అన్వేషించండి

Covid-19 Transmission: కరోనా రోగి కన్నీళ్ల నుంచి కూడా వైరస్ వ్యాప్తి.. ఏ మేరకు ప్రభావం చూపుతుందంటే

కరోనా రోగి తుమ్మినా, తగ్గినా ఆ తుంపర్ల వల్ల వైరస్ వ్యాప్తి చెందుతుందన్నది కొత్త విషయమేం కాదు. అయితే కరోనా రోగి కన్నీళ్లలో కూడా వైరస్ ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది.

కరోనా రోగి కన్నీళ్ల నుంచి సైతం వైరస్ వ్యాప్తి అవుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అమృత్ సర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ చేసిన తాజా అధ్యయనంలో పలు విషయాలు వెలుగుచూశాయి. ఈ అధ్యయనం ప్రకారం.. కరోనా రోగి కన్నీళ్లు కూడా వైరస్ ను వ్యాప్తి చేయగలవని తేలింది. అయితే ఇతర మార్గాల ద్వారా జరిగే వైరస్ వ్యాప్తి కంటే ఇది ప్రమాదకరమా లేదా అనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. 

ఓకులర్ మేనిఫెస్టేషన్..  

ఏదైనా శరీరంలోని ఓ అవయవానికి ఇన్ఫెక్షన్ సోకి ఆ ప్రభావంతో కంటికి ఏర్పడే పరిస్థితిని ఓకులర్ మేనిఫెస్టేషన్ అంటారు. ఈ అధ్యయనంలో భాగంగా కొంతమంది రోగుల కన్నీళ్లను ఆర్‌టీ- పీసీఆర్ విధానం ద్వారా 48 గంటల్లోగా పరీక్షించారు.

ఏం తేలిందంటే..

120 మంది రోగుల్లో 21 మంది నమూనాల్లో కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. మరో 11 మందికి నమూనాల్లో కరోనా వైరస్ లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. 10 మందిలో ఎలాంటి ప్రభావం లేదు. ఈ పరీక్షల అనంతరం కరోనా రోగుల కన్నీళ్ల నుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని పరిశోధకులు తేల్చారు. కనుక కొవిడ్19 రోగులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. కన్నీళ్ల ద్వారా కూడా కరోనా వ్యాప్తి కాకుండా అడ్డుకోవాలని సూచించారు. ఇందుకు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ మేరకు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆప్తమాలజీలో కూడా ఓ కథనం ప్రచురితమైంది.

Also Read: Mobile Phones in ICU: ఐసీయూలోకి మొబైల్ తీసుకువెళ్తే ఏమౌతుంది?

కరోనా విజృంభణ..

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 40,134 కొవిడ్19 కేసులు నమోదవగా, మరో 422 మంది కరోనా మహమ్మారితో మరణించారు. ఆగస్టు 1 వరకు దేశవ్యాప్తంగా 46,96,45,494 కరోనా శాంపిల్స్‌ను టెస్ట్ చేసినట్లు భారత వైద్య, పరిశోధన మండలి వెల్లడించింది. నిన్న 14,28,984 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది.

దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఆగస్ట్ చివరి వారం లేదా సెప్టెంబర్ మొదటివారం వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. అయితే ఈ లోపు వీలైనంత మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ భావిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి.

దేశంలో 100 శాతం కరోనా వ్యాక్సినేషన్ చేపట్టిన నగరంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్ రికార్డ్ సృష్టించింది. ఈ మేరకు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సౌత్ ఈస్ట్ జోనల్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

Also Read: Drones Spotted, Jammu Kashmir: మరోసారి జమ్మూలో డ్రోన్ల కలకలం.. భద్రతా దళాలు అప్రమత్తం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్

వీడియోలు

పాతికేళ్లలో ఊహించలేని విధంగా మన ప్రపంచం మారిపోయింది
Indian Cricket High pay Profession | టాలెంట్ ఉందా..క్రికెట్ ఆడు..కోట్లు సంపాదించు | ABP Desam
Shreyas Iyer Rapid Weight Loss | న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు అయ్యర్ దూరం.? | ABP Desam
Liam Livingstone England T20 World Cup Squad | సన్ రైజర్స్ తప్పు చేసిందా..ఇంగ్లండ్ విస్మరించిందా.? | ABP Desam
Ind w vs SL w 5th T20 Highlights | ఐదో టీ20లోనూ జయభేరి మోగించిన భారత మహిళల జట్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Latest News: అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
అమరావతిలో రెండోదశ ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధమైన ప్రభుత్వం! జనవరి 3న నోటిఫికేషన్!
Anakapalle Viral News: అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో బాహుబలి బాలుడు జననం ! శిశువు బరువు ఏకంగా 4.8 కేజీలు!
Sajjanar Warnings: హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
హైదరాబాద్ పోలీస్ బోలే తో జీరో టాలరెన్స్ - మందుబాబులూ అస్సలు లైట్ తీసుకోవద్దు - మ్యాటర్ సీరియస్
Bhogapuram International Airport :
"ఉత్తరాంధ్రాకు రాజభోగాపురం" కొత్త ఎయిర్‌పోర్టులో జనవరి 4న తొలి విమానం ల్యాండింగ్
Year Ender 2025: పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
పోస్టు కార్డు నుంచి టీవీ వరకు - డిజిటల్‌ విప్లవంతో జ్ఞాపకాల పెట్టేలో చేరిన వస్తువులు ఇవే!
Happy New Year 2026: ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
ఆక్లాండ్‌లో 2026 ఎంట్రీ - మిన్నంటిని సంబరాలు - అందరి నోటా హ్యాపీ న్యూఇయర్ - వీడియోలు
Bank fraud case: ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
ఇండియాలో బ్యాంకుల్ని ముంచి లండన్‌లో ఆస్తులు కొన్న మోసగాళ్లు - జప్తు చేసేసిన ఈడీ - విదేశాల్లోనూ వదలరు !
Draksharamam Shivalingam case: పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
పూజారిపై కోపంతో శివలింగం ధ్వంసం -ఎంత పని చేశావు శ్రీనివాసూ ?
Embed widget