అన్వేషించండి

Pawan Kalyan: విష్ణుకు పవన్ హగ్.. ఇదిగో ప్రూఫ్ అంటూ వీడియో పోస్ట్ చేసిన మంచువారి అబ్బాయి!

అలయ్ బలయ్ వేదికపై మంచు విష్ణు, పవన్ కళ్యాణ్‌లు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదంటూ మీడియాలో వచ్చిన వార్తలకు సమాధానంగా విష్ణు ఓ వీడియో వదిలారు.

అలయ్-బలయ్ వేదికపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదంటూ మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మంగళవారం ఓ వీడియో ట్వీట్ చేశారు. అయితే, విష్ణు మీడియాను విమర్శించకుండా.. అసలు జరిగింది ఇదంటూ ఆ వీడియోను పోస్ట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ మంచు విష్ణును హగ్ చేసుకోవడమే కాకుండా.. ఆయనతో మాట్లాడుతున్నట్లు కలిసింది.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు.. మెగా ఫ్యామిలీ Vs మంచు ఫ్యామిలీగా మారిన సంగతి తెలిసిందే. విష్ణు విజయం తర్వాత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు.. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయడం ఆశ్చర్యం కలిగించింది. అంతేగాక ప్రకాష్ రాజ్ ప్యానల్‌లో విజేతలుగా నిలిచిన మిగతా సభ్యులు సైతం మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. అయితే, వారి రాజీనామాలను తాను ఆమోదించబోనని, వారితో ఒకసారి మాట్లాడతానని సోమవారం తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో విష్ణు వెల్లడించాడు. తనకు కేవలం ప్రకాష్ రాజ్ నుంచి మాత్రమే రాజీనామా అందిందని, మిగతావారి రాజీనామాలేవీ తనకు అందలేదని విష్ణు స్పష్టం చేశారు. ‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి హాజరైన పవన్ కళ్యాణ్‌ తనతో మాట్లాడారని విష్ణు తెలిపారు. అయితే, మీడియాలో మాత్రం వేదికపై మౌనంగా కూర్చున్న విష్ణు, పవన్ కళ్యాణ్ వీడియోలను చూపిస్తూ ఇద్దరి మధ్య వైరం స్పష్టంగా కనిపిస్తోందనే వార్తలను ప్రసారం చేయడం గమనార్హం. దీనిపై ప్రజలు మీడియాను కూడా తప్పుబడుతున్నారు.

Also Read: అందుకే పవన్‌తో మాట్లాడలేదు.. ఎవరుపడితే వాళ్లు ‘మా’లో సభ్యులు కాకూడదు: విష్ణు

సీసీటీవీ కెమేరాల వివాదం: ‘మా’ ఎన్నికల నిర్వాహణపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ ప్రకాష్ రాజ్, ఆయన ప్యానల్ సభ్యులు సోమవారం జూబ్లీ హిల్స్ హైస్కూల్‌కు వెళ్లారు. అక్కడ సీసీటీవీ వీడియోలను పరిశీలించిన తర్వాత ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికల నిర్వహణాధికారి వద్ద మరో ఏడు సీసీటీవీ కెమేరా వీడియోలు ఉన్నాయని.. వాటిని కూడా పరిశీలించిన తర్వాతే తాను మాట్లాడతానని తెలిపారు. అయితే, ఎన్నికల అధికారి ఆ వీడియోల కోసం కోర్టు నుంచి అనుమతి తెచ్చుకోవాలని పేర్కొన్నారు. పైగా, విష్ణు ప్యానల్ సభ్యులు తిరుపతి పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆ వీడియోలను చూపించలేమని పేర్కొన్నట్లు సమాచారం. 

Also Read: ‘మా’ గొడవ.. విష్ణుతో కాదు, ఈసీతోనే సమస్య.. సీసీటీవీ వీడియోల కోసం ప్రకాష్ రాజ్ పట్టు

Also Read: చేసింది చాలు రెచ్చగొట్టొద్దు .. మోహన్ బాబు కామెంట్స్ వైరల్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
Embed widget