అన్వేషించండి

Fish Pasadam: చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు- ఈనెల 8 నుంచి సరఫరా

Hyderabad News: బత్తిన కుటుంబం అందించే చేపప్రసాదం పంపిణీకి ఎగ్జిబిషన్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈనెల 8 నుంచి ఉబ్బసం రోగులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేయనున్నారు.

Fish Prasadam: మృగశిర కార్తె రానుండటంతో హైదరాబాద్‌(Hyderabad)లో చేప మందు ప్రసాదం అందించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్తమా సహా శ్వాసకోస సంబంధిత ఇబ్బందులు ఉన్నవారికి  బత్తినసోదరుల(Bathini Brothers) ఆధ్వర్యంలో కొన్నేళ్లుగా ఈ చేపమందును ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈఏడాది సైతం చేపప్రసాదం అందించనున్నారు. 

చేప ప్రసాదం పంపిణీ
మృగశిరకార్తె ప్రారంభం కానుండటంతో ఈనెల 8 నుంచి నాంపల్లి(Nampally)లోని ఎగ్జిబిషన్‌ మైదానంలో చేపమందు ప్రసాదం(Fish Medicine) పంపిణీ చేయనున్నారు. బత్తిన కుటుంబం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏటా పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా చేపమందు అందించనుండటంతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆస్తమా ఉన్న రోగులకు ఈ చేపమందు దివ్య ఔషధంలా పనిచేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల నుంచేగాక...మహారాష్ట్ర, కర్ణాటక నుంచీ పెద్దఎత్తున ప్రజలు తరలివస్తుంటారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం(Nampally Exhibition Ground)లో  కౌంటర్లు ఏర్పాటు చేసి వరుస క్రమంలో ఈ మందు అందజేస్తారు. మృగశిరకార్తె రోజు అందించే ఈ చేపమందు ప్రసాదం కోసం ముందురోజు రాత్రికే వచ్చి క్యూలైన్‌లోనే వేచి ఉంటారు. అందుకు అనుగుణంగా అధికారులు లైట్లు,బారీకేడ్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. బత్తిన కుటుంబం(Bathini Family) కొన్ని దశాబ్దాలుగా ఈ చేపమందును ఉచితంగా అందజేస్తోంది. బత్తిన శంకర్‌గౌడ్ వాళ్ల తాతకు ఓ సాధువు ఈ మందు తయారీ విధానం నేర్పించి ఉచితంగా అందజేస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పడంతో అప్పటి నుంచి ఈ చేపప్రసాదం అందజేస్తున్నారు.  ఇటీవలే హరినాథ్‌గౌడ్ మరణించినా... ఆయన కుటుంబ సభ్యులు ఈ ఏడాది చేపమందు పంపిణీ చేయనున్నారు.

సహజసిద్ధ మూలికలతో ప్రసాదం
ఈ చేపప్రసాదాన్ని ఆయుర్వేద మూలికలతోపాటు పాలపిండి, ఇంగువా, బెల్లం, పసుపు మిశ్రమంతో తయారు చేస్తారు. కేవలం బావిలో ఊరిన నీటినే ఇందులో వినియోగిస్తారు. ఈ మిశ్రమాన్ని బతికి ఉన్న కొర్రమీను చేపపిల్లల నోటిలో పెట్టి  ఉబ్బసం రోగం ఉన్న వారితో వాటిని నేరుగా మింగిస్తారు. అయితే తొలుత దీన్ని చేపమందుగా ప్రచారం చేసేవారు. దీనిపై ఎన్నో వివాదాలు నడిచాయి. అసలు ఇది మందే కాదని...ఉబ్బసం వ్యాధి తగ్గిస్తుందని చెప్పడానికి ఎలాంటి శాస్త్రీయ కారణాలు లేవని జనవిజ్ఞాన సంస్థ వంటివి ఆందోళనలు నిర్వహించాయి. అయినప్పటికీ  బత్తిన కుటుంబం అందించే ఈ చేపమందు కోసం జనం తండోపతండాలుగా తరలివచ్చేవారు. కొన్నిసార్లు తోపులాటలు చోటుచేసుకుని పలువురు మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి. వ్యవహారం కోర్టు మెట్లెక్కింది. ఈ మందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంతో దీన్ని చేపమందుగా పిలవకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. కోర్టు సూచన మేరకు అప్పటి నుంచి దీన్ని చేపప్రసాదంగా అందజేస్తున్నారు. 

వేలాది మంది రాక
హైదరాబాద్(Hyderabad) ఎగ్జిబిషన్ మైదానంలో పంపిణీ చేసే ఈ చేపప్రసాదం కోసం ఏటా వేలాది మంది తరలివస్తుంటారు. అయితే చేపప్రసాదంలో వాడే మిశ్రమాన్ని మాత్రం బత్తిన కుటుంబం ఉచితంగానే అందిస్తున్నా...చేపలను మాత్రం ఎవరికి వారే సొంతంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎగ్జిబిషన్ మైదానం ఆవరణలోనే ప్రత్యేక స్టాళ్లలో కొర్రమీను చేపపిల్లలను విక్రయిస్తుంటారు. మృగశిరకార్తె నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయి. వర్షాలు పడుతుండటంతో పాటు చల్లగాలులకు ఆస్తమా రోగులు ఇబ్బందిపడుతుంటారు. అందుకే మృగశిరకార్తె ప్రారంభం రోజే ఈ మందు పంపిణీ చేస్తుంటారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

DC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP DesamHardik Pandya captaincy IPL 2025 | టీమ్ సెలక్షన్ లోనూ పాండ్యా తప్పిదాలు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 RR VS CSK Result Update: రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
రాయ‌ల్స్ బోణీ.. చెన్నైకి స్వీట్ షాకిచ్చిన రాజస్థాన్, రాణించిన నితీశ్, హ‌స‌రంగా, రుతురాజ్ పోరాటం వృథా
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sikandar Review - సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
సల్మాన్ భాయ్ సినిమా హిట్టా? ఫట్టా? రంజాన్‌ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?
Andhra Pradesh: గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
గుడ్‌న్యూస్, రూ.2 వేల కోట్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
Puri Jagannadh Vijay Sethupathi: పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ ఫిక్స్ - అధికారిక ప్రకటన వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే?
Embed widget