అన్వేషించండి

Coronavirus India Update: 30 వేలకు తగ్గిన కరోనా కేసులు.. 422 మంది మృతి

భారత్ లో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4,04,958కి చేరింది. దేశంలో ఇప్పటివరకు ఉన్న మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 1.28% గా ఉంది.

దేశంలో కొత్తగా 30,549 కేసులు నమోదయ్యాయి. 422 మంది చనిపోయారు. 38,887 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 97.38% శాతంగా ఉంది. 

  • మొత్తం కేసులు: 3,17,26,507
  • మొత్తం రికవరీలు: 3,08,96,354
  • మొత్తం మరణాలు: 4,25,195
  • యాక్టివ్ కేసులు: 4,04,958
  • మొత్తం వ్యాక్సినేషన్ : 47,85,44,114 ( గత 24 గంటల్లో 61,09,587)

దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 4,04,958గా ఉంది. మొత్తం కేసుల్లో ఇది 1.28%. వీక్లీ పాజిటివ్ రేట్ 5 శాతం కంటే తక్కువే ఉంది. ప్రస్తుతం 2.39%గా ఉంది.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో కొత్తగా 4,869 కేసులు నమోదుకాగా 90 మంది కరోనాతో మృతి చెందారు.8,429 మంది కరోనాను జయించారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,15,063కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 1,33,038కి పెరిగినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

ALSO READ:

Covid-19 Transmission: కరోనా రోగి కన్నీళ్ల నుంచి కూడా వైరస్ వ్యాప్తి.. ఏ మేరకు ప్రభావం చూపుతుందంటే

రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 61,03,325కి పెరగగా 75,303 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 96.65 శాతానికి చేరింది.

మరణాల రేటు 2.1 శాతంగా ఉంది. ముంబయిలో కొత్తగా 259 కేసులు నమోదయ్యాయి, 9 మంది చనిపోయారు. మొత్తం కేసుల సంఖ్య 7,35,366కి పెరగగా మొత్తం మరణాలు 15,908గా ఉంది.

కేరళలో విజృంభణ..

కేరళలో కొత్తగా 13,984 కేసులు నమోదుకాగా 15,923 మంది రికవరయ్యారు. 118 మంది చనిపోయారు. పాజిటివిటీ రేట్ 10.93% ఉంది.

రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,65,322గా ఉంది. మొత్తం రికవరీల సంఖ్య 32,42,684కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 16,955కి పెరిగింది.

అక్టోబర్ లో పీక్..

హైదరాబాద్, కాన్పుర్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నలజీ (ఐఐటీ) పరిశోధకులు కొవిడ్ థర్డ్ వేవ్ ఆగస్ట్ చివరివారంలో వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. బ్లూమ్ బర్గ్ రిపోర్ట్ ప్రకారం, ఈ వేవ్ లో కరోనా కేసులు రోజుకు లక్ష నుంచి లక్ష 50 వేలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అయితే సెకండ్ వేవ్ లానే థర్డ్ వేవ్ కూడా దారుణంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా భౌతిక దూరం తప్పక పాటించాలని, ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించొందని హెచ్చరిస్తున్నారు.

థర్డ్ వేవ్ ఆగస్టు చివరి వారంలో మొదలైనప్పటికీ అక్టోబర్ లో పీక్ లో ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని.. తగిన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ:

Petrol-Diesel Price, 3 August: ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు.. ఇక్కడ మాత్రం స్థిరంగానే.. లేటెస్ట్ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవీ..

టాప్ హెడ్ లైన్స్

Junk Food Ban in Schools: స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
స్కూల్ పరిసరాల్లో జంక్‌ఫుడ్ బ్యాన్- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ICMR విప్లవాత్మక ప్రతిపాదనలు 
Testosterone Screening After 30: టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
టెస్టోస్టెరాన్‌ ప్రభావం 30 ఏళ్ల తర్వాత తగ్గుతుందా? అమెరికా ఆర్మీ సైనికులకు ఎందుకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తోంది?
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi On Paper Leak: పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
పేపర్ లీక్‌లపై ప్రత్యేక బిల్లు తెస్తామన్న ప్రధాని మోదీ.. అర్ధరాత్రి దీక్ష విరమించిన వాంగ్‌చుక్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Embed widget