Puneeth Rajkumar Funeral: పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి.. తల్లిదండ్రుల సమాధుల పక్కనే ఖననం
పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయానికి అంతిమ యాత్ర నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున ఈ అంతిమ యాత్ర సాగింది. ఉదయం 4.30 గంటలకే అంతిమ యాత్ర మొదలుకాగా.. 16 కిలోమీటర్ల మేర జరిగింది.
కన్నడ సినీ పరిశ్రమలో అగ్ర నటుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. బెంగళూరులోని కంఠీరవ స్టూడియోలో పునీత్ రాజ్ కుమార్కు అంత్యక్రియలు జరిగాయి. తల్లిదండ్రులు పార్వతమ్మ, రాజ్ కుమార్ సమాధుల పక్కనే పునీత్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పునీత్ రాజ్కుమార్కు కుమారులు లేనందున పునీత్ అంత్యక్రియలను ఆయన అన్న కొడుకు వినయ్ రాజ్కుమార్ చేశారు.
Also Read: పునీత్ రాజ్కుమార్ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...
ఉదయం 4.30కే అంతిమ యాత్ర మొదలు
అంతకుముందు పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయానికి అంతిమ యాత్ర నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున ఈ అంతిమ యాత్ర సాగింది. ఉదయం 4.30 గంటలకే అంతిమ యాత్ర మొదలుకాగా.. 16 కిలోమీటర్ల మేర జరిగింది. ఆ సమయంలోనూ పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు తమ అభిమాన హీరోను చూసేందుకు తరలివచ్చారు. వేల మంది అభిమానుల మధ్య పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు సంప్రదాయ పద్ధతిలో జరిగాయి. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు.

పునీత్ భౌతిక కాయం వద్ద ముఖ్యమంత్రి బొమ్మై, మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఉండి నివాళులు అర్పించారు. గౌరవ సూచకంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా పునీత్ భౌతిక కాయంపై ఉంచిన జాతీయ పతాకాన్ని భార్యకు అందించారు. పునీత్ రాజ్ కుమార్ను ఖననం చేస్తున్న సమయంలో భార్యాపిల్లలు, సోదరుడు శివ రాజ్ కుమార్ సహా ఇతర కుటుంబ సభ్యులు దు:ఖాన్ని ఆపుకోలేకపోయారు. వారిని తోటివారు వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. పునీత్ భౌతిక కాయాన్ని సమాధిలో ఉంచగానే.. ఆయన్ను చివరిసారి చూసేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. ఆ సమయంలో అక్కడున్న అందరూ శోక సంద్రంలో మునిగిపోయారు. పునీత్ భార్య అశ్వినీ, కుమార్తెలు, సోదరుడు సహా కుటుంబ సభ్యులు విలపిస్తుండడం ప్రతి ఒక్కర్నీ కలచివేసింది.
Also Read: శాండిల్వుడ్కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?
నటుడు రవిచంద్రన్, సుదీప్, యష్, నటుడు రిషబ్ శెట్టి, టెన్నిస్ కృష్ణ, నటి, శ్రీజన్ లోకేష్, ఎంపీ సుమలత, యోగితో పాటు పలువురు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Also Read: అర్ధరాత్రి హైదరాబాద్లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?
Also Read: Balakrishna 'Unstoppable': బాలయ్య షోకి ఫస్ట్ గెస్ట్ ఎవరో తెలుసా..? రేపే ప్రోమో రిలీజ్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
Before You Go
Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు





















