అన్వేషించండి

Prema Entha Madhuram  Serial Today October 16th: ‘ప్రేమ ఎంత మధురం’ సీరియల్‌: శంకర్‌ ను చంపేయమన్న స్వామీజీ – అయోద్యపురం వెళ్లేందుకు శంకర్‌, గౌరి రెడీ

Prema Entha Madhuram  Today Episode:  గౌరి, శంకర్‌ లను విడదీయడం కాదు వాళ్లిద్దరిని ఓకేసారి చంపేయాలని స్వామిజీ, రాకేష్‌ కు చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.

Prema Entha Madhuram  Serial Today Episode:  నన్ను రాకేష్‌ ఒప్పించాడు అని అభయ్‌ చెప్పగానే జెండే రాకేష్‌ను మెచ్చుకుంటాడు. రాకేష్‌ కూడా మనతో పాటు వస్తున్నాడని అభయ్‌ చెప్తాడు. అయితే మనతో పాటు జలంధర్‌ కొడుకు కూడా వస్తున్నాడని జెండే అనడంతో అందరూ షాక్‌ అవుతారు. వాడు కనిపిస్తే అక్కడే షూట్ చేస్తాను అని అభయ్‌ అంటాడు. మరోవైపు గౌరిని సంధ్య, ‌శ్రావణి… శంకర్‌ను పెద్దొడు, చిన్నొడు ఉదయాన్నే ఏదో సౌండ్‌ వినిపించిందని అడుగుతారు. మనకు ఏదో ప్రయాణం ఉందని ఏవరో స్వామిజీ వచ్చి చెప్పాడు అని ఇద్దరు చెప్తారు. ఇంతలో జోగమ్మ రావడంతో గౌరి వాళ్లు బయటకు వస్తారు.

జోగమ్మ: అమ్మా ఆశీర్వాదం అందజేయమని ఆజ్క్షాపించింది. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అమ్మా ఆశీర్వాదం తీసుకో..

గౌరి: అలాగే జోగమ్మా..

జోగమ్మ: అమ్మను ఏంటి అలా తదేకంగా చూస్తున్నావు.

గౌరి: అదే అమ్మతో నాకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందనిపిస్తుంది. అమ్మ నాతో ఏదో మాట్లాడాలి అన్నట్టు అనిపిస్తుంది.

జోగమ్మ: ఒక్కసారి అమ్మ పాదాలు పట్టుకుంటే అంతే ఎన్ని జన్మలకైనా అమ్మ నీ చేయి వీడదు. అమ్మ అనుగ్రహం నీకెప్పుడూ ఉంటుంది.

గౌరి: నా చెల్లెళ్ల భవిష్యత్తు బాగుండాలని దీవించు అమ్మా..

శంకర్‌: ఒక్క నిమిషం నా తమ్ముళ్లను కూడా దీవించండి.

గౌరి: ఇక్కడ కూడా పోటీయేనా..?

శంకర్‌: లేకపోతే ఏంటండి.. అమ్మవారి ఆశీస్సులు మీకేనా మాకొద్దా.. అమ్మా ఒకరు ఐఏఎస్‌, ఐపీఎస్‌

  అని చెప్పగానే జోగమ్మ అందరినీ దీవిస్తుంది. తర్వాత ఉదయం ఒకాయన వచ్చి మాకేదో ప్రయాణం ఉందని చెప్పాడు చెప్పినవన్నీ జరగొచ్చా..? అని అడుగుతాడు శంకర్‌. ఏమో ఏమైనా జరగొచ్చు అంటుంది. ఇంతలో శ్రీను వచ్చి తనకు పెళ్లి కుదిరిందని చెప్తాడు. అందరూ షాకింగ్‌ గా నీకు పెళ్లా.. అంటారు. అవునని మీరంతా నా పెళ్లికి అయోద్యపురం రావాలని పిలుస్తాడు శ్రీను. అయోద్యపురం అనగానే శంకర్‌, గౌరిలకు ఏదో గుర్తుకు వచ్చినట్టు నిలబడిపోతారు. జోగమ్మ శుభమస్తు అని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు స్వామీజి దగ్గర ఉన్న రాకేష్‌ వినయ్తో తాను నాటకం ఆడింది మొత్తం చెప్తాడు.

స్వామిజీ: వాళ్లది జన్మజన్మల ప్రేమ. ఇద్దరిని ఒకేసారి చంపేయాలి. ఈసారి గురి అతని వైపు మళ్లించు. ఎక్కడైతే అతని గత జన్మ ముగిసిందో అక్కడే అతని ఆత్మశక్తి బలహీనం అవుతుంది. అదే నీ పగ తీర్చుకునేందుకు మంచి అవకాశం అవుతుంది.

రాకేష్‌: చాలు స్వామి గత జన్మలో మా నాన్న కారణంగా చచ్చాడు. ఈ జన్మలో నా చేతుల్లో చస్తాడు. మా నాన్న పగ తీరడానికి ఏ ఊరైతే కలిసి వచ్చిందో.. అదే ఊరు ఇప్పుడు నా పగ తీరడానికి ఆహ్వానిస్తుంది.

స్వామిజీ: ఒక్క విషయం గుర్తించుకో.. ఈ అవకాశం తప్పితే నీ గ్రహాలు నీకు ప్రతికూలిస్తాయి. అప్పుడు నువ్వేం చేసినా నీకు కలిసిరాదు కదా? తాడే పామై కాటేసే ప్రమాదం కూడా ఉంది జాగ్రత్త.

రాకేష్‌: అలాగే స్వామి.. అభయ్‌ తన తల్లిదండ్రులను చూడకముందే వాళ్లను అంతం చేస్తాను.

స్వామిజీ: మరో ముఖ్యమైన విషయం ఆ కుటుంబాన్ని ఒక ఆత్మ శక్తి కాపాడుతూ వస్తుంది. అష్టమి గడియల్లో ఆ శక్తి మరింత ఉదృతం అవుతుంది. ఆ శక్తి ముందు నీ కుతంత్రాలు నిలబడవు. ఆ కుటుంబానికి హాని చేస్తున్నావు అంటే ఆ శక్తి నిన్ను ప్రతిఘటించే ప్రయత్నం చేస్తుంది.

అని స్వామజీ హెచ్చరించడంతో సరే స్వామి అని వెళ్లిపోతాడు రాకేష్‌. తర్వాత అభయ్ వాళ్ల ఇంటికి వచ్చిన రాకేష్‌ తన మీద అనుమానం  రాకుండా శంకర్‌ ను ఎలా చంపాలని ఆలోచిస్తుంటాడు.  దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  వ్రతంలో కూర్చోనన్న కావ్య – చచ్చే దాకా స్వప్నను భరిస్తానన్నా

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Meghasandesam Serial Today march 14th:‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
‘మేఘసందేశం’ సీరియల్‌: శివ, బిందుల పెళ్లి చేస్తానన్న అపూర్వ – ఆనందంలో బిందు
Brahmamudi Serial Today march 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
‘బ్రహ్మముడి’ సీరియల్: అపర్ణ రూం చెక్‌ చేసిన భ్రమరాంభ – భయంతో వణికిపోయిన అపర్ణ
Nindu Manasulu Serial Today March14th: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
నిండుమనసులు: సిద్దూ ప్రాణాల మీదకు తెచ్చావని ప్రేరణను అనరాని మాటలు అన్న సిద్దూ తల్లి...అయినా తన రక్తం ఇచ్చి సిద్దూ ప్రాణాలు కాపాడిన ప్రేరణ
Illu Illalu Pillalu Serial Today March 14th: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వేరే అమ్మాయితో తిరుగుతున్న విశ్వను చూసిన ధీరజ్ ఏం చేశాడు...? మేనల్లుడు చేసిన పనికి భద్రావతి రియాక్షన్ ఏంటి..?

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget