అన్వేషించండి

APTET: 'టెట్‌' అర్హతలపై గందరగోళం, న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న ఉద్యోగార్థులు

ఏపీ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సెకండరీ గ్రేడ్ టీచర్(SGT)పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్-1కు బీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం ఏర్పడింది.

APTET Eligibilities: ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 8న విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే సెకండరీ గ్రేడ్ టీచర్(SGT)పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్-1కు బీఈడీ చేసిన వారికి అవకాశం కల్పించడంపై వివాదం ఏర్పడింది. దీనిపై కొందరు ఎస్జీటీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరచుగా అర్హతలను మారుస్తుండటంతో అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జీవో వెనక్కి..
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జీటీ టెట్ పేపర్-1కు బీఈడీ చేసిన వారికి అర్హత లేదని జనవరి 26న పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జీఓ ఎంఎస్-4ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే 'నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE)' ఇచ్చిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసినందున.. పేపర్-1కు బీఈడీ వారికి అర్హత లేదంటూ జీఓలో పేర్కొన్నారు. దీని ప్రకారం స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహించే టెట్ పేపర్-2 పరీక్షకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు డిగ్రీలో 40 శాతం మార్కులున్నా అర్హులేనని పేర్కొన్నారు. దీని కోసం జనవరి 26న మెమో ఇచ్చారు. ఎస్జీటీలో బీఈడీ వారికి అర్హత లేనందున డిగ్రీ అర్హత మార్కుల్లో ఎలాంటి మార్పూ చేయలేదు. కానీ, టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసరికి కొత్తగా మరో మెమో జారీ చేశారు. ఎస్జీటీ పోస్టులకు నిర్వహించే టెట్ పేపర్-1కు బీఈడీ వారికి అవకాశం కల్పించారు. 

రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో నో ఛాన్స్..
బీఈడీ వారికి అవకాశం లేదని రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు సంబంధించిన కేసుల్లో సుప్రీం కోర్టు చెప్పిందని, దీనిపై ఎన్‌సీటీఈ ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వనందున పాత విధానమే పాటిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అలాంటప్పుడు జనవరి 26న జీఓ ఎందుకు ఇచ్చినట్లు? అదే జీఓను 12 రోజుల్లో రద్దు చేస్తూ మెమో జారీ చేయడం ఏంటి? ఏదైనా సవరణ చేస్తే సవరణ జీఓ ఇవ్వకుండా ప్రభుత్వం మెమో ఎలా జారీ చేస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. టెట్, డీఎస్సీ అర్హతల్లో అయోమయం సృష్టించి, ఈ పరీక్షలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వమే ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శిస్తున్నారు. ఎస్జీటీ పేపర్‌కు బీఈడీ వారికి అర్హత కల్పించడంపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే టెట్ దరఖాస్తుల సమయంలోనే న్యాయ వివాదాలు ఏర్పడనున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న జీఓలు, మెమోలు పరస్పరం విరుద్ధంగా ఉండడంపైన అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నోటిఫికేషన్‌లో టెట్ పేపర్-1 అర్హతలు ఇలా..

🔰 పేపర్-1 ఎ (1 - 5వ తరగతులకు)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌తోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో నాలుగేళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హతతో రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (స్పెషల్ ఎడ్యుకేషన్) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఏదైనా డిగ్రీతోపాటు రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ ఏదైనా డిగ్రీతోపాటు 50 శాతం మార్కులతో బ్యాచిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) అర్హత ఉండాలి. (లేదా)

➥ కనీసం 55 శాతం మార్కులతో పీజీ డిగ్రీతోపాటు  బీఈడీ లేదా ఎంఈడీ అర్హత ఉండాలి. 

➥ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 5 శాతం మార్కులు మినహాయింపు వర్తిస్తుంది.

టెట్ అర్హతలు, పరీక్ష విధానం కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

8th Pay Commission: కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?
Infosys Jobs: ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. 20000 మందిని రిక్రూట్ చేస్తామని ప్రకటన
ఫ్రెషర్స్‌కు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. 20000 మందిని రిక్రూట్ చేస్తామని ప్రకటన
Andhra Pradesh Zonal System: ఏపీలో స్థానికతపై కొత్త నిబంధనలు.. ఇకపై 26 జిల్లాలు.. 2 మల్టీ జోన్‌లు, 6 జోన్‌లు
ఏపీలో స్థానికతపై కొత్త నిబంధనలు.. ఇకపై 26 జిల్లాలు.. 2 మల్టీ జోన్‌లు, 6 జోన్‌లు
CRPF Jobs: 9,195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. టెన్త్ పాసైన వారు అర్హులు, ఏజ్ లిమిట్ పూర్తి వివరాలు
9,195 పోస్టుల భర్తీకి CRPF నోటిఫికేషన్.. టెన్త్ పాసైన వారికి అవకాశం, ఏజ్ లిమిట్ పూర్తి వివరాలు

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kodandaram and Azharuddin Sworn In as MLCs: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
Who is Dusharla Satyanarayana: అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?
అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?
AP special assembly sessions: మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
మరోసారి ఏపీ ప్రత్యేక అసెంబ్లీ - మహిళా రిజర్వేషన్లపై ఏం చర్చిస్తారు? రహస్య ఎజెండా ఉందా?
Stand-up Comedian Sarat Uday: స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
స్టాండప్ కమెడియన్ శరత్ ఉదయ్‌‌కి చేదు అనుభవం, లైవ్‌లో అడ్డుకుని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ కార్యకర్తలు!
Kamareddy Crime News: నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
నాన్ వెజ్ వండలేదని గొడవ.. భార్య చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్త, కామారెడ్డిలో ఘటన
Ashu Reddy Issue : అషు రెడ్డి వివాదంలో షాకింగ్ ట్విస్ట్ - కాల్ మనీ రాకెట్‌తో లింక్?
అషు రెడ్డి వివాదంలో షాకింగ్ ట్విస్ట్ - కాల్ మనీ రాకెట్‌తో లింక్?
Best Summer Foods : వేసవిలో ఎనర్జీ, ఇమ్యూనిటీ పెంచే తెలుగు ఫుడ్స్.. అలసటను దూరం చేసుకునేందుకు ఇవే బెస్ట్
వేసవిలో ఎనర్జీ, ఇమ్యూనిటీ పెంచే తెలుగు ఫుడ్స్.. అలసటను దూరం చేసుకునేందుకు ఇవే బెస్ట్
BRS Foundation Day: సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. ఈసారి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికే పరిమితం
Embed widget