![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Guppedanta Manasu Serial Today April 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: బోర్డు మీటింగ్లో మనును అవమానించిన శైలేంద్ర – మీటింగ్ లోంచి వెళ్లిపోయిన మను
Guppedanta Manasu Today Episode: బోర్డు మీటింగ్ లో శైలేంద్ర వెటకారంగా మను తండ్రి గురించి మాట్లాడటంతో ఇవాళ్లీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
![Guppedanta Manasu Serial Today April 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: బోర్డు మీటింగ్లో మనును అవమానించిన శైలేంద్ర – మీటింగ్ లోంచి వెళ్లిపోయిన మను Guppedanta Manasu serial today episode April 1st written update Guppedanta Manasu Serial Today April 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: బోర్డు మీటింగ్లో మనును అవమానించిన శైలేంద్ర – మీటింగ్ లోంచి వెళ్లిపోయిన మను](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/01/a73d1013d530cda9bb1daf90cde6791c1711935562414879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guppedanta Manasu Serial Today Episode: కాలేజీకి స్టూడెంట్స్ తక్కువగా వస్తున్నారని ఇది కాలేజీకి మంచిది కాదని బోర్డు మీటింగ్ లో అందరూ చర్చిస్తుంటారు. కొంత మంది స్టూడెంట్స్ రుషి లేడన్న కారణంతో క్లాసులకు అటెండ్ కావడం లేదని కూడా తెలుస్తుందంటారు బోర్డు మెంబర్స్. అయితే స్టూడెట్స్ తో ఒకసారి మాట్లాడదామని మను ఐడియా చెప్తాడు. ఆల్రెడీ మాట్లాడామని బోర్డు మెంబర్ చెప్పగానే అయితే స్టూడెంట్స్ను బెదిరిద్దామని శైలేంద్ర చెప్పగానే..
ఫణీంద్ర: వార్నింగ్ ఇవ్వడం చాలా డేంజర్. వార్నింగ్ ఇస్తే వాళ్లు ఇంకా రెచ్చిపోతారు. వాళ్లను మచ్చిక చేసుకోవాలి అంతే
వసు: నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. మన కాలేజీలో పేరెంట్స్ , స్టూడెంట్స్ మీటింగ్ అరైంజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్. ఇది పేరెంట్స్ డీల్ చేస్తేనే కరెక్ట్ సార్.
బోర్డు మెంబర్: వాట్ ఏ విజన్, వాట్ ఏ థాట్ మేడం.
ఫణీంద్ర: సో మన కాలేజీలో అటెండెంట్స్ ఇంప్రూవ్ చేయడానికి పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం.
అని చెప్పగానే శైలేంద్ర ఇప్పుడు నాకు కరెక్టు పాయింట్ దొరికింది అని మనసులో అనుకుని పేరెంట్స్ అంటే మథర్, ఫాథర్ ఇద్దరూ రావాలి కదా? అయితే కొందరికి తల్లో.. తండ్రో లేని వాళ్లను పిలిపించడం కష్టం కదా కొంతమందికైతే తండ్రి ఎవరో కూడా తెలియదు. అనగానే మను కోపంగా వాటర్ గ్లాస్ పగులగొడతాడు. చేతికి బ్లడ్ వస్తుంటే మహేంద్ర వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసుకుందువు పదా అనగానే నేను వెళ్తాను మీరు మీటింగ్ కంటిన్యూ చేయండి అని మను వెళ్లిపోతాడు. పేరెంట్స్ మీటింగ్ అరైంజ్ మెంట్స్ చేయండి అని చెప్పి ఫణీంద్ర వెళ్లిపోతాడు. మమ్మీ నువ్వు చెప్పింది నిజమే వాడికి తండ్రి వీక్నెస్ ఉంది. ఇక మనుగాడికి మనుగడ లేకుండా చేస్తాను అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. మరోవైపు తన రూంలో కూర్చున్న మను కోపంగా శైలేంద్ర మాటలను గుర్తుచేసుకుంటూ ఉంటాడు. శైలేంద్ర ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని వస్తాడు.
శైలేంద్ర: రక్తం అంత పోతున్నా కూడా చలనం లేకుండా ఎలా ఉన్నావు బ్రదర్ నువ్వు.. పట్టు బ్రదర్ కట్టు కడతాను. ఎంటి బ్రదర్ నీకు బాధ ప్రస్టేషన్ ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు.
మను: ముందు నువ్వు ఇక్కణ్నుంచి వెళ్లు.
శైలేంద్ర: అదేంటి బ్రదర్ అలా అంటావు. నీకిలా దెబ్బ తగిలిందని నేనేదో ఓదార్పు కోసం వస్తే.. వెళ్లిపోమంటున్నావు.
మను: నన్నింకా రెచ్చగొట్టాలని చూడకు నేనేం చేస్తానో నాకే తెలియదు.
శైలేంద్ర: అంతలా రెచ్చిపోవద్దు బ్రదర్ మీ అమ్మగారు అనుపమ. మరి మీ నాన్న ఎవరు? సన్నాఫ్ అని ఎవరి పేరు రాయాలి. చెప్పు బ్రదర్ మీ నాన్న ఎవరు?
ఇంతలో మహేంద్ర, వసుధార అక్కడకు వస్తారు.
మహేంద్ర: శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు..
శైలేంద్ర: నేను వీళ్ల డాడీ గురించి మాట్లాడుతుంటే మీరొచ్చారేంటి? బాబాయ్. వసుధార ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చావా? నేను తీసుకొస్తేనే కట్టు కట్టుకోవడం లేదు.
మహేంద్ర: మను ముందు బ్లడ్ పోకుండా కట్టు కట్టుకో..
మను: అక్కర్లేదు.
అనగానే మహేంద్ర వెళ్లి మనుకు కట్టు కడతాడు. దీంతో శైలేంద్ర.. మను పార్సియాలిటీ చూపిస్తున్నారు. నేను ఇవి తీసుకొస్తే కట్టు కట్టుకోలేదు. నువ్వు తీసుకొస్తే కట్టుకున్నాడు. అంటూ వెటకారంగా మాట్లాడతాడు. మళ్లీ మనును మీ నాన్న గారు ఎవరు? మీకు ఎలా దూరం అయ్యారు అంటూ అడుగుతాడు. దీంతో మహేంద్ర కోపంగా ఎందుకు మనును విసిగిస్తున్నావు. తన తండ్రి ఎవరో తెలియకపోవడం తన లోపమే అంతమాత్రాన నువ్వు తనని అంటూ నేను కావాలని అనలేదు అంటూ మనును అంటాడు. దీంతో మను కోపంగా లోపం కాదు సార్ అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మే 3న ప్రేక్షకుల ముందుకు ‘జితేందర్ రెడ్డి’
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)