అన్వేషించండి

TSPSC Group1: 'గ్రూప్-1' పరీక్షపై మళ్లీ హైకోర్టుకెక్కిన అభ్యర్థులు, దర్యాప్తు పూర్తయ్యేదాకా వద్దంటూ విజ్ఞప్తి!

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి ‘సిట్‌’తోపాటు ఈడీ దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.

➥ యూపీఎస్సీ లాంటి సంస్థకు గ్రూప్-1 పరీక్షల బాధ్యత అప్పగించాలి

➥ హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలు

తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షపై మరోసారి సందిగ్ధం నెలకొంది. మరోసారి అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లడమే ఇలాంటి పరిస్థితి నెలకొంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించి ‘సిట్‌’తోపాటు ఈడీ దర్యాప్తు పూర్తయ్యేదాకా గ్రూప్‌-1 పరీక్షలను వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. అంతేకాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ ఈ పరీక్ష నిర్వహించడంపై అభ్యంతరం ఉందని, యూపీఎస్సీ లాంటి మూడో సంస్థకు ఈ బాధ్యతను అప్పగించాలని పిటిషనర్లు కోరారు. 

గతేడాది అక్టోబరులో జరిగిన పరీక్షలను రద్దు చేయడంతోపాటు జూన్‌ 11న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ జారీచేసిన వెబ్‌నోట్‌ను రద్దు చేయాలని కోరుతూ.. అశోక్‌కుమార్‌ మరో నలుగురు, టి.రమేశ్, జె.సుధాకర్‌లు వేర్వేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం (జూన్ 1న) జస్టిస్‌ కాజా శరత్‌ విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. గతేడాది పరీక్షలు జరిగాక ప్రశ్నపత్రాలు లీక్‌ అయిన విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. దీనిపై దర్యాప్తు చేస్తున్న సిట్‌ ఇప్పటికే 49 మంది దాకా అరెస్ట్‌ చేసిందని, ఈ సంఖ్య 100కు చేరవచ్చన్నారు. సిట్‌ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా పరీక్షలు రద్దుచేసి తాజాగా నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ నిర్ణయించిందన్నారు. లీకేజీ వ్యవహారంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని.. పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రత్యేక సంస్థకు అప్పగించాలని కోరారు. ఓవైపు దర్యాప్తు జరుగుతోందని, నిందితులందరూ ఇంకా బయటపడలేదని, అయినా పరీక్ష నిర్వహించడానికి కమిషన్‌ సిద్ధపడుతోందన్నారు. కేవలం ఎన్‌ఆర్‌ఐల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా ఉందని ఆరోపించారు. పరీక్షలకు సంబంధించి 5 లక్షల మంది ఆశావహులున్నారన్నారు. పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. 

మరోవైపు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ లీకేజీ వ్యవహారంలో 49 మంది ఉద్యోగులు లేరని, కేవలం ఇద్దరు శాశ్వత, ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారన్నారు. దీనికి బాధ్యులైనవారిని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణ, రహస్య విభాగాల పర్యవేక్షణ నిమిత్తం చీఫ్‌ ఇన్‌ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, అసిస్టెంట్‌ కంట్రోలర్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో పరీక్షలకు ఏర్పాట్లు జరిగినట్లు చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను జూన్ 5వ తేదీకి వాయిదా వేశారు.

Also Read:

'గ్రూప్‌-1' ప్రిలిమ్స్‌కు ఏర్పాట్లు పూర్తి, ఒకట్రెండు రోజుల్లో హాల్‌టికెట్లు!
టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రాష్ట్రంలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్‌పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ప్రకారం జూన్ 11న ప్రిలిమ్స్ పరీక్ష పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తర్వాతే అనుమతించేలా ఏర్పాట్లు చేసింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

త్వరలో గ్రూప్‌-1, గ్రూప్‌-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్
ఏపీలో త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేయాల్సి ఉందని, దాని తర్వాతే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది తెలుస్తుందని, ఆ తర్వాత నోటిఫికేషన్‌ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. 2019 నుండి ఇప్పటి వరకు ఏపీపీఎస్సీ 57 నోటిఫికేషన్ల విడుదల చేసిందని, వీటి ద్వారా 5,447 పోస్టులను భర్తీ చేసిందని సవాంగ్ తెలిపారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..

జూన్‌ 3 నుంచి 'గ్రూప్‌-1' మెయిన్స్ పరీక్షలు! హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా?
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన పది జిల్లాల్లోని 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 3 నుంచి 10 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ ద్వారా మెయిన్స్ పరీక్షలు రాసేందుకు 6,455 మంది అర్హత సాధించారని గౌతమ్ సవాంగ్ తెలిపారు. 
గ్రూప్-1 హాల్‌టికెట్లు, పరీక్ష వివరాల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

Tech Layoffs: 2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
2026లో భారీగా లేఆఫ్స్.. ఇప్పటివరకే 1 లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Meta Layoffs 2026: ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
ఫేస్‌బుక్‌లో 8వేల మంది ఉద్యోగులకు లేఆఫ్స్ - ఈ సీనియర్ మేనేజర్ వేదన ఏఐ పాపమే !
Tourist Guide Jobs In Telangana: తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే! అప్లై చేయడానికి డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలోని ౩౩ జిల్లాల్లో గైడ్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం! అర్హతలు ఇవే!

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shreyas Iyer News: గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
గెలుపే నా టార్గెట్.. ముంబై స్ట్రీట్ క్రికెట్ నుంచి చాలా నేర్చుకున్నా... టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Ramani Kalyanam OTT : ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి రీసెంట్ రొమాంటిక్ డ్రామా - 3 వారాల్లోపే స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
B.Tech Student Missing: హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
హైదరాబాద్‌లో బీటెక్ ఫైనలియర్ స్టూడెంట్ మిస్సింగ్.. తల్లి కన్నీళ్లు, ఆచూకీ తెలిస్తే చెప్పండి
Kamal Haasan : పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
పుష్పక విమానం సీక్వెల్... 45 ఏళ్ల క్రితం స్టోరీ - కట్ చేస్తే సింగ్ గీతం... కమల్ హాసన్ చెప్పిన సీక్రెట్
Manav Suthar Dream Debut: 25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
25 ఏళ్ల రికార్డు బద్దలు.. టెస్ట్ డెబ్యూ లోనే మానవ్ సుతార్ హిస్టారికల్ రికార్డ్.. మొదటి ఓవర్లోనే ఊహించని ట్విస్ట్
UGC Net Exam schedule: యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
యూజీసీ నెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల.. పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన తేదీలివే
Embed widget