అన్వేషించండి

CBSE CTET 2021: టీచర్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా దరఖాస్తు చేసుకోండి

కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష డిసెంబర్ 2021 నోటిఫికేషన్‌ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసింది. ఈసారి పరీక్షను ఆన్‌లైన్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హిస్తున్న‌ట్లు సీబీఎస్ఈ వెల్లడించింది.

ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలనుకునే వారికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్- సీటెట్) నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది సీటెట్ ప‌రీక్షను ఆన్‌లైన్ విధానంలో నిర్వ‌హిస్తున్న‌ట్టు సీబీఎస్ఈ వెల్లడించింది. సీటెట్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కాగా.. గడువు అక్టోబర్ 19వ తేదీతో ముగియనుందని తెలిపింది. దరఖాస్తు ఫీజులను అక్టోబర్ 30 మధ్యాహ్నం 3:30 వరకు చెల్లించవచ్చని అభ్యర్థులకు సూచించింది. సీటెట్ పరీక్షలను డిసెంబర్ 16 నుంచి 2022 జనవరి 13 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొంది. సీటెట్ పరీక్షను దేశవ్యాప్తంగా 20 భాషల్లో నిర్వహించనున్నట్లు వివరించింది. బీఈడీ పూర్తి చేసిన వారు సీటెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

దరఖాస్తు ఫీజు వివరాలు.. 
ఒక పేపర్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనరల్, ఓబీసీ  అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెండు పేపర్లకు అయితే రూ.1200 ఫీజు కట్టాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.500.. రెండు పేపర్‌లకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష విధానం, సిలబస్, అర్హత, దరఖాస్తు రుసుము తదితర సమగ్ర సమాచారాన్ని ctet.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చు. సీటెట్ అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

సీటెట్ పరీక్ష కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి.. 
1. సీటెట్ అధికారిక వెబ్‌సైట్‌ ctet.nic.inను ఓపెన్ చేయండి.
2. ఇక్కడ ‘Apply Online for CTET December 2021’ అనే లింక్ పై క్లిక్ చేయండి. 
3. ఇక్కడ అభ్యర్థులు తమ వివరాలను రిజిస్టర్ చేసుకోవాలి. దీంతో రిజిస్ట‌ర్ నంబ‌ర్ జ‌న‌రేట్ అవుతుంది. దీనిని సేవ్ చేసుకోవాలి. 
4. దరఖాస్తును పూర్తి చేయాక.. నోటిఫికేషన్లో సూచించిన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. 
5. దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దీంతో దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. 
6. భవిష్యత్ అవసరాల కోసం దీనిని ప్రింటవుట్ తీసుకోవాలి. 

CBSE CTET 2021: టీచర్ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్.. సీటెట్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఇలా దరఖాస్తు చేసుకోండి

పరీక్ష విధానం.. 
సీటెట్ (Central Teacher Eligibility Test) రాత పరీక్ష డిసెంబర్‌ 16 నుంచి జనవరి 13 వరకు జరగనుంది. రెండు షిఫ్టులలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్‌.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో షిఫ్ట్‌ ఉంటుంది. దీనిలో 2 పేపర్లు ఉంటాయి. 1 నుంచి 6వ తరగతి వరకు పేపర్‌-1.. 6 నుంచి 8వ తరగతి వరకు పేపర్‌-2 ఉంటాయి.

పేపర్‌-1 పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పేపర్లో 5 సెషన్లు ఉంటాయి. ఒక్కో సెషనుకు 30 మార్కుల చొప్పున మొత్తం 150 ప్రశ్నలు కేటాయించారు. ఫస్ట్‌ లాంగ్వేజ్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌, చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ & పెడగాగి, మ్యాథమెటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌ అనే ఐదు సెషన్లు ఉంటాయి. 

పేపర్‌-2 కూడా 150 మార్కులకు ఉంటుంది. ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ & పెడగాగి, ఫస్ట్‌ లాంగ్వేజ్‌, సెకండ్‌ లాంగ్వేజ్‌, మ్యాథమెటిక్స్ & సైన్స్‌‌ లేదా సోషల్‌ సైన్స్‌ / సోషల్‌ స్టడీస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొదటి 3 సెక్షన్ల నుంచి 30 ప్రశ్నల చొప్పున 90 ప్రశ్నలు అడుగుతారు. మిగతా 2 సెక్షన్లకు 60 మార్కులు కేటాయించారు. 

8 ప్రాంతాల్లో సీటెట్‌ పరీక్ష కేంద్రాలు..
సీటెట్‌ పరీక్షను తెలంగాణ 8 ప్రాంతాల్లో నిర్వహించనున్నారు. గతేడాది వరకు కేవలం హైదరాబాద్‌లోనే ఎగ్జామ్ సెంటర్లు ఉండేవి. ఈసారి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తున్న నేపథ్యంలో.. హైదరాబాద్‌తోపాటు ఖమ్మం, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, కోదాడ, నిజామాబాద్‌, వరంగల్‌, నల్గొండలలో ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. 

Also Read: ATOS Recruitment: భారత్‌లో 15000 నియామకాలు.. నిరుద్యోగులకు 'అటోస్' గుడ్ న్యూస్

Also Read: Indian Navy Recruitment 2021: ఇండియ‌న్ నేవీలో 181 పోస్టులు.. రాత ప‌రీక్ష లేకుండానే ఎంపిక.. ముఖ్యమైన తేదీలివే..

 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

LSG vs CSK Match Highlights IPL 2025 | లక్నో పై 5వికెట్ల తేడాతో చెన్నై సంచలన విజయం | ABP DesamNani HIT 3 Telugu Trailer Reaction | జనాల మధ్యలో ఉంటే  అర్జున్..మృగాల మధ్యలో ఉంటే సర్కార్ | ABP DesamVirat Kohli Heart Beat Checking | RR vs RCB మ్యాచులో గుండె పట్టుకున్న కొహ్లీRohit Sharma Karn Sharma Strategy | DC vs MI మ్యాచ్ లో హైలెట్ అంటే ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP:  వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టుకు వైఎస్ఆర్‌సీపీ - రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని ఆరోపణ
Telangana Bhubharathi: అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
అందుబాటులోకి వచ్చిన భూభారతి పోర్టల్‌- రెవెన్యూ అధికారులకు కీలక బాధ్యత అప్పగించిన సీఎం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం - రాజ్ కసిరెడ్డి కోసం గాలింపు - విస్తృత సోదాలు
Telangana Latest News: కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
కంచ గచ్చిబౌలి భూముల్లో జంతువుల్లేవ్- సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కారు కౌంటర్ దాఖలు
Shaik Rasheed : మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
మొదటి మ్యాచ్‌లో ఆకట్టుకున్న షేక్ రషీద్ - ఈ గుంటూరు మిరపకాయ్‌ స్ఫూర్తిదాయక స్టోరీ తెలుసా?
New Toll System: టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
టోల్ సిస్టమ్‌లో సంచలన మార్పు - 15 రోజుల్లో అమలు - ఇక టోల్ గేట్ల వద్ద ఆగే పని ఉండదు!
Modi on Kancha Gachibowli Lands : అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ  సంచలన వ్యాఖ్యలు
అడవుల్ని నరికేసి వన్యప్రాణుల్ని చంపుతున్నారు - కంచ గచ్చిబౌలి ల్యాండ్స్ పై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
Trains Cancel : గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీమోడలింగ్ వర్క్స్, రోజుల తరబడి కీలక రైళ్లు రద్దు!
గుంతకల్ డివిజన్‌లో యార్డ్ రీమోడలింగ్ వర్క్స్, రోజుల తరబడి కీలక రైళ్లు రద్దు!
Embed widget