Prema Entha Madhuram Serial Today October 16th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్: శంకర్ ను చంపేయమన్న స్వామీజీ – అయోద్యపురం వెళ్లేందుకు శంకర్, గౌరి రెడీ
Prema Entha Madhuram Today Episode: గౌరి, శంకర్ లను విడదీయడం కాదు వాళ్లిద్దరిని ఓకేసారి చంపేయాలని స్వామిజీ, రాకేష్ కు చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram Serial Today Episode: నన్ను రాకేష్ ఒప్పించాడు అని అభయ్ చెప్పగానే జెండే రాకేష్ను మెచ్చుకుంటాడు. రాకేష్ కూడా మనతో పాటు వస్తున్నాడని అభయ్ చెప్తాడు. అయితే మనతో పాటు జలంధర్ కొడుకు కూడా వస్తున్నాడని జెండే అనడంతో అందరూ షాక్ అవుతారు. వాడు కనిపిస్తే అక్కడే షూట్ చేస్తాను అని అభయ్ అంటాడు. మరోవైపు గౌరిని సంధ్య, శ్రావణి… శంకర్ను పెద్దొడు, చిన్నొడు ఉదయాన్నే ఏదో సౌండ్ వినిపించిందని అడుగుతారు. మనకు ఏదో ప్రయాణం ఉందని ఏవరో స్వామిజీ వచ్చి చెప్పాడు అని ఇద్దరు చెప్తారు. ఇంతలో జోగమ్మ రావడంతో గౌరి వాళ్లు బయటకు వస్తారు.
జోగమ్మ: అమ్మా ఆశీర్వాదం అందజేయమని ఆజ్క్షాపించింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అమ్మా ఆశీర్వాదం తీసుకో..
గౌరి: అలాగే జోగమ్మా..
జోగమ్మ: అమ్మను ఏంటి అలా తదేకంగా చూస్తున్నావు.
గౌరి: అదే అమ్మతో నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందనిపిస్తుంది. అమ్మ నాతో ఏదో మాట్లాడాలి అన్నట్టు అనిపిస్తుంది.
జోగమ్మ: ఒక్కసారి అమ్మ పాదాలు పట్టుకుంటే అంతే ఎన్ని జన్మలకైనా అమ్మ నీ చేయి వీడదు. అమ్మ అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది.
గౌరి: నా చెల్లెళ్ల భవిష్యత్తు బాగుండాలని దీవించు అమ్మా..
శంకర్: ఒక్క నిమిషం నా తమ్ముళ్లను కూడా దీవించండి.
గౌరి: ఇక్కడ కూడా పోటీయేనా..?
శంకర్: లేకపోతే ఏంటండి.. అమ్మవారి ఆశీస్సులు మీకేనా మాకొద్దా.. అమ్మా ఒకరు ఐఏఎస్, ఐపీఎస్
అని చెప్పగానే జోగమ్మ అందరినీ దీవిస్తుంది. తర్వాత ఉదయం ఒకాయన వచ్చి మాకేదో ప్రయాణం ఉందని చెప్పాడు చెప్పినవన్నీ జరగొచ్చా..? అని అడుగుతాడు శంకర్. ఏమో ఏమైనా జరగొచ్చు అంటుంది. ఇంతలో శ్రీను వచ్చి తనకు పెళ్లి కుదిరిందని చెప్తాడు. అందరూ షాకింగ్ గా నీకు పెళ్లా.. అంటారు. అవునని మీరంతా నా పెళ్లికి అయోద్యపురం రావాలని పిలుస్తాడు శ్రీను. అయోద్యపురం అనగానే శంకర్, గౌరిలకు ఏదో గుర్తుకు వచ్చినట్టు నిలబడిపోతారు. జోగమ్మ శుభమస్తు అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు స్వామీజి దగ్గర ఉన్న రాకేష్ వినయ్తో తాను నాటకం ఆడింది మొత్తం చెప్తాడు.
స్వామిజీ: వాళ్లది జన్మజన్మల ప్రేమ. ఇద్దరిని ఒకేసారి చంపేయాలి. ఈసారి గురి అతని వైపు మళ్లించు. ఎక్కడైతే అతని గత జన్మ ముగిసిందో అక్కడే అతని ఆత్మశక్తి బలహీనం అవుతుంది. అదే నీ పగ తీర్చుకునేందుకు మంచి అవకాశం అవుతుంది.
రాకేష్: చాలు స్వామి గత జన్మలో మా నాన్న కారణంగా చచ్చాడు. ఈ జన్మలో నా చేతుల్లో చస్తాడు. మా నాన్న పగ తీరడానికి ఏ ఊరైతే కలిసి వచ్చిందో.. అదే ఊరు ఇప్పుడు నా పగ తీరడానికి ఆహ్వానిస్తుంది.
స్వామిజీ: ఒక్క విషయం గుర్తించుకో.. ఈ అవకాశం తప్పితే నీ గ్రహాలు నీకు ప్రతికూలిస్తాయి. అప్పుడు నువ్వేం చేసినా నీకు కలిసిరాదు కదా? తాడే పామై కాటేసే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త.
రాకేష్: అలాగే స్వామి.. అభయ్ తన తల్లిదండ్రులను చూడకముందే వాళ్లను అంతం చేస్తాను.
స్వామిజీ: మరో ముఖ్యమైన విషయం ఆ కుటుంబాన్ని ఒక ఆత్మ శక్తి కాపాడుతూ వస్తుంది. అష్టమి గడియల్లో ఆ శక్తి మరింత ఉదృతం అవుతుంది. ఆ శక్తి ముందు నీ కుతంత్రాలు నిలబడవు. ఆ కుటుంబానికి హాని చేస్తున్నావు అంటే ఆ శక్తి నిన్ను ప్రతిఘటించే ప్రయత్నం చేస్తుంది.
అని స్వామజీ హెచ్చరించడంతో సరే స్వామి అని వెళ్లిపోతాడు రాకేష్. తర్వాత అభయ్ వాళ్ల ఇంటికి వచ్చిన రాకేష్ తన మీద అనుమానం రాకుండా శంకర్ ను ఎలా చంపాలని ఆలోచిస్తుంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్: వ్రతంలో కూర్చోనన్న కావ్య – చచ్చే దాకా స్వప్నను భరిస్తానన్నా
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు






















