అన్వేషించండి

Jagadhatri Serial Today July 25th: జగద్ధాత్రి సీరియల్: జగద్ధాత్రి మాస్టర్ ప్లాన్.. ఆదిలక్ష్మిని నమ్మించి తికమక పెట్టేసిందిగా.. సురేష్‌ను రక్షిస్తుందా?

Jagadhatri Serial Today Episode July 25th జగద్ధాత్రి, కేథార్‌లు సురేశ్‌ని రాజు మర్డర్ కేసు గురించి అడగటం, ఆదిలక్ష్మీ బాబు విషయంలో గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి ఆదిలక్ష్మీని హాల్‌లో కూర్చొపెడుతుంది. సురేశ్ రావడం చూసిన జగద్ధాత్రి, కేథార్‌లు రాజు మర్డర్ కేసు గురించి అడగాలని సురేశ్ కూడా వర్క్ ఉందని రాత్రంతా ఇంటికి రాలేదని అనుకుంటారు. ఇక బాబు ఏడుస్తుంటే కౌషికి బాబు దగ్గరకు వెళ్తుంటుంది. దాంతో ఆదిలక్ష్మీ కౌషికి ఆపి నువ్వు బాబు దగ్గరకు వెళ్లడానికి వీల్లేదని చెప్తుంది.  

సురేశ్ వెళ్లాలని అనుకొని తల్లి మాటలు విని ఆగిపోతాడు. దాంతో కేథార్ నువ్వు ఉండు అక్క నేను వెళ్తాను అని చెప్పి సురేశ్‌కి వెళ్లమని సైగ చేస్తాడు. ఆదిలక్ష్మీకి బిందె అడ్డు ఉండటంతో సురేశ్ వెళ్లినట్లు ఆదిలక్ష్మీకి తెలీదు. ఆదిలక్ష్మీని మోసం చేస్తున్నారని నిజం చెప్దామని యువరాజ్ అంటే నిజం చెప్పడం కాదు ముందు ఆ బిందే తీసే ఏర్పాటు చేస్తే ఇక్కడ ఏం జరిగిందో తెలుస్తుందని వైజయంతి అంటుంది. ఇంతలో ఒకతను వచ్చి బర్త్‌ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు కదా డౌట్స్ వచ్చాయని అంటాడు. ఆదిలక్ష్మీ విని ఆ బాబు కౌషికి కొడుకు కాదని అంటుంది. సర్టిఫికేట్ ఇచ్చే అతన్ని ఆదిలక్ష్మీ పంపేస్తుంది. కౌషికి చాలా బాధ పడుతుంది. కన్నీరు పెట్టుకుంటుంది. నిషిక వాళ్లు నవ్వుకుంటారు.

జగద్ధాత్రి కౌషికి దగ్గరకు వెళ్తే కౌషికి ఏడిస్తూ ఒక్కసారి అతను ఆఫీస్‌లో ఈ విషయం చెప్తే బాబు నా కొడుకు అని నిరూపించుకోవడానికి చాలా కష్టపడాలి అంటుంది. జగద్ధాత్రి ఆ సర్టిఫికేట్ వచ్చేలా తాను చేస్తానని చెప్పి కేథార్‌కి ఏదో చెప్తుంది. కేథార్ నేను చూసుకుంటా అని చెప్పి వెళ్తాడు. జగద్ధాత్రి బయటకు వెళ్లి బాబుకి సర్టిఫికేట్ కావాలి అంటుంది. లోపల ఆ బాబు కాదని అన్నారు కదా అంటే అది వేరే బాబు కోసం మేం ఆ బాబుని చూపిస్తాం అని జగద్ధాత్రి అతన్ని లోపలికి తీసుకెళ్తుంది. ఆదిలక్ష్మీకి అతను వచ్చినట్లు తెలియాలని నిషిక చెప్తుంది. జగద్ధాత్రి ఆదిలక్ష్మీతో బాబు మనబాబు కాదని చెప్పడానికి వేరే ఇలా ఫాం నింపాలని అంటుంది. ఆదిలక్ష్మీకి మనవడు కాదని అసలు మనవడు లేదని అంటుంది. మనవడు కాని ఆ మనవడని చూపించాలని సర్టిఫికేట్ చేసే అతను అడిగితే బూచిని పిల్లాడి గెటప్ వేసి తీసుకొస్తారు. 

బూచిని చూసి నిషిక వాళ్లు షాక్ అయిపోతారు. సుధాకర్ నవ్వుతాడు. ఆదిలక్ష్మీ సర్టిఫికేట్ వద్దు అని చెప్పిన మనవడు బూచినే అని అందరూ చూపిస్తారు. ఇతనికి ఈ వయసులో సర్టిఫికేట్ ఇవ్వొద్దని చెప్పడమే కాదు ఇవ్వరు కూడా అని అంటాడు. మొత్తానికి సర్టిఫికేట్ ఇచ్చే అతన్ని కన్‌ఫ్యూజ్ చేస్తారు. పోయి పోయి వీళ్లు నాకే తగలాల అని అతను పారిపోతాడు. సురేశ్ జగద్ధాత్రితో మా అమ్మని భలే మాయ చేశావ్ బాబుకి సర్టిఫికేట్ ఇచ్చారని అంటాడు. 

నిషిక ఆదిలక్ష్మీతో విషయం చెప్తుంది. సర్టిఫికేట్ అప్లే చేశారా అని కోప్పడుతుంది. ఇక జగద్ధాత్రి సురేశ్‌కి రాజు గురించి అడుగుతుంది. రాజుని కలిశారా అంటే లేదు అని సురేశ్ అంటాడు. రాజుని ఎవరో మర్డర్ చేశారు లాస్ట్ కాల్ మీదే అని అంటారు. మీరు ఎందుకు కలవాలి అనుకున్నారు అని అడిగితే వీడు మా కొడుకే కదా మరి రిపోర్ట్స్‌ ఎలా మారిపోయావా అని అడుగుదామని కలవాలి అనుకున్నానని అంటాడు. రాజుని కలవాలని వెళ్లా ఎంత సేపటికి రాలేదు ఫోన్ స్విచ్‌ ఆఫ్ వచ్చిందని అంటాడు. నన్ను అరెస్ట్ చేస్తారా అని సురేశ్ అడిగితే దానికి కౌషికి లేదు జగద్ధాత్రి వాళ్లు ఒకరోజు గడువు అడిగారు ఈ లోపు జేడీ కేడీలు కేసు తేల్చేస్తామని అన్నారని చెప్తుంది. 

మరోవైపు యువరాజ్ ఓ వ్యక్తిని తీసుకొచ్చి ఆదిలక్ష్మీ బిందె తీయడానికి ప్రయత్నిస్తాడు. జగద్ధాత్రి వాళ్లు చూసి షాక్ అయిపోతారు. అతను ఆదిలక్ష్మీ బిందె తీసేస్తారు. ఆదిలక్ష్మీ సురేశ్‌ని పిలిచి సర్టిఫికేట్ కోసం సంతకం పెట్టావా అంటుంది లేదని సురేశ్ చెప్తాడు. మీరు నన్ను మోసం చేశారు అని ఆదిలక్ష్మీ అంటే జగద్ధాత్రి ఆ బాబు ఈ బాబు అంటూ మళ్లీ అదిలక్ష్మీని తికమక పెట్టేసి మీరు తెలివైన వారు మీకు ఎవరూ మాయచేయలేరు అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.   

Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఆదిత్య-దేవాల పోరాటం.. మిథునని తండ్రి తీసుకెళ్లిపోతాడా? సత్యమూర్తి దేవాకి ఏం చెప్పాడు?

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today June 3rd: జ్యూస్‌లో మందు కలిపింది ఎవరో నిరూపించిన సిద్ధూ....విజయానంద్‌ను అసహ్యించుకున్న మంజుల
నిండుమనసులు: జ్యూస్‌లో మందు కలిపింది ఎవరో నిరూపించిన సిద్ధూ....విజయానంద్‌ను అసహ్యించుకున్న మంజుల
Illu Illalu Pillalu Serial Today June 3rd:వల్లి ఎత్తులను చిత్తుచేసిన ధీరజ్‌...వేరుపడిన అన్నకు బుద్ధి చెప్పేలా ఝలక్‌ ఇచ్చిన ధీరజ్‌
ఇల్లు ఇల్లాలు పిల్లలు: వల్లి ఎత్తులను చిత్తుచేసిన ధీరజ్‌...వేరుపడిన అన్నకు బుద్ధి చెప్పేలా ఝలక్‌ ఇచ్చిన ధీరజ్‌
Podarillu Serial Today June3rd: కిడ్నాపర్ల నుంచి చక్రి ఎలా తప్పించుకున్నాడు...? ప్రతాప్‌కు మాధవ్‌ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?
పొదరిల్లు: కిడ్నాపర్ల నుంచి చక్రి ఎలా తప్పించుకున్నాడు...? ప్రతాప్‌కు మాధవ్‌ ఇచ్చిన వార్నింగ్ ఏంటి..?
Nithin Adwi: 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ చిన్నోడు.. నితిన్ అద్వి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ చిన్నోడు.. నితిన్ అద్వి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
Telangana AP Weather Alert June 2026: తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్‌! రెండు రోజుల్లో ఏపీలోకి నైరుతి ప్రవేశం!
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Embed widget