Trinayani Serial Today September 1st: 'త్రినయని' సీరియల్: పేపర్లు మాయం.. విశాల్కి మరణం తప్పదా.. ఆ మాటల అర్థం ఏంటి?
Trinayani Today Episode పెట్టెలో ఉన్న పేపర్లను ఎవరో దొంగతనం చేయడం, విశాల్ చేతి గాయం తగ్గుతుందా లేదా అని అందరూ భయపడటంతో ఇవాళ్లి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode సుమన పెద్దబొట్టమ్మని ప్రేమగా చూసుకోవడంతో అందరికీ అనుమానం వస్తుంది. విక్రాంత్ కూడా అందరి ఎదురుగా సుమనని నిలదీస్తాడు. ఇక పెద్దబొట్టమ్మ విశాల్ ఆరోగ్యం బాగు పడాలి అంటే ఆ పత్రాల్లో ఏముందో చదవాలని అంటుంది. దానికి విశాల్ తన తల్లి ఆత్మ వచ్చి చదివి మానసాదేవి ఆలయానికి ఎలా వెళ్లాలో చెప్పిందని చెప్తాడు. పెద్దబొట్టమ్మ సుమనకు సైగ చేస్తుంది.
సుమన: ఇంకోసారి వాటిని చదవాలి అనుకుంటున్నావా ఏంటి పెద్దబొట్టమ్మ.
నయని: ఇప్పుడు వాటిని బయట పెట్టి ఏం చేస్తాం అలాగే ఉండనివ్వండి
విశాల్: అయినా పౌర్ణమి వచ్చే వరకు ఆగాలా కదా.
ఇంతలో గాయత్రీ పాప ఆ పెట్టె దగ్గరకు వెళ్లబోతే నయని పరుగున వెళ్లి పాపని ఆపుతుంది. ఆ పాపకి ఏం కాదు అని హాసిని అంటుంది. ఎందుకు ఏం కాదు అని అందరూ అంటారు.
విక్రాంత్: ఆ పాప ఏమీ పెద్దమ్మ కాదు కదా వదినా. పెద్దమ్మ పునర్జన్మలో ఉన్న పాపకి అయితే టచ్ చేసినా ఏం కాదు కానీ తిను పెద్దమ్మ కాదు కదా. పుండరీనాధం, ఉలూచి, గాయత్రీ, గానవి నలుగురు తాకినా ఏమైనా అవుతుంది కదా.
విశాల్: గాయత్రీ మా కన్న బిడ్డ కాదు కదా ఏదైనా ప్రమాదం జరిగితే నయని కనిపెట్టి కాపాడుతుందని వదిన ఉద్దేశం.
హాసిని: అవును అవును,.
నయని: మరి ఒకటి రెండు సార్లు తనకి గాయాలు అయినా కనిపెట్టలేకపోయాను.
హాసిని: అత్తయ్య పేరు పెట్టుకోవడం వల్లే కదా కనిపెట్టలేకపోయావు.
పెద్దబొట్టమ్మ: ఇవన్నీ కాదు కానీ పెట్టె తెరచి మానసా దేవి ఆలయం పత్రాలు చూపించండమ్మా.
నయని పెట్టె తెరచి చూస్తే అందులో పేపర్లు ఉండవు. అందరూ షాక్ అవుతారు. నయని అందరికీ ఖాళీ పెట్టె చూపిస్తుంది. తిలోత్తమ, వల్లభ తీసేసుంటారని హాసిని అంటుంది. తిలోత్తమ హాసిని తిడుతుంది.
తిలోత్తమ: నాటకాలు వద్దు నయని మర్యాదగా పేపర్లు తీసుకురా. నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఆ పేపర్లు ముట్టుకోరు కదా షాక్ కొడుతుంది.
సుమన: నిజమే కదా
హాసిని: కర్రతో మా ఆయన తీయడానికి ప్రయత్నించారు కదా .
నయని: విశాలాక్షి అమ్మవారి సాక్షిగా చెప్తున్నా నేను ఆ కాగితాలు తీయలేదు. బాబుగారి యోగక్షేమాలు గురించి ఉన్న పత్రాలు పెట్టెలో ఉన్నాయని భావించిన నేను ఎందుకు వాటిని తీస్తాను.
విక్రాంత్: బాధ పడకండి వదిన ఆ ఇంటి దొంగ ఎవరో నేను తేల్చుతాను.
సుమన పేపర్లు తీసిందని విక్రాంత్ సుమనను అడుగుతాడు. ఆ పేపర్లు తీసింది తానే అని నిరూపిస్తే విడాకులు ఇస్తానని సుమన అంటుంది. నయని, విశాల్, హాసినిలు కూడా ఆ పేపర్ల గురించే ఆలోచిస్తారు. ఎవరు పేపర్లు తీసుంటారని అనుకుంటారు. విశాల్ తనకు నయని అంటే చాలా ఇష్టమని మరి ఆ గుండె ఎప్పుడు ఆగిపోతుందో అని తన వల్ల కావడం లేదని పైకి మాత్రం మంచిగా కనిపిస్తున్నానని అంటాడు. ఇక విశాల్ చేయి కూడా పచ్చగా మారుతుంటుంది. తిలోత్తమ వాళ్లు కూడా ఎవరు తీశారా అని ఆలోచిస్తూ ఉంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కంటెస్టెంట్స్కి చుక్కలు చూపిస్తానంటున్న 'కృష్ణ' అలియాస్ ప్రేరణ
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
ట్రెండింగ్ వార్తలు





















