Trinayani Serial Today January 17th: ‘త్రినయని’ సీరియల్ : విశాలాక్షిని తిట్టిన వల్లభ – నిజం తెలుసుకున్న రత్నాంభ
Trinayani Today Episode: త్రినేత్రి చనిపోయిందని దురందర, నయని ఇద్దరూ మాట్లాడుకుంటుంటే రత్నాంభ వెళ్లి వింటుంది. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Trinayani Serial Today Episode: తిలొత్తమ్మ చనిపోతుందని చెప్పిన విశాలాక్షిని ఇంకా ఎన్నాళ్లు బతుకుతుంది అని విక్రాంత్ అడుగుతాడు. ఎన్నాళ్లు కాదు చిన్నాన్న నాలుగు రోజుల్లో చనిపోతుందని విశాలాక్షి చెప్పగానే అందరూ షాక్ అవుతారు. తర్వాత రూంలో కూర్చుని ఆలోచిస్తున్న నయని దగ్గరకు దురందర వెళ్తుంది.
దురందర: నువ్వు చెప్పిన విషయం నిజమైతే ఎంత బాగుండేదో కదా నయని
నయని: నిజం పిన్ని త్రినేత్రి దేవీపురం వెళ్లి కాళికాదేవి అమ్మవారి పూజ చేస్తూ ఎప్పట్లా తన జీవితాన్ని సుఖసంతోషాలతో జీవిస్తే బాగుండు కదా
దురందర: అమ్మవారి దగ్గరకే వెళ్లి అక్కడే తను అమ్మవారిలో ఐక్యం అయిందన్న విషయం బామ్మ గారికి తెలియదు పాపం
ఇంతలో రత్నాంభ వస్తుంది.
రత్నాంభ: తెలుసు.. నాకు అంతా తెలుసు.. ఎంటమ్మా అలా చూస్తున్నారు. నా మనవరాలు మా ఊరికే వెళ్లి ఉంటుందని నాకు తెలుసు.. చూశావా నయని మీ పిన్ని నన్ను ఆట పట్టించి కంగారు పెట్టిద్దామనుకుంటుంది.
దురందర: బామ్మ గారు మీరు ఎలా అనుకుంటే అలా
నయని: మనవరాలు ఊరు వెళ్లిందని చెప్పగానే బామ్మ ముఖంలో వెలుతురు వచ్చింది చూడు
రత్నాంభ: ఎందుకు రాదమ్మా నా మనవరాలు అమావాస్య రోజు అమ్మవారికి పూజ చేసి వస్తే మరుసటి రోజు వరకు నా మనవరాలి చుట్టు కాంతి వలయం ఉండేది అది చూసిన ఊరి జనం నోరు వెళ్లబెట్టేవారు
నయని: అది చూసే భాగ్యం మనకు లేదు అత్తయ్యా
దురందర: ఈసారి వెళ్లి చూద్దాం నయని
రత్నాంభ: బాగా చెప్పావు దురందర. మాఘమాసంలో రండి మా ఊర్లో అమ్మవారికి ఉత్సవాలు ఉంటాయి
అని చెబుతూ రత్నాంభ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. వల్లభ లెక్కలు వేస్తుంటే తిలొత్తమ్మ వెళ్లి ఏం చేస్తున్నావు వల్లభ అని అడుగుతుంది. వల్లభ పలకకుండా లెక్కలు వేస్తుంటే.. చెవి పట్టుకుని ఏం చేస్తున్నావు అని అడుగుతుంది.
వల్లభ: ఈ నాలుగు రోజులు నీకు కష్టం ఎప్పుడొస్తుందోనని లెక్కలు వేస్తున్నాను మమ్మీ.
తిలొత్తమ్మ: అరేయ్ నీకు జ్యోతిష్యం తెలిస్తే నువ్వు ఎప్పుడో బాగుపడేవాడివి
వల్లభ: ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు ఎలాగూ ఈ శుక్రవారం పోతున్నావు కాబట్టి నీ కొడుకుల యోగక్షేమాలు కోరుకుంటున్నావు అంతే కదా మమ్మీ.
తిలొత్తమ్మ: నేను కచ్చితంగా ఈ నాలుగు రోజుల్లో పోతానని మీ అందరికీ నమ్మకం కుదిరింది. ఎందుకంటే గాయత్రి పాప కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. అయితే నా జాగ్రత్తలో నేను ఉంటే గనక అయిదో రోజులోకి అడుగుపెట్టడం జరగుతుంది. అప్పుడు విశాలాక్షి అన్నది అబద్దం అని తేలుతుంది.
వల్లభ: ఈ గండం గట్టెక్కితే ఇక నీకు తిరుగుండదు మమ్మీ
అని వల్లభ అనగానే అవును అంటుంద తిలొత్తమ్మ.. మరుసటి రోజు వల్లభ ఇల్లంతా తిరుగుతూ విశాలాక్షిని పిలుస్తుంటాడు.
హాసిని: ఏంటి చెప్పండి
వల్లభ: ఏయ్ నీ పేరు విశాలాక్షా..?
హాసిని: కట్టుకున్న పెళ్లాం పేరే మర్చిపోయావా
వల్లభ: ఏయ్ విశాలాక్షి.. ఎక్కడున్నావు..?
నయని: బావగారు పేరుకు ముందు ఏయ్ ఏంటి గౌరవంగా పిలవకూడదా..?
విశాలాక్షి: ఎవరో నన్ను పిలుస్తు్న్నారా ఇక్కడ
తిలొత్తమ్మ: చూశారా ఎంత పొగరు.. సరే కానీ నేను చనిపోతాను అన్నావు కదా ఎలా చనిపోతానో చెప్పలేదు.
విశాలాక్షి: మీ ప్రాణం తీసేది గాయత్రి అమ్మగారే అని అందరికీ తెలుసు కదా
అని విశాలాక్షి చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. ఇంతలో రత్నాంభ అంత చిన్న పిల్ల గాయత్రి.. తిలొత్తమ్మ ప్రాణాలు హరిస్తుందా..? ఆశ్చర్యంగా ఉందే అంటుంది. ఇంతలో నయని మా అత్తయ్య ప్రాణం పోతే మోక్షం లభిస్తుందా..? అని అడిగితే లభించదని తిలొత్తమ్మ చనిపోయి దురందర కడుపులో పుడుతుందని చెప్తుంది. దీంతో అందరూ మళ్లీ షాక్ అవుతారు. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















