకి జారుకున్నట్లు భావించి.. అందరికీ రూల్ పెట్టాడు. జాబ్ పూర్తయిన తర్వాత ఫోన్ సెట్టింగులలో వెళ్లి ఆ రోజు బ్యాటరీ వినియోగానికి సంబంధించిన గ్రాఫ్ స్క్రీన్‌షాట్‌లను తీసి తనకు పంపాలనే ఆదేశించాడు. ఇలా చేయడం ఇష్టం లేకపోయినా ఉద్యోగులు ఈ రూల్ పాటిస్తున్నారు. 

Also Read: లక్కున్నోడు - 34 ఏళ్లుగా భార్య వద్దన్నా వినలేదు, ఇప్పుడు రూ.2.5 కోట్లతో ఆమెకు షాకిచ్చాడు!
 
దీంతో నెటిజనులు ఆ ఉద్యోగులకు కొన్ని ఉచిత సలహాలు ఇస్తున్నారు. ‘‘మీతోపాటు మరో స్మార్ట్ ఫోన్ తీసుకెళ్లండి. వెళ్లేప్పుడు ఆ ఫోన్ బ్యాటరీ స్క్రీన్ షాట్‌ను మీ బాస్‌కు పంపించండి. అంతే సింపుల్’’ అని అంటున్నారు. అయితే, చైనా సంస్థలు ఇలాంటి వివాదాస్పద రూల్స్ పెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ సంస్థ తమ ఉద్యోగులు టాయిలెట్లలో కూర్చొని మొబైల్ ఫోన్లు చూస్తున్నారనే కారణంతో టాయిలెట్లకు టైమర్‌లను అమర్చింది. మరో సంస్థ ఉద్యోగులు ఎక్కువ సేపు కూర్చోడానికి వీలు లేకుండా.. ఏకంగా టాయిలెట్ కమోడ్ డిజైన్ సైతం మార్పించింది. మరి, మీ సంస్థల్లో కూడా ఇలాంటి వింత రూల్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే మా సోషల్ మీడియా వేదికలపై కామెంట్స్ ద్వారా తెలియజేయండి. 

Also Read: ఛీ యాక్, టాయిలెట్ రంథ్రంలో ఇరుక్కున్న తల, ఆమె అందులోకి ఎలా దూరింది?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
Multani Mitti Face Pack : సమ్మర్‌లో ముల్తానీ మట్టి వాడుతున్నారా?.. లాభాలు, తయారీ విధానం, జాగ్రత్తలు ఇవే
సమ్మర్‌లో ముల్తానీ మట్టి వాడుతున్నారా?.. లాభాలు, తయారీ విధానం, జాగ్రత్తలు ఇవే
Dating App Scams : డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి
డేటింగ్ యాప్ స్కామ్స్​తో జాగ్రత్త.. ఆన్‌లైన్ డేటింగ్ చేస్తే ఈ విషయాలు గుర్తుంచుకోండి

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Meta Layoffs: మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
మెటాలో భారీగా లేఆఫ్స్.. ఏకంగా 16 వేల మంది ఉద్యోగాల్లో కోత! AI ఎఫెక్ట్ కారణమా?
Maruti Suzuki Dzire: 30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
30 లక్షల మైల్ స్టోన్ ని దాటిన మారుతి సుజుకి డిజైర్.. దీని ఫీచర్లు, ధర, మైలేజీ వివరాలు
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Embed widget