అన్వేషించండి

Blood Diamonds: ఆ దేశంలో వజ్రాలు విరివిగా దొరకుతాయి! అయినా, నిత్యం ఆకలి చావులు, అనుక్షణం భయం భయం!!

అక్కడ అపార సంపద ఉంది. ఆ సంపద కోసం జనాలు నిత్యం వేటలో ఉంటారు. కానీ, వారి బతుకు చిత్రం అత్యంత దయనీయంగా ఉంటుంది. ఆకలి చావులతో నిత్యం మార్మోగుతుంది.

డైమండ్.. ఈ పేరు వినగానే మగువల మెడలో అందంగా హొయలుపోతూ కనిపించే సుందర దృశ్యాలు మన కళ్ల ముందు కనిపిస్తాయి. కానీ, వాటి సేకరణ వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఎంతో మంది వజ్రాలను వెతుకుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి.  ఇప్పటికీ చాలా మంది కోల్పోతూనే ఉన్నారు. భూగర్భంలో ఉండే తీవ్ర ఉష్ణోగ్రతల దగ్గర కార్బన్ అణువులు ఘనీవించి వజ్రాలుగా రూపొందుతాయి. అందుకే, వీటికి అత్యంత కాఠిన్యత ఉంటుంది. వాస్తవానికి ప్రపంచంలోని ప్రపంచ ప్రసిద్ధ వజ్రాలన్నీ భారత్ కు చెందినవే. కానీ, 1867 అనంతరం ఆఫిక్రన్ దేశాలు వజ్రాల ఉత్పత్తిలో ముందజలో నిలిచాయి.  దక్షిణాఫ్రికా, బోత్స్వానా, నమీబియా, కెనాడా సైతం డైమండ్స్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించాయి.   

ప్రపంచంలో ఇతర దేశాల గురించి కాసేపు పక్కన పెడితే, సౌత్ ఆఫ్రిగా పరిస్థితి చాలా విషాదకరంగా ఉంటుంది. అక్కడి భూమి అద్భుత నిక్షేపాలతో నిండి ఉంటుంది. బంగారం, ప్లాటినం, డైమండ్స్ విరివిగా దొరుకుతాయి. విలువైన ఖనిజ సంపద ఉన్నా ఆదేశం ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది. ఆకలితో అలమటిస్తూ నిత్యం ఎంతో మంది చనిపోతుంటారు. ఆదేశంలో వజ్రాల కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఉన్న ఊరిని కన్న వారినీ వదిలి ఎంతో మంది ఇతర ప్రాంతాలు వలస పోయారు. వేల మంది ఆడవాళ్లు అత్యాచారాలకు గురయ్యారు. లక్షల మంది మగవారు ఊచకోతకు బలయ్యారు. అసలు వజ్రాలకు ఈ దారుణాలకు కారణం ఏంటి? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కాస్త కాలాన్ని వెనక్కి తిప్పాలి. వజ్రాల వెనుక దాగి ఉన్న రక్తపుటేరులు జాలువారుతూ కనిపిస్తాయి.   

దక్షిణాఫ్రికాలోని సంపదపై అగ్రదేశాలు కన్నువేశాయి. వలస పాలనకు పునాదులు పడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వజ్రాల పోరాటం మొదలయ్యింది. బ్రిటన్  సైన్యంలో పని చేస్తున్న సియెర్రా లియోన్‌ వాసులు తమ దేశానికి తిరిగి వచ్చాక వజ్రాల వేట మొదలయ్యింది.  సియోర్రా భూమిలో వజ్రాలు విరివిగా దొరుకుతాయి.  యుద్ధం నుంచి వచ్చిన స్థానికులు 5, 6వ దశకాలలో అక్రమ మైనింగ్‌ మొదలు పెట్టారు. దొరికిన వజ్రాలను స్థానిక మార్కెట్లలో అమ్మడం మొదలు పెట్టారు. అవి బహిరంగ ప్రాంతాలు కావడంతో మైన్స్ భద్రత కష్టం అయ్యింది. స్థానికులు వజ్రాల వేటలో పాల్గొనకుండా బ్రిటిష్‌ పాలకులు పోలీసులను నియమించారు. కానీ, ఏమాత్రం ఆపలేకపోయారు. అక్రమ మైనింగ్‌ బాగా విస్తరించింది.  సియెర్రా లియోన్‌కు కావలసిన మార్కెట్‌ను లెబనాన్‌ అందించింది.  

ఈ వజ్రాలు లైబీరియాకు తరలి వెళ్లడం మొదలు పెట్టాయి బాటపట్టాయి.  వజ్రాల  మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో ఊపందుకుంది.  అదే సమయంలో ఆధిపత్యం కోసం డి బీర్స్‌ సంస్థ ముందడులు వేసింది.   అంగోలా, సియెర్రా లియెన్‌ సహా పశ్చిమ ఆఫ్రికా దేశాల నుంచి ఆ సంస్థ వజ్రాలను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది.    డైమెండ్‌ ఈజ్‌ ఫర్‌ ఎవర్‌ అనే నినాదాన్నిజనాల్లోకి తీసుకొచ్చింది. ఆఫ్రికాలో వజ్రాల డిమాండ్‌ భారీగా పెరిగింది.  వజ్రాల మైనింగ్‌ కోసం పలు దేశాలు ఘోరాలకు పాల్పడ్డం మొదలు పెట్టాయి. వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలకు స్థానికులను రాకుండా వెళ్లగొట్టారు. చాలా మందిని ఊచకోత కోశారు.  వజ్రాలను ఏరేందుకు  మహిళలు, చిన్న ప్లిలలతో బానిసత్వం చేయించారు.  వజ్రాల గనులపై ఆధిపత్యం కోసం   తిరుగుబాట్లు, ప్రచ్ఛన్న యుద్ధాలు మొదలయ్యాయి. సియెర్రా లియోన్‌లో  రెవల్యూషనరీ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రజలను కిరాతకంగా చంపేసింది. ఊళ్లకు ఊళ్లను ఖాళీ చేయించింది. ఈ దాడుల్లో ఎంతో మంది అమాయకులు చనిపోయారు. మరెంతో మంది అక్కడి నుంచి పారిపోయారు సియెర్రా లియోన్‌ మాత్రమే కాదు.  పశ్చిమ, మధ్య ఆఫ్రికా వజ్రాల మైనింగ్‌ లో  రక్తసిక్తమైంది.. అవినీతితో కూరుకుపోయిన ఆఫ్రికా దేశాల అసమర్థ మరింత దిగజార్చింది.  అంగోలా డైమండ్‌ మైనింగ్‌లో పనిచేసే కార్మికులు ఇప్పటకీ దోపిడీకి గురువుతున్నారు. బానిసల్లా బతుకుతున్నారు.  

కాంగోలోనూ దాదాపు ఇదే పరిస్థితులున్నాయి. ప్రపంచంలోని మొత్తం వజ్రాల్లో 26 శాతం అక్కడే దొరుకుతాయి . కానీ అది ప్రపంచంలోకెల్లా అత్యంత నిరుపేద దేశాల్లో ఒకటి.  1998 నుంచి కాంగోలో వజ్రాల కోసం జరిగిన యుద్ధం వల్ల 17 లక్షల మంది చనిపోయారు. ఎంతో మంది మహిళలు, పిల్లలు లైంగిక దాడులకు గురయ్యారు. చివరకు వేల సంఖ్యలో జనాలు ఆకలికి బలయ్యారు. ఇప్పటికీ అక్కడ వజ్రాల కోసం నిత్యం రక్తపాతం జరుగుతూనే ఉంది.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్

వీడియోలు

Virat Kohli Century Ind vs NZ 3rd ODI | మూడో వన్డేలో విరాట్ సెంచరీ | ABP Desam
Ind vs NZ 3rd ODI Highlights | భారత్‌లో తొలి సిరీస్ గెలిచిన న్యూజిలాండ్ | ABP Desam
Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Effect: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దుస్థితిపై ఏబీపీ దేశం కథనం - స్పందించిన జీహెచ్‌ఎంసీ - కానీ చేయాల్సింది చాలా ఉంది !
Telangana phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - హరీష్ రావుకు సిట్ నోటీసులు
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Embed widget