అన్వేషించండి

APPSC EXAM: ఇకపై నో ఇంటర్వ్యూస్‌... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Andhra Pradesh Public Service Commission: ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి ఇంటర్వ్యూలను (Interviews) రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్రూప్‌-1 సహా మిగతా పోస్టుల భర్తీకి నిర్వహించే మౌఖిక పరీక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్‌ దాస్‌ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు ఇకపై ఇంటర్వ్యూలు ఉండబోవని స్పష్టం చేశారు. పోటీ పరీక్షల్లో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. గ్రూప్‌-1 సహా మిగతా పరీక్షలకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించకుండా రాతపరీక్ష ద్వారా మాత్రమే అర్హులను ఎంపిక చేయాలని కమిషన్ నిర్ణయించిందని వెల్లడించారు. 
భర్తీ ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం..
ఏపీపీఎస్సీ పరీక్షల్లో ఇంటర్వ్యూల రద్దు వల్ల నియమకాల ప్రక్రియ త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. రాత పరీక్షల్లో మెరుగైన మార్కులు సాధించినా కూడా పలువురు అభ్యర్థులు ఇంటర్వ్యూలలో ఫెయిలవుతున్నారు. బోర్డు సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు తడబడుతున్నారు. సబ్జెక్టుకు సంబంధించి మంచి పరిజ్ఞానం ఉన్నా కూడా ఇంటర్వ్యూలను ఎదుర్కొనలేకపోతున్నారు. దీని వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అలాగే కొన్నేళ్ల నుంచి ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలో కొందరు అభ్యర్థులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నియామకాల్లో అవకతవకలు జరగకుండా ఉండటంతో పాటు ఇంటర్వ్యూలు త్వరతగతిన పూర్తయ్యే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


APPSC EXAM: ఇకపై నో ఇంటర్వ్యూస్‌... ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఏయే పోస్టుల భర్తీ.. 
ఏపీపీఎస్సీ ద్వారా దాదాపు 20 రకాల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతాయి. గ్రూప్‌-1, ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకులు, సంక్షేమ శాఖల ఆఫీసర్లు, గెజిటెడ్‌ ఇంజనీరింగ్‌ తదితర పోస్టుల భర్తీకి ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. గతంలో గ్రూప్‌–1  పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలను నిర్వహించేవారు. గ్రూప్‌–2, గ్రూప్‌–3 పోస్టులకు కేవలం ఒక పరీక్ష ద్వారానే అర్హులను ఎంపిక చేసేవారు. అనంతరం 2014లో గ్రూప్‌–1 సహా అన్ని క్యాడర్‌ పోస్టులకూ ప్రిలిమ్స్‌, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేలా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగ నియామకాల కోసం అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో (https://psc.ap.gov.in/) తమ వివరాలను నమోదు చేసుకోవాలి. దీనినే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ( One Time Proifle Registration - ఓటీపీఆర్) అని అంటారు. దీనిలో భాగంగా మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, విద్యార్హతల వివరాలు ఇవ్వాలి. అనంతరం అభ్యర్థులు ఒక గుర్తింపు సంఖ్యను (యునిక్ ఐడీ) పొందవచ్చు. కమిషన్ నుంచి ఏదైనా నోటిఫికేషన్లు వెలువడితే అభ్యర్థులు తమ గుర్తింపు సంఖ్యను వెబ్‌సైట్‌లో పేర్కొని, నిర్ణీత ఫీజు చెల్లించడం ద్వారా దరఖాస్తు చేసుకోగలుగుతారు. ఇదిలా ఉండగా, ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్ - 1 మరియు గ్రూప్ - 2 నోటిఫికేషన్ విడుదల కానుంది. 

టాప్ హెడ్ లైన్స్

GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
కొత్త టయోటా హైలక్స్‌ వచ్చేసింది.. 360 డిగ్రీ కెమెరా, 204hp డీజిల్‌ ఇంజిన్‌తో అదిరిపోయే పికప్‌
2026 టయోటా హైలక్స్‌ లాంచ్‌.. కొత్త లుక్‌, కొత్త ఫీచర్లతో మీ ఆదాయానికి మరింత ఊపు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Embed widget