అన్వేషించండి

TGPSC Group 2 Exam: తెలంగాణలో గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేశారా? కొత్త తేదీలపై టీజీపీఎస్సీ క్లారిటీ

TGPSC Group 2 and Group 3 Exam Dates: తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ వాయిదా వేశారని ఓ సర్క్యూలర్ వైరల్ అవుతోంది. అయితే గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదాపై నిర్ణయం తీసుకోలేదని టీజీపీఎస్సీ తెలిపింది.

TGPSC Group 2 and Group 3 Exam Schedule | హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. పోస్టులు పెంచి ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థుల రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుని ఎగ్జామ్ రీషెడ్యూల్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. రీ షెడ్యూల్ అయిన తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ డేట్లు అని ఓ ప్రకటన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఆ నోటీసుపై టీజీపీఎస్సీ అధికారులు స్పందించారు.

గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్ వాయిదా వేయలేదన్న టీజీపీఎస్సీ 
తెలంగాణలో త్వరలో జరగనున్న గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల తేదీలు మార్చేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ ప్రకటనలో వాస్తవం లేదని, అదంతా ఫేక్ న్యూస్ అని టీజీపీఎస్సీ క్లారిటీ ఇచ్చింది. అభ్యర్థులు వాటిని నమ్మకూడదని, అధికారిక ప్రకటనల్ని మాత్రమే విశ్వసించాలని సూచించింది. గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టులో జరగాల్సి ఉండగా, నవంబర్ 17, 18 తేదీలలో నిర్వహించడానికి టీజీఎస్సీ రీషెడ్యూల్ చేసిందని ప్రచారం జరిగింది. అదే విధంగా గ్రూప్ 3 ఎగ్జామ్ నవంబర్ 24, 25 తేదీలకు వాయిదా వేసినట్లు టీజీసీఎస్సీ పేరుతో ఓ ప్రకటన వైరల్ అయింది. దానిపై టీజీపీఎస్సీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. గ్రూప్ 2, గ్రూప్ 3 నియామక పరీక్షలను వాయిదా వేయలేదని, అభ్యర్థులు ఇలాంటివి నమ్మవద్దని సూచించారు.


TGPSC Group 2 Exam: తెలంగాణలో గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేశారా? కొత్త తేదీలపై టీజీపీఎస్సీ క్లారిటీ

 

తెలంగాణలో మొత్తం 783 గ్రూప్-2 ఉద్యోగాల (Group2 Posts) భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) 29 డిసెంబర్ 2022న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, ఒక్కో పోస్టుకు దాదాపు 700 మంది చొప్పున పోటీ నెలకొంది. గత ఏడాది నవంబర్ నెలలో గ్రూప్ 2 ఎగ్జామ్ నిర్వహించాల్సి ఉండగా, ఎన్నికలు రావడంతో వాయిదా వేశారు. 

తాము అధికారంలోకి రాగానే జనవరిలో గ్రూప్ 2 ఎగ్జామ్స్, వెంటనే గ్రూప్ 3 సైతం నిర్వహిస్తామని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలు జరగడం, బీఆర్ఎస్ ఓడిపోవడం జరిగిపోయాయి. కాంగ్రెస్ తెలంగాణలో తొలిసారి అధికారంలోకి రాగా, జనవరిలో నిర్వహించాల్సిన గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశారు. టీజీపీఎస్సీ కొత్త చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించి పోస్టుల భర్తీపై ఫోకస్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 

గ్రూప్ 2 పరీక్ష తేదీలివే.. 
ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాల్సి ఉంది. కానీ పోస్టులు పెంచడంతో పాటు పరీక్షను వాయిదా వేసి, రీషెడ్యూల్ చేయాలన్న డిమాండ్ వస్తోంది. అభ్యర్థులు టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునివ్వడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ సహా వీలున్న చోట నిరసన తెలుపుతున్నారు. డీఎస్సీ సైతం పోస్టులు పెంచాలని, పరీక్షలు వాయిదా వేసి పకడ్బందీగా నిర్వహించాలని కోరుతున్నారు. మహిళా అభ్యర్థులు సైతం రాత్రి అని చూడకుండా ఓయూ వద్ద నిరసన తెలిపారు. సిలబస్ చాలా పెంచారని, తక్కువ సమయంలో సబ్జెక్ట్ చదవడం పూర్తి కాదని, ప్రభుత్వం తమ సమస్యల్ని పట్టించుకోవాలన్నారు. 

Also Read: TGDSC Halltickets: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్, పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేస్తున్నాయ్ - డౌన్‌లోడ్ ఎప్పటినుంచంటే?

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Embed widget