అన్వేషించండి

IDBI Recruitment 2021: ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్..

IDBI Recruitment 2021: ఐడీబీఐ సంస్థలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు గడువు ఆగస్టు 18తో ముగుస్తుంది.

బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్దమయ్యే వారికి ఐడీబీఐ (ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై కేంద్రంగా ఉన్న ఐడీబీఐ సంస్థలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 920 ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు ఆగస్టు 18వ తేదీతో ముగియనున్నట్లు పేర్కొంది. 

IDBI Recruitment 2021: ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్..

Also Read: North Central Railway Recruitment 2021: నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1664 అప్రెంటిస్‌ పోస్టులు..

దరఖాస్తు ఫీజు..

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.200, మిగతా వారంతా రూ.1000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరిన్ని వివరాల కోసం ఐడీబీఐ బ్యాంకు అధికారిక వెబ్‌సైట్ idbibank.in ను సంప్రదించవచ్చని తెలిపింది. 

వయో పరిమితి, విద్యార్హత.. 
2021 జూలై 1వ తేదీ నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఐదేళ్ల వయో పరిమితి ఉంది. ఇక విద్యార్హత విషయానికి వస్తే.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు సరిపోతాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

IDBI Recruitment 2021: ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్..

సెప్టెంబర్ 5న పరీక్ష..
ఆన్‌లైన్ పరీక్ష ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తుంది. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ పరీక్ష సెప్టెంబర్ 5వ తేదీన నిర్వహించనుంది. ఈ పరీక్షను మొత్తం 150 మార్కులకు నిర్వహించనుంది. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ వర్కింగ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనే మూడు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు (ఒక్కో ప్రశ్నకి ఒక మార్కు) ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలుగా ఉంది. 

వేతనం రూ.29000.. 
ఎంపికైన వారి కాంట్రాక్టు ఏడాది పాటు ఉంటుందని నోటిఫికేషన్‌లో చెప్పింది. వారి పనితీరు సంతృప్తికరంగా ఉంటే మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉందని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు రూ.29000 వేతనం చెల్లిస్తామని చెప్పింది. రెండో ఏడాది నెలకు రూ.31000, మూడో ఏడాది నెలకు రూ.34,000 చొప్పున వేతనం చెల్లిస్తామని వివరించింది. 

IDBI Recruitment 2021: ఐడీబీఐలో 920 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్..
దరఖాస్తు చేసుకోండిలా..

  • Idbibank.in అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి. 
  • హోమ్‌పేజీలో కెరీర్ (career) అని ఉన్న ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • రిక్రూట్‌మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఆన్ కాంట్రాక్టు -2021 అనే లింక్‌పై క్లిక్ చేయండి.
  • అప్లయ్ ఆన్‌లైన్‌ను క్లిక్ చేసి.. తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ కు వెళ్లండి. 
  • అభ్యర్థులు తమకు సంబంధించిన వివరాలు ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి. 
  • ఇది పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ నంబరు, పాస్ వర్డ్ (ఈమెయిల్, ఎస్ఎంఎస్ రూపంలో) వస్తాయి. 
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి.
  • దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు కాపీలను సేవ్ చేసుకోండి. 

Also Read: Telangana Anganwadi Recruitment 2021: టెన్త్ అర్హతతో 109 అంగన్‌వాడీ పోస్టులు.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!

వీడియోలు

MS Dhoni about IPL Retirement | రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన తల ధోని | ABP Desam
Virat Kohli Reacts on Fake News | ఫేక్ వార్తలపై విరాట్ ఫన్నీ రియాక్షన్ | ABP Desam
Abhishek Sharma Shouts 'Jai Babu' | జై బాబు అంటూ అభిషేక్ శర్మ రచ్చ | ABP Desam
Aakash Chopra comments on SRH | SRH బౌలింగ్‌పై ఆకాశ్ చోప్రా ఘాటు వ్యాఖ్యలు | ABP Desam
Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Foundation stone laid for steel plant: చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
చంద్రబాబు చొరవతోనే ఏపీలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు - స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనలో మిట్టల్ ప్రశంసలు
Hyderabad Latest News: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా ఎలివేటెడ్ కారిడార్లు, మెట్రో విస్తరణ! సీఎం రేవంత్ రెడ్డి భారీ రోడ్డు మ్యాప్!
YS Sharmila On Jagan: నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
నాది ఆస్తుల పోరాటం కాదు.. వివేకా హత్యపై నిజాల వేట - జగన్‌పై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు
Pawan Kalyan : పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
పొలిటికల్ థ్రిల్లర్‌కు పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్? - డైరెక్టర్ ఎవరో తెలుసా!
Gold and Silver Price: పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
పసిడి, వెండి మార్కెట్‌లో పెను ప్రకంపనలు; మూడు గంటల్లోనే 165 లక్షల కోట్లు మాయం- ఇరాన్ యుద్ధం వేళ షాకింగ్ పరిణామం!
Stock Market 23 March: కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
కుప్పకూలిన స్టాక్ మార్కెట్‌— Sensex 1900 పాయింట్లు, Nifty 600 పాయింట్లు పతనం.. అందుకు కారణాలివే
Harish Rao: ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
ఫిలిప్పీన్స్‌కు బియ్యం ఎగుమతిలో భారీ స్కాం.. కాకినాడ పోర్టులో బియ్యం ముక్కిపోయింది: హరీష్ రావు
National Highways: జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
జాతీయ రహదార్లపై ఏఐ నిఘా!లోపాలు గుర్తించే సరికొత్త డ్యాష్‌ క్యామ్‌ టెక్నాలజీ!
Embed widget